సెప్టెంబర్ 2 కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క సీట్లు గెలిచి, కూటమి ప్రభుత్వంలో తమ హీరో డిప్యూటీ సిఎం అయ్యాక వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ గతంలోనే జరిగినప్పటికీ ఈసారి కనివిని ఎరుగని స్థాయిలో దానికి రికార్డులు సమకూర్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా కొత్త సినిమాల అప్డేట్స్ ముఖ్యంగా ఓజి నుంచి ఎలాంటిది వస్తుందనే ఎగ్జైట్ మెంట్ వాళ్ళలో ఎక్కువగా ఉంది.
దానికి నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చేశారు. ఓజి టీజర్ ఉంటుందని చెప్పేశారు. నిజానికి మొదటి లిరికల్ వీడియో రావొచ్చనే లీక్ నిన్నటి నుంచే తిరుగుతోంది. మరి చివరి నిమిషంలో ఏమైనా మారుస్తారేమో చూడాలి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుందని, షూటింగ్ ని ప్రారంభించబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పేశారు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ముచ్చట్లు జరిగాయి. అయితే ఎప్పుడు, విడుదల తేదీ ఏంటి లాంటి విషయాలు మాత్రం బయటికి రాలేదు. సో ఆ ఎదురు చూపులు మాత్రం ఇంకొంత కాలం తప్పవు.
ఇదే కాదు హరిహర వీరమల్లు నుంచి కూడా ఏదైనా పాట లేదా టీజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దర్శకుడు జ్యోతి కృష్ణ అదే పనిలో ఉన్నట్టు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వస్తుందో రాదో ప్రస్తుతానికి చెప్పలేం కానీ విషెస్ అయితే తప్పకుండా ఉంటాయి. రాజకీయాలు, పాలనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీరమల్లు, ఓజికి డేట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారనేది వారం క్రితమే బయటికి వచ్చింది. మరి షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేస్తారనేది వేచి చూడాలి. ఒకవైపు గబ్బర్ సింగ్ హడావిడి ఇంకోపక్క ఓజి కొత్త కంటెంట్ ఆ రోజు జరిగే రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు.
This post was last modified on August 21, 2024 3:01 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…