Movie News

బాలు మరణం: టాలీవుడ్ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలకు తోడు.. అనేకమంది సినీ ప్రముఖులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో శ్రీరెడ్డి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మొదట్లో ఆమె ఏం మాట్లాడినా, ఏ ఆరోపణలు చేసినా జనాలు ఆసక్తిగా విన్నారు కానీ.. ఒక దశ దాటాక మరీ శ్రుతిమించిపోవడం, దారుణమైన మాటలు, చర్యలకు దిగడంతో లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.

తర్వాత ఆమె హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోయి మన జనాలతో డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పుడప్పుడూ ఫేస్ బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది కానీ.. దాన్ని పట్టించుకున్నవారు తక్కువే.

కానీ ఇప్పుడు శ్రీరెడ్డి ఒక ముఖ్యమైన విషయం మీద ఫేస్ బుక్‌‌లో పెట్టిన వీడియో చర్చనీయాంశమైంది. ఆమె మాటలకు మంచి స్పందన కూడా రావడం గమనార్హం. గాన గంధర్వుడు ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడంపై శ్రీరెడ్డి పెట్టిన వీడియో ఇది. చెన్నైలోనే ఉన్న శ్రీరెడ్డి బాలు అంత్యక్రియలకు హాజరైంది.

ఐతే అక్కడ టాలీవుడ్ నుంచి ఎవరూ కనిపించకపోవడం చాలా బాధ కలిగించిందని, మన సినీ పరిశ్రమను అక్కడి జనాలు చాలా తిట్టుకున్నారని.. ఒక తెలుగు నటిగా తన పరువు పోయిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయమై ఆమె టాలీవుడ్ ప్రముఖులను తీవ్ర స్థాయిలో తిట్టిపోసింది.

‘‘బాలు గారి మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్లను స్టార్లను చేశారు. కానీ ఆయన చనిపోతే ఒక్కరూ రాలేదు. ‘మా ’అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? ఆ బోడి గుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? మీ కొడుకులను, మేనల్లుళ్లను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ద.. ఇంత పెద్ద గాన గంధర్వుడు పోతే వెళ్లడంలో లేదా? ఒక్క నా కొడుకూ రాలేదని తమిళనాడులో టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ల అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరిచూపు చూడలేరా? షేమ్ షేమ్.. చెన్నైలో నా పరువు పోయింది. నేను బాలు గారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను.. తెలుగు నటిగా చెప్పుకోవడాని సిగ్గుపడుతున్నా’’ అని శ్రీరెడ్డి అంది.

This post was last modified on September 29, 2020 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago