అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా గబ్బర్ సింగ్ అరాచకం చేశాడు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసిన ఈ రీ రిలీజ్ గతంలో రెండు మూడుసార్లు జరిగిన నేపథ్యంలో వసూళ్లు మరీ భారీగా ఉండకపోవచ్చేమోననే అనుమానాలు తలెత్తాయి.
వాటిని పటాపంచలు చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల మీదకు సునామిలా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీతో మొదలుపెట్టి మచిలీపట్నం లాంటి పట్టణం దాకా ఎక్కడ చూసినా ఒకటే హోరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు.
ట్రేడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటిదాకా రీ రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1400 షోలకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే 5 కోట్ల గ్రాస్ దాటేసింది.
ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్య కాంప్లెక్స్ లాంటి పేరు పొందిన థియేటర్ సముదాయాలలో పది లక్షలకు పైగా వసూలైనట్టు తెలిసింది. ఇండియా మొత్తం మీద పద్దెనిమిది వందలకు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ ఫుల్స్ నమోదు కాగా పరిమిత ఆటలతో తమిళనాడులోనూ దుమ్ము దులిపింది.
మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యం అనేలా ఊచకోత జరిగింది. మురారిని దాటాలనుకున్న లక్ష్యం సులభంగా నెరవేరుతోంది. ఈ రోజు నుంచి దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ని కొనసాగిస్తున్నారు. ఇదే దూకుడు ఉండకపోవచ్చు కానీ డీసెంట్ ఆక్యుపెన్సీలైతే ఖచ్చితంగా ఉంటాయి.
వీకెండ్ దాకా అనుమానమే. సెప్టెంబర్ 5 నుంచి వరసగా కొత్త సినిమాలు క్యూ కట్టాయి కనక గబ్బర్ సింగ్ ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి. థియేటర్ల దగ్గర హంగామా తాలూకు ఫోటోలు, వీడియోలతో ట్విట్టర్, ఇన్స్ టా తదితర సామజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి.
This post was last modified on September 3, 2024 10:15 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…