గేమ్ ఛేంజర్ డిసెంబర్ రిలీజని అందరికీ తెలుసు కానీ డేట్ మాత్రం ఇప్పటిదాకా అఫీషియలవ్వలేదు. డిసెంబర్ 20 కేవలం లీకైన సోర్స్ ద్వారా మీడియా దగ్గరున్న సమాచారం తప్ప నిజంగా అదేనా కాదానేది ఎవరికీ తెలియలేదు. నిన్న విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 ఈ తేదీని లాక్ చేసుకుంటూ అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పాలంటే రామ్ చరణ్ కు తమిళనాడులో వెట్రిమారన్ నుంచి పెద్ద సవాల్ ఎదురు కానుంది. అసలే భారతీయుడి 2 పుణ్యమాని శంకర్ బ్రాండ్ కి కోలీవుడ్ లో సొట్టలు పడ్డాయి. అది గేమ్ ఛేంజర్ తో రిపేర్ అవుతుందనుకుంటున్న టైంలో ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడింది.
ఇంకొకరు పోటీకి రాకముందే ఎస్విసి బృందం ఒక క్లారిటీ ఇవ్వడం బెటర్. లేదంటే మేము ముందే చెప్పాం అనే ఇతర ప్రొడ్యూసర్ల వాదనకు కౌంటర్ వేయడానికి ఉండదు. అసలే ముఫాసా ది లయన్ కింగ్ తో ఓవర్సీస్ లో థియేటర్ల ఇబ్బంది వస్తుందని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణ్ ధావన్ బేబీ జాన్ నుంచి కాంపిటీషన్ ఎదురవుతోంది. రెండు వారాల ముందు వచ్చే పుష్ప 2 ది రూల్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాన్ని కనీసం నెల రోజుల నడిపించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తారు. దిల్ రాజు థియేటర్ చైన్, నెట్వర్క్ పెద్దదే అయినా అది ఏపీ తెలంగాణ దాటి కాదుగా.
ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయాలు. వినాయక చవితికి ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలని దిల్ రాజు భావిస్తుండగా శంకర్ పచ్చ జెండా ఊపితే తప్ప అది సాధ్యం కాదు. ఇంకో మూడున్నర నెలలు మాత్రమే ఉంది. మూడు వందల కోట్ల ప్యాన్ ఇండియా సినిమా ప్రమోషన్లకు ఇది తక్కువ సమయం. ఇంకా ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగుతూనే ఉంది. శ్రీకాంత్, ఎస్జె సూర్యలతో బ్యాలన్స్ తీస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ఒకవైపు జరిపిస్తున్నారు కానీ పనులు ఇంకొంచెం వేగవంతం చేయాలి. చాలా గొప్పగా చెబుతున్న తమన్ సంగీతాన్ని సైతం త్వరగా బయటికి తీసుకొచ్చి హైప్ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి.
This post was last modified on August 30, 2024 9:00 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…