కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు జేసన్ విజయ్ నటన కంటే దర్శకత్వం వైపే మొగ్గు చూపుతున్నాడు. ఈ విభాగంలో ఋజువు చేసుకున్నాక హీరోగా ట్రై చేస్తాడేమో చూడాలి. ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంతో పాటు ఇంకొక్క సినిమా చేసి పూర్తి స్థాయి రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న తండ్రి అభిమానులు స్క్రీన్ మీద కొరత ఫీలవ్వకూడదంటే జేసన్ ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఇతను డైరెక్షన్ అంటూ రూటు మార్చడంతో ఫ్యాన్స్ ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కావొస్తున్న ఈ మూవీకి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఇందులో హీరోగా సందీప్ కిషన్ దాదాపు లాకైనట్టు కోలీవుడ్ టాక్. ఇటీవలే రాయన్ పెర్ఫార్మన్స్ తో అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైన మన తెలుగు కుర్రాడికి ఆఫర్లు బాగా వస్తున్నాయి. మానగరం నుంచి కెప్టెన్ మిల్లర్ దాకా రెగ్యులర్ గా తమిళ ఆడియన్స్ కి కనిపిస్తున్నప్పటికీ రాయన్ తెచ్చిన ఇమేజ్ వేరు. జేసన్ విజయ్ రాసుకున్న కథకు ఇతను న్యాయం చేయగలడని భావించి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ జేసన్ మాత్రం ఫిలిం మేకింగ్ కి సంబంధించిన పలు విషయాలను సీరియస్ గా స్టడీ చేసే పనిలో ఉన్నాడు.
గోట్ రూపంలో గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న విజయ్ తమిళనాడు, ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టి కొంత ఊరట కలిగించాడు. త్వరలో డెబ్యూ చేయబోయే జేసన్ విషయాల్లో జోక్యం చేసుకోడనే టాక్ ఆల్రెడీ ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ హీరోలకు వారసత్వం లేని నేపథ్యంలో విజయ్ కి కొడుకు ఉన్నాడు కాబట్టి అతను హీరో అయితేనే ఆ లెగసిని అభిమానులు మోస్తారు. కేవలం దర్శకత్వమంటే అంత ఫాలోయింగ్ ఉండదు. ఒకవేళ సందీప్ కిషన్ వార్తే నిజమైన పక్షంలో బలమైన కంటెంట్ నే ఈ కలయికలో ఆశించవచ్చు.
This post was last modified on September 9, 2024 12:14 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…