ఎంత పెద్ద ఫినాన్షియల్ బ్యాకప్తో వచ్చినా సరే.. సినీ రంగంలో వరుసగా ఫ్లాపులు ఎదురైతే తట్టుకోవడం కష్టమే. ఇలా దెబ్బల మీద దెబ్బలు తగిలి సినిమాల నిర్మాణమే ఆపేసిన సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వరుస ఫ్లాపులను తట్టుకుని గట్టిగానే నిలబడుతోంది.
కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది. ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది.
ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే.
ఐతే సినీ రంగంలో ఎన్ని చిత్రాలు తీస్తున్నామన్నది ముఖ్యం కాదు. వాటిలో ఎన్ని విజయవంతం అయ్యాయన్నదే కీలకం. ఈ విషయంలో పీపుల్ మీడియా ఈ మధ్య బాగా వెనుకబడిపోతోంది. ధమాకా తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతోంది. నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రవితేజతో ‘ఈగల్’ సినిమా ద్వారా తెచ్చుకున్న లాభాన్ని మించి.. ఆయనతో చేసిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో నష్టాలు వచ్చాయి.
గత రెండేళ్లలో వచ్చిన ఫ్లాప్ సినిమాలతో ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుంది పీపుల్ మీడియా సంస్థకు. కాబట్టి ఎక్కువ సినిమాలు తీయడం కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే ప్రధానం అని గుర్తించి.. పీపుల్ మీడియా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది.
This post was last modified on August 23, 2024 8:03 am
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…