Movie News

శర్వానంద్‍ కోసం మళ్లీ సాయి పల్లవి దిగుతోంది!

అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్‍ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్‍ హిట్‍ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్‍ సిండ్రోమ్‍కి గురయి బాక్సాఫీస్‍ వద్ద డిజాస్టర్‍ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్‍ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్‍ తిరుమల.

చిత్రలహరి తర్వాత రామ్‍తో రెడ్‍ తీసిన కిషోర్‍ ఆమధ్య వెంకటేష్‍తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్‍కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్‍కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్‍ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్‍ క్యారెక్టర్‍ చాలా ఇంపార్టెంట్‍ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్‍ భావిస్తున్నాడట.

ఇప్పటికే ఆమెతో ఫోన్‍ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‍గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్‍ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్‍ చేస్తున్నారు. పర్‍ఫార్మెన్స్ కి స్కోప్‍ వున్న క్యారెక్టర్‍ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్‍ చేస్తున్నారు.

This post was last modified on September 29, 2020 3:47 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

1 hour ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago