Movie News

పీపుల్ మీడియా.. ఎలా తట్టుకుంటోందో?

ఎంత పెద్ద ఫినాన్షియల్ బ్యాకప్‌తో వచ్చినా సరే.. సినీ రంగంలో వరుసగా ఫ్లాపులు ఎదురైతే తట్టుకోవడం కష్టమే. ఇలా దెబ్బల మీద దెబ్బలు తగిలి సినిమాల నిర్మాణమే ఆపేసిన సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వరుస ఫ్లాపులను తట్టుకుని గట్టిగానే నిలబడుతోంది.

కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది. ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది.

ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే.

ఐతే సినీ రంగంలో ఎన్ని చిత్రాలు తీస్తున్నామన్నది ముఖ్యం కాదు. వాటిలో ఎన్ని విజయవంతం అయ్యాయన్నదే కీలకం. ఈ విషయంలో పీపుల్ మీడియా ఈ మధ్య బాగా వెనుకబడిపోతోంది. ధమాకా తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్‌తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతోంది. నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రవితేజతో ‘ఈగల్’ సినిమా ద్వారా తెచ్చుకున్న లాభాన్ని మించి.. ఆయనతో చేసిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో నష్టాలు వచ్చాయి.

గత రెండేళ్లలో వచ్చిన ఫ్లాప్ సినిమాలతో ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుంది పీపుల్ మీడియా సంస్థకు. కాబట్టి ఎక్కువ సినిమాలు తీయడం కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే ప్రధానం అని గుర్తించి.. పీపుల్ మీడియా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది.

Satya

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

1 hour ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

1 hour ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

1 hour ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

2 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

2 hours ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

2 hours ago