వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర థియేట్రికల్ బిజినెస్ ని యువి క్రియేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. రేట్ల విషయం ఇంకా కొలిక్కి రానప్పటికీ నైజాం మైత్రికిచ్చి, సీడెడ్ తో సహా ఆంధ్ర అన్ని ప్రాంతాలకు ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్మెంట్స్ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదన దాదాపు ఓకే అయినట్టు సమాచారం. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 120 కోట్ల దాకా ధరని కోట్ చేస్తున్నట్టు తెలిసింది. ఫైనల్ కాలేదు కానీ బేరసారాలకు సంబంధించిన చర్చలైతే జరుగుతున్నాయట. ఎక్కువ తక్కువ ఎంతైనా మినిమమ్ వంద కోట్లతో స్టార్టవుతుంది.
చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ డిజాస్టర్ అయినప్పటికీ దాని ప్రభావం మార్కెట్ మీద మరీ తీవ్రంగా పడలేదు. ఆ సినిమా విషయంలో చిరు కంటే మెహర్ రమేష్ వైపే వేళ్ళన్నీ ఎత్తి చూపాయి. విశ్వంభర ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విజువల్ థ్రిల్లర్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. పైగా ఇన్ సైడ్ రిపోర్ట్స్, దర్శకుడు వసిష్ఠ పనితనం గురించి యూనిట్ చెబుతున్న మాటలు అంతకంతా అంచనాలు పెంచుతున్నాయి. దీని కోసమే చిరు వేరే కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వకుండా విశ్వంభరకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. వచ్చే నెలలో గుమ్మడికాయ కొట్టొచ్చు. టీజర్ కూడా అదే నెలలోనే.
రేటు వరకు ఎలా ఉన్నా విశ్వంభరకు పోటీ పరంగా చాలా సవాళ్లున్నాయి. బాలకృష్ణ 109 కాంపిటీషన్ కు సై అంటోంది. దిల్ రాజు తన వెంకటేష్ – అనిల్ రావిపూడి మూవీని పండక్కి లాక్ చేశారు. మైత్రి నిర్మిస్తున్న గుడ్ బ్యాక్ అగ్లీ నుంచి అజిత్ రేంజ్ పెంచేలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ భాను భోగవరపు కాంబో మూవీ దాదాపు తప్పుకున్నట్టే. ఇటీవలే గాయం కారణంగా మాస్ మహారాజా రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఇలాంటి వ్యూహం మధ్య విశ్వంభర భారీ వసూళ్లు రాబట్టాలంటే ఎక్స్ ట్రాడినరి అనే మాట రాబట్టుకోవాలి. సంక్రాంతికి రాబోయే వాటిలో ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా విశ్వంభరనే.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…