తమిళ అభిమానులు కొన్నేళ్ల ముందు వరకు స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైనపుడు మామూలు హంగామా చేసేవారు కాదు. అక్కడ ఓ మోస్తరు హీరోకు కూడా తెల్లవారుజామున షోలు పడిపోయేవి. విజయ్, అజిత్ లాంటి హీరోల సినిమాలంటే అర్ధరాత్రి నుంచే హంగామా ఉండేది. బెనిఫిట్ షోలతో నానా బీభత్సం చేసేవాళ్లు ఫ్యాన్స్.
కానీ స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కిందట్నుంచి ఈ స్పెషల్ షోలు ఆపేశారు. ఉదయం తొమ్మిది నుంచే అక్కడ షోలు పడుతున్నాయి. ఇది స్టార్ హీరోల అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదు. ప్రపంచమంతా చూసేశాక తాము సినిమా చూడ్డమేంటని అసహనానికి గురవుతున్నారు. తమిళనాడు బోర్డర్లో ఉండే వేరే రాష్ట్రాల టౌన్లలో తమ కంటే ముందు షోలు పడుతుంటే అక్కడికి ప్రయాణించి మరీ స్పెషల్ షోలు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రిలీజైంది.
ఈ చిత్రానికి కూడా తమిళనాట ఉదయం 9 నుంచే షోలు మొదలయ్యాయి. ఐతే ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడడం విశేషం. హైదరాబాద్ సిటీలో 15 థియేటర్లలో ఈ షోలు ప్లాన్ చేశారు. ఐతే విజయ్ సినిమాను తెలుగు వాళ్లు మరీ అంత త్వరగా వెళ్లి చూస్తారా అని సందేహం కలగొచ్చు. కానీ తెలుగు వెర్షన్ షోలు రెండుకే పరిమితం చేశారు. మిగతా థియేటర్లన్నీ తమిళ వెర్షనే వేశాయి 4 గంటల షోకు. దీంతో హైదరాబాద్లో ఉండే తమిళ జనాల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ షోలన్నింటికీ దాదాపుగా ఫుల్స్ పడిపోయాయి.
తమిళనాడులోని చెన్నై సహా ఏ నగరంలోనూ లేనిది హైదరాబాద్లో దొరికిందని తమిళ ప్రేక్షకులు సంబరపడిపోయారు. తెలుగు వెర్షన్ షోలు కూడా ఫుల్స్తో నడవడం విశేషం. ఇక హైదరాబాద్లో చాలా థియేటర్లు ఉదయం 9 గంటలకు తెలుగు వెర్షన్ షోలు వేశాయి. తమిళ వెర్షన్కు కూడా నగర వ్యాప్తంగా ప్రధాన మల్టీప్లెక్సులన్నింట్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే షోలు ఇచ్చారు. ఐతే ఈ హంగామా బాగానే ఉన్నా.. సినిమాకు బ్యాడ్ టాక్ రావడమే నిరాశ కలిగించే విషయం.
This post was last modified on September 5, 2024 5:19 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…