నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా.. దసరా. ఆ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్ల మేర గ్రాస్ వచ్చింది. ఐతే ఓవరాల్గా ఆ సినిమా హిట్టే కానీ.. ఏపీలో మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. తెలంగాణ యాస, కల్చర్ బాగా దట్టించడం వల్లో ఏమో.. ఈ సినిమా నైజాంలో మాదిరి ఏపీలో ఆడలేదు. కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. ఓవరాల్గా అక్కడ ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ నైజాంలో మాత్రం ‘దసరా’ బ్లాక్ బస్టర్ ఫలితాన్నందుకుంది.
నాని తర్వాతి చిత్రం ‘హాయ్ నాన్న’ మాత్రం అన్ని చోట్లా ఒకే రకంగా ఆడింది. కానీ ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ పరిస్థితి చూస్తే.. దసరా పరిస్థితి రిపీటయ్యేలా ఉంది. అలా అని ఇందులో కల్చర్, యాస్ లాంటి అంశాలు ప్రభావితం చేసేలా లేవు.
‘సరిపోదా శనివారం’ మంచి టైమింగ్లోనే రిలీజయ్యింది. టాక్, రివ్యూలు కూడా డీసెంట్గానే వచ్చాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న టైంలో నాని సరిపడా వినోదాన్నే అందించాడు. కానీ వర్షాలు ఈ చిత్రాన్ని పెద్ద దెబ్బ కొట్టాయి. నైజాంకు కేంద్ర స్థానం అయిన హైదరాబాద్లో వర్షం పడ్డా మరీ ఇబ్బందికరంగా ఏమీ లేదు పరిస్థితి. దీంతో నైజాం కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రూ.8 కోట్లకు పైగా షేర్తో బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువ అయిపోయింది ‘సరిపోదా శనివారం’. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు.
వర్షం వల్ల విజయవాడ, గుంటూరు సహా పలు ప్రాంతాలు సమస్యల్లో చిక్కుకోవడం ‘సరిపోదా శనివారం’ వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కులో సగం కంటే కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చాయంతే. ఇంకో 40-45 శాతం రికవరీ అవ్వాల్సి ఉంది. ఫుల్ రన్లో అది జరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది. దీంతో ‘దసరా’ ఫలితమే మరోసారి రిపీటయ్యేలా ఉంది.
This post was last modified on September 3, 2024 3:40 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…