అదేంటి అంతా అయిపోయింది, థియేటర్లో ఆడలేదు, ఓటిటిలో ట్రోలింగ్ బారిన పడింది ఇంకేముంది అనుకుంటున్నారా. కొన్ని పీడకలలు అంతే. అంత త్వరగా వీడిపోవు. ప్రేక్షకుల సహనంతో ఆడుకుని కమల్ హాసన్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన ఇండియన్ 2 బృందానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా లీగల్ నోటీసులు పంపించిందని ముంబై టాక్. చాలా కాలంగా తాము పాటిస్తున్న నిబంధనను అతిక్రమించి ఓటిటికి ఇవ్వడం వల్ల సంజాయిషీ కోరుతూ లైకా సంస్థకు నోటీసు పంపిందట. సినిమా అనే ఆస్తి ప్రొడ్యూసర్ ఇష్టం కదా అనే డౌట్ మీకు రావొచ్చు.
ఇక్కడే ఉంది మెలిక. బాలీవుడ్ సినిమాలు ఏవైనా సరే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా 8 వారాల థియేటర్ ఓటిటి గ్యాప్ పాటించాలనేది మల్టీప్లెక్సులు అక్కడి నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం. ఒకవేళ ఎవరైనా పాటించకూడదని అనుకుంటే వాళ్లకు స్క్రీన్లు కేటాయించబడవు. పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్ తదితర కంపెనీలన్నీ ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇండియన్ 2 కండీషన్ ని అతిక్రమించి హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో రెండు నెలలు పూర్తి కాకుండానే రిలీజ్ చేయడం పట్ల సదరు సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన ప్రకటించింది.
ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో మరికొందరు నిర్మాతలు ఇదే ఫాలో అవుతారని మల్టీప్లెక్స్ యాజమాన్యాల వెర్షన్. ఇది కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉంది. ఏపీ తెలంగాణలో పాటించడం లేదు. నార్త్ లో మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. అందుకే ముంజ్యా లాంటి చిన్న సినిమా సైతం ఎనిమిది వారాల తర్వాతే శాటిలైట్ ఛానల్ ఆ తర్వాత ఓటిటిలో వచ్చింది. తెలుగు తమిళంలోనూ ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం మంచిదేమో. మల్టీప్లెక్సులు అంత సాహసం చేయలేవు కానీ ప్రొడ్యూసర్లు స్వచ్చందంగా పాటిస్తే మాత్రం థియేటర్ రెవిన్యూ మరింత పెరుగుతుంది.
This post was last modified on August 29, 2024 10:42 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…