అప్పట్లో సాయి పల్లవికి వున్న క్రేజ్ రీత్యా ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో శర్వానంద్ హిట్ కొట్టేస్తాడనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం సెకండాఫ్ సిండ్రోమ్కి గురయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే శర్వా, సాయి పల్లవి జంట బాగుందనే టాక్ వరకు తెచ్చుకోగలిగింది. ఈ జంటను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నాల్లో వున్నాడట కిషోర్ తిరుమల.
చిత్రలహరి తర్వాత రామ్తో రెడ్ తీసిన కిషోర్ ఆమధ్య వెంకటేష్తో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే సినిమా చేద్దామని చూసాడు. కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను శర్వానంద్కు అనుగుణంగా మార్చి అతడికి చెప్పాడని, శర్వానంద్కి కథ నచ్చిందని సమాచారం. శ్రీకారం, మహాసముద్రం సినిమాల తర్వాత శర్వానంద్ ఇదే సినిమా మొదలు పెడతాడట. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కనుక సాయి పల్లవి అయితే బెస్ట్ అని కిషోర్ భావిస్తున్నాడట.
ఇప్పటికే ఆమెతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని, ఆమె పూర్తి కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని వార్తలొస్తున్నాయి. కొంత కాలం పాటు సాయి పల్లవి డిమాండ్ తగ్గినట్టే అనిపించినా ఇప్పుడు చాలా సినిమాలకు ఆమెనే కథానాయికగా కన్సిడర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ అనగానే సాయి పల్లవినే ప్రిఫర్ చేస్తున్నారు.
This post was last modified on September 29, 2020 3:47 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…