ఎంత పెద్ద ఫినాన్షియల్ బ్యాకప్తో వచ్చినా సరే.. సినీ రంగంలో వరుసగా ఫ్లాపులు ఎదురైతే తట్టుకోవడం కష్టమే. ఇలా దెబ్బల మీద దెబ్బలు తగిలి సినిమాల నిర్మాణమే ఆపేసిన సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వరుస ఫ్లాపులను తట్టుకుని గట్టిగానే నిలబడుతోంది.
కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది. ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది.
ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే.
ఐతే సినీ రంగంలో ఎన్ని చిత్రాలు తీస్తున్నామన్నది ముఖ్యం కాదు. వాటిలో ఎన్ని విజయవంతం అయ్యాయన్నదే కీలకం. ఈ విషయంలో పీపుల్ మీడియా ఈ మధ్య బాగా వెనుకబడిపోతోంది. ధమాకా తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతోంది. నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రవితేజతో ‘ఈగల్’ సినిమా ద్వారా తెచ్చుకున్న లాభాన్ని మించి.. ఆయనతో చేసిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో నష్టాలు వచ్చాయి.
గత రెండేళ్లలో వచ్చిన ఫ్లాప్ సినిమాలతో ఓ వంద కోట్లయినా నష్టం వాటిల్లి ఉంటుంది పీపుల్ మీడియా సంస్థకు. కాబట్టి ఎక్కువ సినిమాలు తీయడం కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే ప్రధానం అని గుర్తించి.. పీపుల్ మీడియా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది.
This post was last modified on August 23, 2024 8:03 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…