యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది. కసాయి కత్తికి బలి కావాల్సిన ఒక గొర్రె రెండు మతాల మధ్య విద్వేషాలకు కారణమవుతుంది. దాన్ని ఏకంగా జైల్లో వేస్తే సాటి ఖైదీగా ఉన్న హీరో కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతాడు.
స్థూలంగా ఇదీ కథ. పాయింట్ వెరైటీగా ఉంది కానీ ఎంతమేరకు థియేటర్ ఆడియన్స్ ని మెప్పిస్తుందనేది కంటెంట్ బాగుండటం మీద ఆధారపడి ఉంది. ప్రమోషన్లు భీభత్సంగా చేయడం లేదు. బజ్ కూడా అంతంత మాత్రమే. అవుట్ డోర్ పబ్లిసిటీ జరుగుతున్నా రీచ్ పూర్తి స్థాయిలో లేదు.
ఇప్పుడు లక్కు, చిక్కు విషయానికి వద్దాం. ముందుగా కలిసి వచ్చే అంశం ఏంటంటే బాగుందంటే చాలు చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతోంది. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు దాన్నే ఋజువు చేశాయి. గతంలో ఇదే సుహాస్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు డీసెంట్ గా వర్కౌట్ అయ్యింది.
సో గొర్రె పురాణంకు టాక్ చాలా కీలకం. ఇక చిక్కు సంగతి చూస్తే వారం తిరక్కుండానే దేవర పార్ట్ 1 వస్తుంది. దీని మీద నెలకొన్న అంచనాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక థియేటర్లలో దీన్నే ప్రదర్శించబోతున్నారు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే పోటీలో ఎవరూ నిలబడే ప్రసక్తే ఉండదు.
సో గొర్రె పురాణం ఒక పాజిటివ్, ఒక నెగటివ్ పరిస్థితుల మధ్య నెగ్గుకురావాల్సి ఉంటుంది. అదే రోజుగా పోటీగా చెప్పుకోదగ్గవి లేకపోవడం మరో ప్లస్ పాయింట్. ఈ అవకాశం ఉందనే దిల్ రాజు బొమ్మరిల్లు రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దీన్నీ కాచుకోవాల్సి ఉంటుంది.
బాబీ దర్శకత్వం వహించిన గొర్రె పురాణంలో పాటలు పెద్దగా ఉన్నట్టు లేవు. బాగుంటే బజ్ కు తోడ్పడేవి. సుహాస్ ఈ సినిమా పట్ల ఎంత సీరియస్ గా ఉన్నాడో ఈ నాలుగు రోజులు చేయబోయే ప్రమోషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో ఇరవై రోజులు తిరగడం ఆలస్యం అక్టోబర్ 11 మరో చిత్రం జనక అయితే గనక రిలీజ్ కు వచ్చేస్తుంది.
This post was last modified on September 16, 2024 6:56 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…