Movie News

గబ్బర్ సింగ్.. ఈ మేనియా చూశారా?

టాలీవుడ్లో గత రెండేళ్లలో ఎన్నో రీ రిలీజ్‌లు చూశాం. టాప్ స్టార్ల అభిమానులు తమ ఆరాధ్య కథానాయకుల కెరీర్లలో కల్ట్, బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ ఓసారి దర్శించుకుని థియేటర్లలో ఎంతో సందడి చేశారు. సరికొత్త అనుభూతిని పొందారు. ఐతే పవన్ సినిమాలు రీ రిలీజైనపుడు థియేటర్లలో అభిమానుల హంగామా అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ అడ్డా అయిన సంధ్య థియేటర్లో ఏదైనా సినిమా రీ రిలీజైతే.. థియేటర్లో కనిపించే వాతావరణం చూసి షాకవ్వని వాళ్లుండరు.

‘జల్సా’ సినిమాకు అక్కడ జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. పాటలు వచ్చినపుడల్లా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కోరస్ పాడుతూ చేసిన హడావుడి చూసి ఔరా అనుకున్నారు. ఇదేం మేనియారా బాబూ అని ఆశ్చర్యపోయారు. ఐతే ఇప్పుడు ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ సందర్భంగా ఆ థియేటర్లో దృశ్యాలు చూసిన వాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.

సంధ్య థియేటర్ కెపాసిటీ వెయ్యికి పైనే. హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్లలో అతి పెద్ద వాటిలో అదొకటి. అలాంటిది ఉన్న కెపాసిటీకి మూడు రెట్లు.. అంటే మూడు వేలమందికి పైగా థియేటర్లోకి వచ్చేశారు సోమవారం రాత్రి సెకండ్ షోకు. టికెట్ లేకుండా ఎలా అనుమతించారు, దీని వల్ల జరిగే అనర్థాలు ఏంటి అన్నది ఆలోచించలేదా అంటే సమాధానం లేదు. కానీ ట్రిపుల్ కెపాసిటీతో థియేటర్ నిండిపోవడంతో ఎవ్వరూ సీట్లో కూర్చుని సినిమా చూసే పరిస్థితి లేదు. థియేటర్లో నిలబడ్డానికి కూడా చోటు లేని పరిస్థితి తలెత్తింది.

ఇక షో మొదలయ్యాక జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సంచుల్లో తెచ్చుకున్న పేపర్లను విసురుతూ.. ప్రతి డైలాగ్, ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి పాటకు అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పాటలు వచ్చినపుడు కోరస్‌లు పాడుతూ అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ హోరెత్తిపోయింది. ఈ దృశ్యాలు నిన్న రాత్రి నుంచి వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ఇదేం క్రేజ్, ఇదేం మ్యాడ్‌నెస్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

1 hour ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

3 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

5 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

11 hours ago