టాలీవుడ్లో గత రెండేళ్లలో ఎన్నో రీ రిలీజ్లు చూశాం. టాప్ స్టార్ల అభిమానులు తమ ఆరాధ్య కథానాయకుల కెరీర్లలో కల్ట్, బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ ఓసారి దర్శించుకుని థియేటర్లలో ఎంతో సందడి చేశారు. సరికొత్త అనుభూతిని పొందారు. ఐతే పవన్ సినిమాలు రీ రిలీజైనపుడు థియేటర్లలో అభిమానుల హంగామా అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ అడ్డా అయిన సంధ్య థియేటర్లో ఏదైనా సినిమా రీ రిలీజైతే.. థియేటర్లో కనిపించే వాతావరణం చూసి షాకవ్వని వాళ్లుండరు.
‘జల్సా’ సినిమాకు అక్కడ జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. పాటలు వచ్చినపుడల్లా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కోరస్ పాడుతూ చేసిన హడావుడి చూసి ఔరా అనుకున్నారు. ఇదేం మేనియారా బాబూ అని ఆశ్చర్యపోయారు. ఐతే ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ సందర్భంగా ఆ థియేటర్లో దృశ్యాలు చూసిన వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.
సంధ్య థియేటర్ కెపాసిటీ వెయ్యికి పైనే. హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్లలో అతి పెద్ద వాటిలో అదొకటి. అలాంటిది ఉన్న కెపాసిటీకి మూడు రెట్లు.. అంటే మూడు వేలమందికి పైగా థియేటర్లోకి వచ్చేశారు సోమవారం రాత్రి సెకండ్ షోకు. టికెట్ లేకుండా ఎలా అనుమతించారు, దీని వల్ల జరిగే అనర్థాలు ఏంటి అన్నది ఆలోచించలేదా అంటే సమాధానం లేదు. కానీ ట్రిపుల్ కెపాసిటీతో థియేటర్ నిండిపోవడంతో ఎవ్వరూ సీట్లో కూర్చుని సినిమా చూసే పరిస్థితి లేదు. థియేటర్లో నిలబడ్డానికి కూడా చోటు లేని పరిస్థితి తలెత్తింది.
ఇక షో మొదలయ్యాక జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సంచుల్లో తెచ్చుకున్న పేపర్లను విసురుతూ.. ప్రతి డైలాగ్, ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి పాటకు అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పాటలు వచ్చినపుడు కోరస్లు పాడుతూ అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ హోరెత్తిపోయింది. ఈ దృశ్యాలు నిన్న రాత్రి నుంచి వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ఇదేం క్రేజ్, ఇదేం మ్యాడ్నెస్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 3, 2024 3:44 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…