చిరంజీవి – రమ్యకృష్ణ కాంబినేషన్ అప్పట్లో మాస్ని ఉర్రూతలూగించింది. రజనీకాంత్ ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్ లాంటిది చిరంజీవి సినిమాలో వుంటే భలే వుంటుందని ఫాన్స్ ఆశ పడినా మన దర్శకులెవరూ అలాంటి ఐడియాలతో ముందుకు రాలేదు.
నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ కాకపోయినా కొంచెం ఆ సినిమాను తలపించే పాత్రల్లో ఈ ఇద్దరూ త్వరలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. లూసిఫర్ రీమేక్లో మంజు వారియర్ ఒరిజినల్లో చేసిన క్యారెక్టర్కి తెలుగులో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని వినాయక్ సూచించినట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర చాలా ఎఫెక్టివ్గా వుంటుంది. రమ్యకృష్ణ ఆ పాత్రకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
ఆచార్య తర్వాత ఏ సినిమా ముందుగా మొదలు పెట్టాలనేది చిరంజీవి డిసైడ్ చేయకపోయినా అటు మెహర్ రమేష్, ఇటు వినాయక్ తమకు అప్పగించిన రీమేక్స్ కోసం సర్వం సిద్ధం చేసేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను చిరంజీవి ప్యారలల్గా చేస్తారని, రెండూ మూడు నెలల విరామంలో విడుదలవుతాయని కూడా చెబుతున్నారు.
This post was last modified on September 29, 2020 5:06 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…