గేమ్ ఛేంజర్ డిసెంబర్ రిలీజని అందరికీ తెలుసు కానీ డేట్ మాత్రం ఇప్పటిదాకా అఫీషియలవ్వలేదు. డిసెంబర్ 20 కేవలం లీకైన సోర్స్ ద్వారా మీడియా దగ్గరున్న సమాచారం తప్ప నిజంగా అదేనా కాదానేది ఎవరికీ తెలియలేదు. నిన్న విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 ఈ తేదీని లాక్ చేసుకుంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పాలంటే రామ్ చరణ్ కు తమిళనాడులో వెట్రిమారన్ నుంచి పెద్ద సవాల్ ఎదురు కానుంది. అసలే భారతీయుడి 2 పుణ్యమాని శంకర్ బ్రాండ్ కి కోలీవుడ్ లో సొట్టలు పడ్డాయి. అది గేమ్ ఛేంజర్ తో రిపేర్ అవుతుందనుకుంటున్న టైంలో ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడింది.
ఇంకొకరు పోటీకి రాకముందే ఎస్విసి బృందం ఒక క్లారిటీ ఇవ్వడం బెటర్. లేదంటే మేము ముందే చెప్పాం అనే ఇతర ప్రొడ్యూసర్ల వాదనకు కౌంటర్ వేయడానికి ఉండదు. అసలే ముఫాసా ది లయన్ కింగ్ తో ఓవర్సీస్ లో థియేటర్ల ఇబ్బంది వస్తుందని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ్ ధావన్ బేబీ జాన్ నుంచి కాంపిటీషన్ ఎదురవుతోంది. రెండు వారాల ముందు వచ్చే పుష్ప 2 ది రూల్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాన్ని కనీసం నెల రోజుల నడిపించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తారు. దిల్ రాజు థియేటర్ చైన్, నెట్వర్క్ పెద్దదే అయినా అది ఏపీ తెలంగాణ దాటి కాదుగా.
ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయాలు. వినాయక చవితికి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని దిల్ రాజు భావిస్తుండగా శంకర్ పచ్చ జెండా ఊపితే తప్ప అది సాధ్యం కాదు. ఇంకో మూడున్నర నెలలు మాత్రమే ఉంది. మూడు వందల కోట్ల ప్యాన్ ఇండియా సినిమా ప్రమోషన్లకు ఇది తక్కువ సమయం. ఇంకా ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగుతూనే ఉంది. శ్రీకాంత్, ఎస్జె సూర్యలతో బ్యాలన్స్ తీస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ఒకవైపు జరిపిస్తున్నారు కానీ పనులు ఇంకొంచెం వేగవంతం చేయాలి. చాలా గొప్పగా చెబుతున్న తమన్ సంగీతాన్ని సైతం త్వరగా బయటికి తీసుకొచ్చి హైప్ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి.
This post was last modified on August 30, 2024 9:00 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…