‘కల్కి 2898 ఏడీ’ మూవీతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. దర్శకుడిగా రెండు సినిమాల అనుభవంతో ఈ విజువల్ వండర్ను వెండితెరపై ఆవిష్కరించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. కొన్ని లోపాలున్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధించింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది.
‘కల్కి’కి కొనసాగింపుగా మరో సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తయి విడుదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే రెండో భాగంలో కథ, పాత్రల మీద అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ విషయమై రకరకాల ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నాగ్ అశ్విన్.. అభిమానులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా ఈ ఊహాగానాలు చర్చకు వచ్చాయి.
‘కల్కి-2’కు సంబంధించిన రూమర్లపై నాగి ఆసక్తికర రీతిలో స్పందించాడు. దీపిక పదుకొనే చేసిన సుమతి పాత్రకు పుట్టిన కుర్రాడే యాస్కిన్ను అంతం చేస్తాడని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. అందుకు భైరవ ఉన్నాడు కదా, అతనే ఈ కథలో హీరో అని స్పష్టం చేశాడు నాగి. ఫస్ట్ పార్ట్లో అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ రెండో భాగంలో కీలకంగా ఉంటాడని.. అతను భైరవకు మరింత బలాన్నిస్తాడని ఓ నెటిజన్ పేర్కొనగా.. ఇది ఆసక్తికరంగా అనిపించినా, కేవలం రూమర్ మాత్రమే అని నాగ్ చెప్పాడు.
దుల్కర్ సల్మాన్ సెకండ్ పార్ట్లో కూడా ఉంటాడని.. ప్రభాస్ పాత్ర వెనుక ఉన్న మరో నిజాన్ని బహిర్గతం చేస్తాడని ఓ నెటిజన్ పేర్కొనగా అది నిజం కాదనేశాడు నాగి. దీపికకు పుట్టే అబ్బాయి కూడా ప్రభాస్ లాగే ఉంటారని ఒకరు పేర్కొనగా.. ఇది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ‘ది టెర్మినేటర్’ కథలా ఉందని.. ఇది కల్కి కథ కాదని అన్నాడు నాగి. ‘కల్కి-2’కు సంబంధించి ఈ ఊహాగానాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయని.. ఇలాంటివి మరిన్ని ప్రస్తావిస్తే పార్ట్-2కు సంబంధించి తన పని మరింత సులువవుతందని నాగి పేర్కొనడం విశేషం.
This post was last modified on August 21, 2024 2:58 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…