వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర థియేట్రికల్ బిజినెస్ ని యువి క్రియేషన్స్ మొదలుపెట్టినట్టు సమాచారం. రేట్ల విషయం ఇంకా కొలిక్కి రానప్పటికీ నైజాం మైత్రికిచ్చి, సీడెడ్ తో సహా ఆంధ్ర అన్ని ప్రాంతాలకు ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్మెంట్స్ తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదన దాదాపు ఓకే అయినట్టు సమాచారం. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 120 కోట్ల దాకా ధరని కోట్ చేస్తున్నట్టు తెలిసింది. ఫైనల్ కాలేదు కానీ బేరసారాలకు సంబంధించిన చర్చలైతే జరుగుతున్నాయట. ఎక్కువ తక్కువ ఎంతైనా మినిమమ్ వంద కోట్లతో స్టార్టవుతుంది.
చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ డిజాస్టర్ అయినప్పటికీ దాని ప్రభావం మార్కెట్ మీద మరీ తీవ్రంగా పడలేదు. ఆ సినిమా విషయంలో చిరు కంటే మెహర్ రమేష్ వైపే వేళ్ళన్నీ ఎత్తి చూపాయి. విశ్వంభర ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విజువల్ థ్రిల్లర్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. పైగా ఇన్ సైడ్ రిపోర్ట్స్, దర్శకుడు వసిష్ఠ పనితనం గురించి యూనిట్ చెబుతున్న మాటలు అంతకంతా అంచనాలు పెంచుతున్నాయి. దీని కోసమే చిరు వేరే కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వకుండా విశ్వంభరకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. వచ్చే నెలలో గుమ్మడికాయ కొట్టొచ్చు. టీజర్ కూడా అదే నెలలోనే.
రేటు వరకు ఎలా ఉన్నా విశ్వంభరకు పోటీ పరంగా చాలా సవాళ్లున్నాయి. బాలకృష్ణ 109 కాంపిటీషన్ కు సై అంటోంది. దిల్ రాజు తన వెంకటేష్ – అనిల్ రావిపూడి మూవీని పండక్కి లాక్ చేశారు. మైత్రి నిర్మిస్తున్న గుడ్ బ్యాక్ అగ్లీ నుంచి అజిత్ రేంజ్ పెంచేలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ భాను భోగవరపు కాంబో మూవీ దాదాపు తప్పుకున్నట్టే. ఇటీవలే గాయం కారణంగా మాస్ మహారాజా రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఇలాంటి వ్యూహం మధ్య విశ్వంభర భారీ వసూళ్లు రాబట్టాలంటే ఎక్స్ ట్రాడినరి అనే మాట రాబట్టుకోవాలి. సంక్రాంతికి రాబోయే వాటిలో ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా విశ్వంభరనే.
This post was last modified on August 27, 2024 7:59 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…