Movie News

అల్లు అర్జున్ మాటల్లో అంత అర్థముందా

నిన్న జరిగిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. పుష్ప దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత నిర్మాణ భాగస్వామ్యంలో ఇది రూపొందటం, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం లాంటి కారణాల వల్ల విచ్చేయడంలో ఆశ్చర్యం లేదు.

కానీ తన స్పీచ్ లో కొన్ని మాటలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు, ట్రోలింగ్ కి దారి తీశాయి. సాధారణంగా హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారని, కానీ తాను మాత్రం ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యానని చెప్పాడు. ఇక్కడే బన్నీ దొరికిపోయాడు. మీమర్స్ లాజిక్స్ తో ఆడుకుంటున్నారు.

ఎంత పెద్ద హీరో అయినా తెరకు పరిచయమయ్యాక హిట్లు పడ్డాక, యాక్టింగ్ టాలెంట్ చూశాక ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. ఎంట్రీ జరగక ముందే ఫ్యానిజం అంటే దశాబ్దాల తరబడి బ్యాక్ గ్రౌండ్ ఉన్న పెద్ద స్టార్ హీరో ఫ్యామిలీ అయ్యుండాలి. కానీ అల్లు అర్జున్ వచ్చిన టైంలో మద్దతుగా ఉన్నది మెగాభిమానులే.

గంగోత్రికి అంత ఓపెనింగ్ వచ్చింది తమ వల్లేనని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు. అంతెందుకు సాక్ష్యాత్తు బన్నీనే మొదటి షో టికెట్లు తెంపేది వాళ్లేనని ఓ ఈవెంట్ లో చెప్పిన వీడియో మళ్ళీ బయటికి వచ్చింది. ఇప్పుడు మెగా ప్రస్తావన లేకుండా ప్రసంగం చేయడంతో ఒక్కసారిగా ట్విట్టర్ బ్యాచ్ మొత్తం యాక్టివ్ అయ్యింది.

ఇది కాకుండా స్నేహితుల కోసం ఎక్కడికైనా వస్తానని, ఆ మాత్రం చేయకపోతే ఫ్రెండ్ షిప్ ఎందుకని అర్థంవచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడ్డం మరో హాట్ టాపిక్. ఆ మధ్య వైసిపి అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లి రావడం ఎంత రచ్చకు దారి తీసిందో చూశాం. దాన్ని కవర్ చేయడానికి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్తే, బన్నీ వాస్ పలు ప్రెస్ మీట్లలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇన్ డైరెక్ట్ గా ఈ వివాదం మీదే ఐకాన్ స్టార్ సమాధానం ఇచ్చాడని వస్తున్న విశ్లేషణలను కాదనలేం. అక్కడ మిసెస్ సుకుమార్ ని ఉద్దేశించి అన్నప్పటికీ టార్గెట్ మాత్రం వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోయి ఇంకో చర్చకు దారి తీసిన మాట వాస్తవం.

This post was last modified on August 22, 2024 7:51 am

Share

Recent Posts

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

2 hours ago

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న…

2 hours ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

2 hours ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

4 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

4 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

5 hours ago