నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా.. దసరా. ఆ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్ల మేర గ్రాస్ వచ్చింది. ఐతే ఓవరాల్గా ఆ సినిమా హిట్టే కానీ.. ఏపీలో మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. తెలంగాణ యాస, కల్చర్ బాగా దట్టించడం వల్లో ఏమో.. ఈ సినిమా నైజాంలో మాదిరి ఏపీలో ఆడలేదు. కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పలేదు. ఓవరాల్గా అక్కడ ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. కానీ నైజాంలో మాత్రం ‘దసరా’ బ్లాక్ బస్టర్ ఫలితాన్నందుకుంది.
నాని తర్వాతి చిత్రం ‘హాయ్ నాన్న’ మాత్రం అన్ని చోట్లా ఒకే రకంగా ఆడింది. కానీ ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ పరిస్థితి చూస్తే.. దసరా పరిస్థితి రిపీటయ్యేలా ఉంది. అలా అని ఇందులో కల్చర్, యాస్ లాంటి అంశాలు ప్రభావితం చేసేలా లేవు.
‘సరిపోదా శనివారం’ మంచి టైమింగ్లోనే రిలీజయ్యింది. టాక్, రివ్యూలు కూడా డీసెంట్గానే వచ్చాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న టైంలో నాని సరిపడా వినోదాన్నే అందించాడు. కానీ వర్షాలు ఈ చిత్రాన్ని పెద్ద దెబ్బ కొట్టాయి. నైజాంకు కేంద్ర స్థానం అయిన హైదరాబాద్లో వర్షం పడ్డా మరీ ఇబ్బందికరంగా ఏమీ లేదు పరిస్థితి. దీంతో నైజాం కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇప్పటికే రూ.8 కోట్లకు పైగా షేర్తో బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువ అయిపోయింది ‘సరిపోదా శనివారం’. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు.
వర్షం వల్ల విజయవాడ, గుంటూరు సహా పలు ప్రాంతాలు సమస్యల్లో చిక్కుకోవడం ‘సరిపోదా శనివారం’ వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కులో సగం కంటే కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చాయంతే. ఇంకో 40-45 శాతం రికవరీ అవ్వాల్సి ఉంది. ఫుల్ రన్లో అది జరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది. దీంతో ‘దసరా’ ఫలితమే మరోసారి రిపీటయ్యేలా ఉంది.
This post was last modified on September 3, 2024 3:40 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…