హీరోయిన్గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ తారాగణం. సంగీతం అందించింది అనూప్ రూబెన్స్ అయితే.. రసూల్ ఎల్లోర్ లాంటి ఫేమస్ సినిమాటోగ్రాఫర్ ఛాయాగ్రహణ బాధ్యతలు చూసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్కు కూడా ఢోకా ఏమీ లేదు. ఒక కొత్త హీరో లాంచింగ్ కోసం ఇలా ప్యాడింగ్ గట్టిగానే చేశారు. కానీ ఇన్ని ఉన్నా కథలో విషయం లేకపోవడం, ఔట్ డేటెడ్ నరేషన్ పుణ్యమా అని ‘ఉత్సవం’ అనే సినిమా పేలవంగా తయారైంది.
దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ అర్జున్ సాయి అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమా ఇది. శుక్రవారం ‘మత్తువదలరా’, ‘భలే ఉన్నాడే’తో పాటుగా ఈ మూవీ కూడా రిలీజైంది. హీరో కొత్తవాడైనా కలర్ ఫుల్ ప్రోమోలు.. ఆకర్షణీయ కాస్టింగ్ వల్ల ఈ సినిమా కొంతమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఐతే కనుమరుగైపోతున్న నాటక కళను కొత్త తరానికి పరిచయం చేసి దానికి పూర్వ వైభవం తీసుకురావడం అనే బ్యాక్డ్రాప్లో ఒక ప్రేమకథను నరేట్ చేయాలన్న దర్శకుడి ఉద్దేశం మంచిదే అయినా.. తలా తోకా లేకుండా సాగే కథనం.. ఔట్ డేటెడ్ నరేషన్ కారణంగా ఈ చిత్రం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఒక సీన్కు ఇంకో సీన్కు సంబంధం లేకుండా సాగుతూ సినిమా బాగా బోర్ కొట్టించేసింది. బహుశా ఇది హీరో సొంత ప్రొడక్షన్ అయి ఉండొచ్చు.
ఖర్చుకు వెనకాడకుండా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లను తీసుకుని అన్ని హంగులూ జోడించినా.. కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకపోవడంతో పేరులో ఉన్న ‘ఉత్సవం’ సినిమాలో లేక ప్రేక్షకులు నీరసించిపోయారు. ఐతే సినిమా చూసిన వాళ్లు మాత్రం ఏ బ్యాగ్రౌండ్ లేని హీరోను లాంచ్ చేస్తూ చిన్న స్థాయిలో చూసుకోకుండా విషయం లేని కథ మీద ఇంత ప్యాడింగ్ జోడించి కోట్లు వృథా చేశారే అని ఫీలయ్యే పరిస్థితి.
This post was last modified on September 14, 2024 2:23 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…