సెప్టెంబర్ 2 కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క సీట్లు గెలిచి, కూటమి ప్రభుత్వంలో తమ హీరో డిప్యూటీ సిఎం అయ్యాక వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ గతంలోనే జరిగినప్పటికీ ఈసారి కనివిని ఎరుగని స్థాయిలో దానికి రికార్డులు సమకూర్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా కొత్త సినిమాల అప్డేట్స్ ముఖ్యంగా ఓజి నుంచి ఎలాంటిది వస్తుందనే ఎగ్జైట్ మెంట్ వాళ్ళలో ఎక్కువగా ఉంది.
దానికి నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చేశారు. ఓజి టీజర్ ఉంటుందని చెప్పేశారు. నిజానికి మొదటి లిరికల్ వీడియో రావొచ్చనే లీక్ నిన్నటి నుంచే తిరుగుతోంది. మరి చివరి నిమిషంలో ఏమైనా మారుస్తారేమో చూడాలి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుందని, షూటింగ్ ని ప్రారంభించబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పేశారు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ముచ్చట్లు జరిగాయి. అయితే ఎప్పుడు, విడుదల తేదీ ఏంటి లాంటి విషయాలు మాత్రం బయటికి రాలేదు. సో ఆ ఎదురు చూపులు మాత్రం ఇంకొంత కాలం తప్పవు.
ఇదే కాదు హరిహర వీరమల్లు నుంచి కూడా ఏదైనా పాట లేదా టీజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దర్శకుడు జ్యోతి కృష్ణ అదే పనిలో ఉన్నట్టు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వస్తుందో రాదో ప్రస్తుతానికి చెప్పలేం కానీ విషెస్ అయితే తప్పకుండా ఉంటాయి. రాజకీయాలు, పాలనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీరమల్లు, ఓజికి డేట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారనేది వారం క్రితమే బయటికి వచ్చింది. మరి షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేస్తారనేది వేచి చూడాలి. ఒకవైపు గబ్బర్ సింగ్ హడావిడి ఇంకోపక్క ఓజి కొత్త కంటెంట్ ఆ రోజు జరిగే రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు.
This post was last modified on August 21, 2024 3:01 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…