త్వరలో మరో సినీ జంట పెళ్లి పీటలు ఎక్కుతోంది. కొన్నేళ్ల కిందట ప్రేమలో పడి.. కొన్ని నెలల కిందటే సైలెంటుగా నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లికి రెడీ అయిపోయారు. తమ పెళ్లి ఎప్పుడో చెప్పలేదు కానీ.. ఎక్కడ అన్నది స్వయంగా అదితి వెల్లడించడం విశేషం. తమ పూర్వీకులకు ఎంతో ప్రత్యేకమైన వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో తమ పెళ్లి జరగబోతున్నట్లు అదితి చెప్పింది. తమ నిశ్చితార్థం కూడా ఇక్కడే జరిగిన విషయాన్ని ఆమె ధ్రువీకరించింది.
తమ పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని.. తాను, సిద్దార్థ్ కలిసి ఓ నిర్ణయానికి వచ్చాక కలిసి అనౌన్స్ చేస్తామని అదితిరావు ప్రకటించింది. తమ పరిచయం, ప్రేమ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో అదితి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
“మహాసముద్రం షూటింగ్ సమయంలో నాకు, సిద్ధార్థ్కు పరిచయం అయ్యింది. కొంత కాలానికి స్నేహితులయ్యాం. తర్వాత ప్రేమలో పడ్డాం. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాలూ తనతో షేర్ చేసుకునేదాన్ని. హైదరాబాద్లో ఆమె ఒక స్కూల్ కూడా ప్రారంభించారు. నా చిన్ననాటి రోజులు ఎక్కువగా అక్కడే గడిపా. కొన్నేళ్ల కిందట ఆమె కన్నుమూశారు. ఆ విషయం సిద్ధుకు తెలుసు. నా దగ్గరికి వచ్చి ఆ స్కూల్కు తీసుకెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. ఆ స్కూల్లోనే సిద్ధార్థ్ నాకు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. మా నానమ్మకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ఆమె ఆశీస్సుల కోసమే అలా చేశాడు. తను ప్రేమను వ్యక్తం చేసిన తీరు నాకెంతో నచ్చింది” అని అదితి చెప్పింది. సిద్ధార్థ్, అదితి ఇద్దరికి ఇంతకుముందే వేరే పెళ్లి అయ్యింది. విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరు ఒక్కటయ్యారు.
This post was last modified on August 30, 2024 8:59 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…