టాలీవుడ్లో గత రెండేళ్లలో ఎన్నో రీ రిలీజ్లు చూశాం. టాప్ స్టార్ల అభిమానులు తమ ఆరాధ్య కథానాయకుల కెరీర్లలో కల్ట్, బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ ఓసారి దర్శించుకుని థియేటర్లలో ఎంతో సందడి చేశారు. సరికొత్త అనుభూతిని పొందారు. ఐతే పవన్ సినిమాలు రీ రిలీజైనపుడు థియేటర్లలో అభిమానుల హంగామా అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ అడ్డా అయిన సంధ్య థియేటర్లో ఏదైనా సినిమా రీ రిలీజైతే.. థియేటర్లో కనిపించే వాతావరణం చూసి షాకవ్వని వాళ్లుండరు.
‘జల్సా’ సినిమాకు అక్కడ జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. పాటలు వచ్చినపుడల్లా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కోరస్ పాడుతూ చేసిన హడావుడి చూసి ఔరా అనుకున్నారు. ఇదేం మేనియారా బాబూ అని ఆశ్చర్యపోయారు. ఐతే ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ సందర్భంగా ఆ థియేటర్లో దృశ్యాలు చూసిన వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.
సంధ్య థియేటర్ కెపాసిటీ వెయ్యికి పైనే. హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్లలో అతి పెద్ద వాటిలో అదొకటి. అలాంటిది ఉన్న కెపాసిటీకి మూడు రెట్లు.. అంటే మూడు వేలమందికి పైగా థియేటర్లోకి వచ్చేశారు సోమవారం రాత్రి సెకండ్ షోకు. టికెట్ లేకుండా ఎలా అనుమతించారు, దీని వల్ల జరిగే అనర్థాలు ఏంటి అన్నది ఆలోచించలేదా అంటే సమాధానం లేదు. కానీ ట్రిపుల్ కెపాసిటీతో థియేటర్ నిండిపోవడంతో ఎవ్వరూ సీట్లో కూర్చుని సినిమా చూసే పరిస్థితి లేదు. థియేటర్లో నిలబడ్డానికి కూడా చోటు లేని పరిస్థితి తలెత్తింది.
ఇక షో మొదలయ్యాక జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సంచుల్లో తెచ్చుకున్న పేపర్లను విసురుతూ.. ప్రతి డైలాగ్, ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి పాటకు అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పాటలు వచ్చినపుడు కోరస్లు పాడుతూ అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ హోరెత్తిపోయింది. ఈ దృశ్యాలు నిన్న రాత్రి నుంచి వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ఇదేం క్రేజ్, ఇదేం మ్యాడ్నెస్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 3, 2024 3:44 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…