గేమ్ ఛేంజర్ డిసెంబర్ రిలీజని అందరికీ తెలుసు కానీ డేట్ మాత్రం ఇప్పటిదాకా అఫీషియలవ్వలేదు. డిసెంబర్ 20 కేవలం లీకైన సోర్స్ ద్వారా మీడియా దగ్గరున్న సమాచారం తప్ప నిజంగా అదేనా కాదానేది ఎవరికీ తెలియలేదు. నిన్న విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 ఈ తేదీని లాక్ చేసుకుంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పాలంటే రామ్ చరణ్ కు తమిళనాడులో వెట్రిమారన్ నుంచి పెద్ద సవాల్ ఎదురు కానుంది. అసలే భారతీయుడి 2 పుణ్యమాని శంకర్ బ్రాండ్ కి కోలీవుడ్ లో సొట్టలు పడ్డాయి. అది గేమ్ ఛేంజర్ తో రిపేర్ అవుతుందనుకుంటున్న టైంలో ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడింది.
ఇంకొకరు పోటీకి రాకముందే ఎస్విసి బృందం ఒక క్లారిటీ ఇవ్వడం బెటర్. లేదంటే మేము ముందే చెప్పాం అనే ఇతర ప్రొడ్యూసర్ల వాదనకు కౌంటర్ వేయడానికి ఉండదు. అసలే ముఫాసా ది లయన్ కింగ్ తో ఓవర్సీస్ లో థియేటర్ల ఇబ్బంది వస్తుందని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ్ ధావన్ బేబీ జాన్ నుంచి కాంపిటీషన్ ఎదురవుతోంది. రెండు వారాల ముందు వచ్చే పుష్ప 2 ది రూల్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాన్ని కనీసం నెల రోజుల నడిపించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తారు. దిల్ రాజు థియేటర్ చైన్, నెట్వర్క్ పెద్దదే అయినా అది ఏపీ తెలంగాణ దాటి కాదుగా.
ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయాలు. వినాయక చవితికి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని దిల్ రాజు భావిస్తుండగా శంకర్ పచ్చ జెండా ఊపితే తప్ప అది సాధ్యం కాదు. ఇంకో మూడున్నర నెలలు మాత్రమే ఉంది. మూడు వందల కోట్ల ప్యాన్ ఇండియా సినిమా ప్రమోషన్లకు ఇది తక్కువ సమయం. ఇంకా ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగుతూనే ఉంది. శ్రీకాంత్, ఎస్జె సూర్యలతో బ్యాలన్స్ తీస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ఒకవైపు జరిపిస్తున్నారు కానీ పనులు ఇంకొంచెం వేగవంతం చేయాలి. చాలా గొప్పగా చెబుతున్న తమన్ సంగీతాన్ని సైతం త్వరగా బయటికి తీసుకొచ్చి హైప్ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి.
This post was last modified on August 30, 2024 9:00 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…