అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్ హిట్ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్ సిండ్రోమ్కి గురయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్ తిరుమల.
చిత్రలహరి తర్వాత రామ్తో రెడ్ తీసిన కిషోర్ ఆమధ్య వెంకటేష్తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్ భావిస్తున్నాడట.
ఇప్పటికే ఆమెతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్ చేస్తున్నారు.
This post was last modified on September 29, 2020 3:47 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…