చిరంజీవి – రమ్యకృష్ణ కాంబినేషన్ అప్పట్లో మాస్ని ఉర్రూతలూగించింది. రజనీకాంత్ ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్ లాంటిది చిరంజీవి సినిమాలో వుంటే భలే వుంటుందని ఫాన్స్ ఆశ పడినా మన దర్శకులెవరూ అలాంటి ఐడియాలతో ముందుకు రాలేదు.
నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ కాకపోయినా కొంచెం ఆ సినిమాను తలపించే పాత్రల్లో ఈ ఇద్దరూ త్వరలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. లూసిఫర్ రీమేక్లో మంజు వారియర్ ఒరిజినల్లో చేసిన క్యారెక్టర్కి తెలుగులో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని వినాయక్ సూచించినట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర చాలా ఎఫెక్టివ్గా వుంటుంది. రమ్యకృష్ణ ఆ పాత్రకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
ఆచార్య తర్వాత ఏ సినిమా ముందుగా మొదలు పెట్టాలనేది చిరంజీవి డిసైడ్ చేయకపోయినా అటు మెహర్ రమేష్, ఇటు వినాయక్ తమకు అప్పగించిన రీమేక్స్ కోసం సర్వం సిద్ధం చేసేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను చిరంజీవి ప్యారలల్గా చేస్తారని, రెండూ మూడు నెలల విరామంలో విడుదలవుతాయని కూడా చెబుతున్నారు.
This post was last modified on September 29, 2020 5:06 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…