కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు జేసన్ విజయ్ నటన కంటే దర్శకత్వం వైపే మొగ్గు చూపుతున్నాడు. ఈ విభాగంలో ఋజువు చేసుకున్నాక హీరోగా ట్రై చేస్తాడేమో చూడాలి. ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంతో పాటు ఇంకొక్క సినిమా చేసి పూర్తి స్థాయి రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న తండ్రి అభిమానులు స్క్రీన్ మీద కొరత ఫీలవ్వకూడదంటే జేసన్ ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఇతను డైరెక్షన్ అంటూ రూటు మార్చడంతో ఫ్యాన్స్ ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కావొస్తున్న ఈ మూవీకి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఇందులో హీరోగా సందీప్ కిషన్ దాదాపు లాకైనట్టు కోలీవుడ్ టాక్. ఇటీవలే రాయన్ పెర్ఫార్మన్స్ తో అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైన మన తెలుగు కుర్రాడికి ఆఫర్లు బాగా వస్తున్నాయి. మానగరం నుంచి కెప్టెన్ మిల్లర్ దాకా రెగ్యులర్ గా తమిళ ఆడియన్స్ కి కనిపిస్తున్నప్పటికీ రాయన్ తెచ్చిన ఇమేజ్ వేరు. జేసన్ విజయ్ రాసుకున్న కథకు ఇతను న్యాయం చేయగలడని భావించి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ జేసన్ మాత్రం ఫిలిం మేకింగ్ కి సంబంధించిన పలు విషయాలను సీరియస్ గా స్టడీ చేసే పనిలో ఉన్నాడు.
గోట్ రూపంలో గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న విజయ్ తమిళనాడు, ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టి కొంత ఊరట కలిగించాడు. త్వరలో డెబ్యూ చేయబోయే జేసన్ విషయాల్లో జోక్యం చేసుకోడనే టాక్ ఆల్రెడీ ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్ హీరోలకు వారసత్వం లేని నేపథ్యంలో విజయ్ కి కొడుకు ఉన్నాడు కాబట్టి అతను హీరో అయితేనే ఆ లెగసిని అభిమానులు మోస్తారు. కేవలం దర్శకత్వమంటే అంత ఫాలోయింగ్ ఉండదు. ఒకవేళ సందీప్ కిషన్ వార్తే నిజమైన పక్షంలో బలమైన కంటెంట్ నే ఈ కలయికలో ఆశించవచ్చు.
This post was last modified on September 9, 2024 12:14 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…