Movie News

మళ్లీ ఫిలిం సిటీకి రాజమౌళి

రాజమౌళి ‘బాహుబలి’ అనే భారీ కలను కని, దానికి దృశ్య రూపం ఇవ్వడంలో ఎంతో తోడ్పాటు అందించిన ప్రదేశం.. రామోజీ ఫిలిం సిటీ. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫిలిం స్టూడియోలో సినిమా చిత్రీకరణకు లేని సౌకర్యం లేదు.

ఎంత భారీ ప్రదేశం కావాలన్నా.. ఎంత పెద్ద సెట్ వేయాలన్నా.. ఎంతమందిని అకామొడేట్ చేయాలన్నా ఫిలిం సిటీలో ఢోకా ఉండదు. పైగా జనాలతో ఇబ్బంది అసలే ఉండదు. ప్రశాంతంగా ఎన్ని రోజులైనా చిత్రీకరణ జరుపుకోవచ్చు.

కాకపోతే వేరే స్టూడియోలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు, రూల్స్ కొంచెం ఎక్కువ అన్నదే కంప్లైంట్. ఇక్కడే మాహష్మతి సామ్రాజ్యానికి సంబంధించి భారీ సెట్ వేసి ‘బాహుబలి’ మెజారిటీ షూట్ జరిపాడు జక్కన్న. అన్ని రకాల అద్దెల కింద ఫిలిం సిటీకి మాత్రమే బడ్జెట్లో ఒక పావు వంతు నిర్మాతలు ఇచ్చి ఉంటారని అంటారు. ఈ క్రమంలోనే రామోజీరావుతో జక్కన్నకు ఎంతో సాన్నిహిత్యం కూడా ఏర్పడింది.

కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఫిలిం సిటీకి వెళ్లలేదు జక్కన్న. ‘బాహుబలి’ బిల్స్, డిజిటల్ డీల్స్ విషయంలో ఎక్కడో చిన్న విభేదాలు వచ్చాయని.. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పూర్తిగా బయటే చేశారని.. ఫిలిం సిటీకి వెళ్లలేదని అంటారు.

ఆ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో కానీ.. ఇప్పుడు మాత్రం జక్కన్న చూపు తిరిగి ఫిలిం సిటీ మీద పడ్డట్లు సమాచారం. మహేష్ బాబుతో తాను చేయబోయే కొత్త చిత్రం షూట్ చాలా వరకు ఫిలిం సిటీలోనే చేయబోతున్నారట. ఇందుకోసం అక్కడ సెట్ వర్క్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.

కొన్ని నెలల కిందటే రామోజీ రావు మరణించడం.. ఆయన మీద రాజమౌళి తన గౌరవ భావాన్ని చాటడం తెలిసిందే. ఏవైనా పంతాలు ఉన్నా అవి రామోజీ మరణంతోనే పక్కకు వెళ్లిపోయి ఉంటాయి. దీంతో మళ్లీ ఫిలిం సిటీలో షూట్‌కు జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. జనవరి నుంచే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని అంటున్నారు.

This post was last modified on September 12, 2024 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

19 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago