ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇంద్ర రిలీజైనప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సమరసింహారెడ్డిని చూసే అశ్వినిదత్ ఇలాంటి కథను తయారు చేయించారనే డిబేట్ అప్పట్లో బాలయ్య ఫ్యాన్స్ మధ్య జోరుగా జరిగేది. సోషల్ మీడియా, ఇంటర్ నెట్ లేని ప్రపంచం కావడంతో వాటికి ఆధారాలు లేవు కానీ ఆ టైంలో థియేటర్ల దగ్గర కలుసుకునే ఇద్దరు హీరోల అభిమానులు ఎవరిని కదిపినా ఈ సంఘటన చెబుతారు. ఇన్నేళ్ల తర్వాత స్వయంగా చిరంజీవే దానికి స్పష్టత ఇవ్వడంతో ఇక చర్చకు ఆస్కారం లేకుండా పోయింది. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో ఈ అరుదైన ముచ్చట జరిగింది.
తన ప్రసంగంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంద్ర తన దగ్గరికి వచ్చినప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ అంటేనే బాలకృష్ణ గుర్తుకు వస్తున్న టైంలో ఇది చేయడమా వద్దా అనే మీమాంస కలిగిన మాట వాస్తవమేనని, కానీ మంచి కంటెంట్ కుదరడం వల్ల ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారని అన్నారు. అంతే కాదు ఇప్పటి రచయితలు దర్శకులు ఎవరైనా సరే ఇంద్రసేనారెడ్డి వెర్సెస్ సమరసింహారెడ్డి కథ కనక రాసుకుని వస్తే నటించడానికి నేను రెడీ అని చెప్పడంతో పాటు బాలయ్యనూ అడిగారు. దానికి ఆయన రెడీ రెడీ అంటూ రెండుసార్లు నొక్కిచెప్పడం ఆహుతులను ఆకట్టుకుంది.
అంతేకాదు బోయపాటి, వైవిఎస్ చౌదరిలను ఉద్దేశించి నా ఛాలెంజ్ ని స్వీకరిస్తారా అంటూ వేదికపై నుంచే పిలుపు ఇవ్వడం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చిరు, బాలయ్య మల్టీస్టారర్ ఎప్పటి నుంచో మూవీ లవర్స్ కంటున్న కల. ఆర్ఆర్ఆర్ తరహాలో ఇది కూడా నిజమైతే రికార్డుల ఊచకోతకు కొత్త అర్థాలు వెతకాల్సి వస్తుంది. మెగాస్టార్ యథాలాపంగ అన్నా లేక నిజంగా ఆ కోరికతో అన్నా ఎవరో ఒకరు దీనికి పూనుకోవడం చాలా అవసరం. ఆరు పదులు దాటిన వయసులో తెరమీద చిరు, బాలయ్య నువ్వా నేనా అంటూ సవాల్ విసురుకుంటే థియేటర్లలో మాస్ జనం పోతారు, మొత్తం పోతారు అనాల్సి వస్తుంది.
This post was last modified on September 2, 2024 9:29 am
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…