తమిళ అభిమానులు కొన్నేళ్ల ముందు వరకు స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైనపుడు మామూలు హంగామా చేసేవారు కాదు. అక్కడ ఓ మోస్తరు హీరోకు కూడా తెల్లవారుజామున షోలు పడిపోయేవి. విజయ్, అజిత్ లాంటి హీరోల సినిమాలంటే అర్ధరాత్రి నుంచే హంగామా ఉండేది. బెనిఫిట్ షోలతో నానా బీభత్సం చేసేవాళ్లు ఫ్యాన్స్.
కానీ స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కిందట్నుంచి ఈ స్పెషల్ షోలు ఆపేశారు. ఉదయం తొమ్మిది నుంచే అక్కడ షోలు పడుతున్నాయి. ఇది స్టార్ హీరోల అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదు. ప్రపంచమంతా చూసేశాక తాము సినిమా చూడ్డమేంటని అసహనానికి గురవుతున్నారు. తమిళనాడు బోర్డర్లో ఉండే వేరే రాష్ట్రాల టౌన్లలో తమ కంటే ముందు షోలు పడుతుంటే అక్కడికి ప్రయాణించి మరీ స్పెషల్ షోలు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రిలీజైంది.
ఈ చిత్రానికి కూడా తమిళనాట ఉదయం 9 నుంచే షోలు మొదలయ్యాయి. ఐతే ఆశ్చర్యకరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకే షోలు పడడం విశేషం. హైదరాబాద్ సిటీలో 15 థియేటర్లలో ఈ షోలు ప్లాన్ చేశారు. ఐతే విజయ్ సినిమాను తెలుగు వాళ్లు మరీ అంత త్వరగా వెళ్లి చూస్తారా అని సందేహం కలగొచ్చు. కానీ తెలుగు వెర్షన్ షోలు రెండుకే పరిమితం చేశారు. మిగతా థియేటర్లన్నీ తమిళ వెర్షనే వేశాయి 4 గంటల షోకు. దీంతో హైదరాబాద్లో ఉండే తమిళ జనాల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ షోలన్నింటికీ దాదాపుగా ఫుల్స్ పడిపోయాయి.
తమిళనాడులోని చెన్నై సహా ఏ నగరంలోనూ లేనిది హైదరాబాద్లో దొరికిందని తమిళ ప్రేక్షకులు సంబరపడిపోయారు. తెలుగు వెర్షన్ షోలు కూడా ఫుల్స్తో నడవడం విశేషం. ఇక హైదరాబాద్లో చాలా థియేటర్లు ఉదయం 9 గంటలకు తెలుగు వెర్షన్ షోలు వేశాయి. తమిళ వెర్షన్కు కూడా నగర వ్యాప్తంగా ప్రధాన మల్టీప్లెక్సులన్నింట్లో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే షోలు ఇచ్చారు. ఐతే ఈ హంగామా బాగానే ఉన్నా.. సినిమాకు బ్యాడ్ టాక్ రావడమే నిరాశ కలిగించే విషయం.
This post was last modified on September 5, 2024 5:19 pm
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలను అచ్చుపోసి.. గాలికి…
కాస్త పేరున్న హీరో సినిమాలు 50 రోజుల వ్యవధిలో మూడు రిలీజ్ కావడమే అరుదు. ఆ మూడు కూడా ఒకదాన్ని…
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ పడగా.. ఆ పార్టీకి మెజారిటీ సీట్లు…
ఒకప్పుడు సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ముచ్చటపడేవారు. అయితే.. ఇటీవల కాలంలో ఈ జాబితా లో రాజకీయ నాయకులు కూడా…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని…
2025 సంక్రాంతికి బెర్తులు మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ఖరారు చేసుకున్న వాటిలో జనవరి 10 చిరంజీవి విశ్వంభరలో ఎలాంటి మార్పు లేదు.…