మేమంతా ఒకటేనని టాలీవుడ్ హీరోలు వేదికలెక్కి మరీ మొత్తుకున్నా చాలా మంది అభిమానులు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదాని వీలైనంత బురద జల్లి, సినిమా ఫలితాన్ని మేమేదో శాశించగలం అనే భ్రమలో ఉండిపోతున్నారు. దేవర ట్రైలర్ మీద రెండు రోజులుగా జరుగుతున్న డిబేట్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. పట్టుమని మూడు నిముషాలు కూడా లేని వీడియోని పట్టుకుని ఏకంగా బాక్సాఫీస్ తీర్పులు ఇచ్చేస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ ని ఆధారంగా చేసుకుని ఏదో ఋజువు చేయాలని అక్కర్లేని ప్రయత్నం చేస్తున్నారు. మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నారు.
మా హీరో సినిమా వచ్చినప్పుడు మీరు ట్రోలింగ్ చేశారు కాబట్టి దానికి రెట్టింపు మీ హీరోది రిలీజైనప్పుడు మేమూ చేస్తామని అనుకోవడం మూర్ఖత్వం. బాగున్న మూవీని ఏదో ఒక వర్గం లేదా సమూహం ప్రభావితం చేసి హిట్టు లేదా ఫ్లాపు చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. బాగుంటే వద్దన్నా ప్రేక్షకులు వస్తారు. నొక్కి చెప్పకపోయినా థియేటర్లకు ఎగబడతారు. గత నెల రవితేజ, రామ్ లు చేతులు ఎత్తేస్తే స్వాతంత్ర దినోత్సవానికి హిట్లు ఇచ్చింది కుర్ర హీరోలు, కొత్త దర్శకులే కదా. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు కేవలం స్టార్లు చేశారని ఆడినవి కాదు. అలాంటప్పుడు సామాజిక మాధ్యమాల్లో వాదులాడుకోవడం అర్థరహితం.
ఈ సమస్య ఇప్పుడిది కాదు. కేవలం తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య మాత్రమే జరుగుతున్నది కాదు. సందర్భాన్ని బట్టి అందరి అభిమానులు వీటిలో భాగమవుతున్న వాళ్లే. ట్రోలింగ్ చేస్తేనో లేదా దర్శకులను హీరోలను ఎగతాళి చేస్తేనే తమకేదో గొప్ప తెలివి తేటలు ఉన్నట్టు ఫీలవ్వడం కన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రోజు దేవర. రేపు పుష్ప 2. ఆ తర్వాత గేమ్ ఛేంజర్, అటుపై విశ్వంభర, బాలయ్య 109 ఇలా ఈ చైన్ కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండే స్టార్లను చూసైనా అభిమానులు మారాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి తరాలు ప్రభావితం చెందుతాయి.
This post was last modified on September 12, 2024 3:04 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…