తమిళ అభిమానులు కొన్నేళ్ల ముందు వరకు స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైనపుడు మామూలు హంగామా చేసేవారు కాదు. అక్కడ ఓ మోస్తరు హీరోకు కూడా తెల్లవారుజామున షోలు పడిపోయేవి. విజయ్, అజిత్ లాంటి హీరోల సినిమాలంటే అర్ధరాత్రి నుంచే హంగామా ఉండేది. బెనిఫిట్ షోలతో నానా బీభత్సం చేసేవాళ్లు ఫ్యాన్స్.
కానీ స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కిందట్నుంచి ఈ స్పెషల్ షోలు ఆపేశారు. ఉదయం తొమ్మిది నుంచే అక్కడ షోలు పడుతున్నాయి. ఇది స్టార్ హీరోల అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదు. ప్రపంచమంతా చూసేశాక తాము సినిమా చూడ్డమేంటని అసహనానికి గురవుతున్నారు. తమిళనాడు బోర్డర్లో ఉండే వేరే రాష్ట్రాల టౌన్లలో తమ కంటే ముందు షోలు పడుతుంటే అక్కడికి ప్రయాణించి మరీ స్పెషల్ షోలు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రిలీజైంది.
ఈ చిత్రానికి కూడా తమిళనాట ఉదయం 9 నుంచే షోలు మొదలయ్యాయి. ఐతే ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడడం విశేషం. హైదరాబాద్ సిటీలో 15 థియేటర్లలో ఈ షోలు ప్లాన్ చేశారు. ఐతే విజయ్ సినిమాను తెలుగు వాళ్లు మరీ అంత త్వరగా వెళ్లి చూస్తారా అని సందేహం కలగొచ్చు. కానీ తెలుగు వెర్షన్ షోలు రెండుకే పరిమితం చేశారు. మిగతా థియేటర్లన్నీ తమిళ వెర్షనే వేశాయి 4 గంటల షోకు. దీంతో హైదరాబాద్లో ఉండే తమిళ జనాల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ షోలన్నింటికీ దాదాపుగా ఫుల్స్ పడిపోయాయి.
తమిళనాడులోని చెన్నై సహా ఏ నగరంలోనూ లేనిది హైదరాబాద్లో దొరికిందని తమిళ ప్రేక్షకులు సంబరపడిపోయారు. తెలుగు వెర్షన్ షోలు కూడా ఫుల్స్తో నడవడం విశేషం. ఇక హైదరాబాద్లో చాలా థియేటర్లు ఉదయం 9 గంటలకు తెలుగు వెర్షన్ షోలు వేశాయి. తమిళ వెర్షన్కు కూడా నగర వ్యాప్తంగా ప్రధాన మల్టీప్లెక్సులన్నింట్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే షోలు ఇచ్చారు. ఐతే ఈ హంగామా బాగానే ఉన్నా.. సినిమాకు బ్యాడ్ టాక్ రావడమే నిరాశ కలిగించే విషయం.
This post was last modified on September 5, 2024 5:19 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…