మేమంతా ఒకటేనని టాలీవుడ్ హీరోలు వేదికలెక్కి మరీ మొత్తుకున్నా చాలా మంది అభిమానులు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదాని వీలైనంత బురద జల్లి, సినిమా ఫలితాన్ని మేమేదో శాశించగలం అనే భ్రమలో ఉండిపోతున్నారు. దేవర ట్రైలర్ మీద రెండు రోజులుగా జరుగుతున్న డిబేట్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. పట్టుమని మూడు నిముషాలు కూడా లేని వీడియోని పట్టుకుని ఏకంగా బాక్సాఫీస్ తీర్పులు ఇచ్చేస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ ని ఆధారంగా చేసుకుని ఏదో ఋజువు చేయాలని అక్కర్లేని ప్రయత్నం చేస్తున్నారు. మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నారు.
మా హీరో సినిమా వచ్చినప్పుడు మీరు ట్రోలింగ్ చేశారు కాబట్టి దానికి రెట్టింపు మీ హీరోది రిలీజైనప్పుడు మేమూ చేస్తామని అనుకోవడం మూర్ఖత్వం. బాగున్న మూవీని ఏదో ఒక వర్గం లేదా సమూహం ప్రభావితం చేసి హిట్టు లేదా ఫ్లాపు చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. బాగుంటే వద్దన్నా ప్రేక్షకులు వస్తారు. నొక్కి చెప్పకపోయినా థియేటర్లకు ఎగబడతారు. గత నెల రవితేజ, రామ్ లు చేతులు ఎత్తేస్తే స్వాతంత్ర దినోత్సవానికి హిట్లు ఇచ్చింది కుర్ర హీరోలు, కొత్త దర్శకులే కదా. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు కేవలం స్టార్లు చేశారని ఆడినవి కాదు. అలాంటప్పుడు సామాజిక మాధ్యమాల్లో వాదులాడుకోవడం అర్థరహితం.
ఈ సమస్య ఇప్పుడిది కాదు. కేవలం తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య మాత్రమే జరుగుతున్నది కాదు. సందర్భాన్ని బట్టి అందరి అభిమానులు వీటిలో భాగమవుతున్న వాళ్లే. ట్రోలింగ్ చేస్తేనో లేదా దర్శకులను హీరోలను ఎగతాళి చేస్తేనే తమకేదో గొప్ప తెలివి తేటలు ఉన్నట్టు ఫీలవ్వడం కన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రోజు దేవర. రేపు పుష్ప 2. ఆ తర్వాత గేమ్ ఛేంజర్, అటుపై విశ్వంభర, బాలయ్య 109 ఇలా ఈ చైన్ కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండే స్టార్లను చూసైనా అభిమానులు మారాల్సిన అవసరం ఉంది. లేదంటే తర్వాతి తరాలు ప్రభావితం చెందుతాయి.
This post was last modified on September 12, 2024 3:04 pm
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…