చిరంజీవి – రమ్యకృష్ణ కాంబినేషన్ అప్పట్లో మాస్ని ఉర్రూతలూగించింది. రజనీకాంత్ ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్ లాంటిది చిరంజీవి సినిమాలో వుంటే భలే వుంటుందని ఫాన్స్ ఆశ పడినా మన దర్శకులెవరూ అలాంటి ఐడియాలతో ముందుకు రాలేదు.
నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ కాకపోయినా కొంచెం ఆ సినిమాను తలపించే పాత్రల్లో ఈ ఇద్దరూ త్వరలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. లూసిఫర్ రీమేక్లో మంజు వారియర్ ఒరిజినల్లో చేసిన క్యారెక్టర్కి తెలుగులో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని వినాయక్ సూచించినట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర చాలా ఎఫెక్టివ్గా వుంటుంది. రమ్యకృష్ణ ఆ పాత్రకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
ఆచార్య తర్వాత ఏ సినిమా ముందుగా మొదలు పెట్టాలనేది చిరంజీవి డిసైడ్ చేయకపోయినా అటు మెహర్ రమేష్, ఇటు వినాయక్ తమకు అప్పగించిన రీమేక్స్ కోసం సర్వం సిద్ధం చేసేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను చిరంజీవి ప్యారలల్గా చేస్తారని, రెండూ మూడు నెలల విరామంలో విడుదలవుతాయని కూడా చెబుతున్నారు.
This post was last modified on September 29, 2020 5:06 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…