అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్ హిట్ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్ సిండ్రోమ్కి గురయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్ తిరుమల.
చిత్రలహరి తర్వాత రామ్తో రెడ్ తీసిన కిషోర్ ఆమధ్య వెంకటేష్తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్ భావిస్తున్నాడట.
ఇప్పటికే ఆమెతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్ చేస్తున్నారు.
This post was last modified on September 29, 2020 3:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…