అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్ హిట్ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్ సిండ్రోమ్కి గురయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్ తిరుమల.
చిత్రలహరి తర్వాత రామ్తో రెడ్ తీసిన కిషోర్ ఆమధ్య వెంకటేష్తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్ భావిస్తున్నాడట.
ఇప్పటికే ఆమెతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్ చేస్తున్నారు.
This post was last modified on September 29, 2020 3:47 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…