హాలీవుడ్ మూవీ సిరీస్ లో పిల్లా పెద్దా బాగా ఇష్టపడే వాటిలో లయన్ కింగ్ ఒకటి. కొత్త భాగం ఎప్పుడు వచ్చినా విపరీతమైన అంచనాలతో థియేటర్లను దడదడలాడించేస్తుంది. డిసెంబర్ 20న ముఫాసా ది లయన్ కింగ్ విడుదల కాబోతోంది. దీన్ని ఇండియాలోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు వాల్ట్ డిస్నీ సంస్థ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన పాత్రకు డబ్బింగుని అతి పెద్ద స్టార్ హీరోలతో చెప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలుగు వెర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గొంతు ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం. ఇది నాలుగైదు రోజుల క్రితమే లీకయ్యింది.
అప్పటికి ఇంకా ఒప్పందం జరగకపోవడంతో అఫీషియల్ గా బయటికి చెప్పలేదు. 26న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో దాన్ని అధికారికం చేయబోతున్నారు. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చారనే టాక్ ఉంది కానీ ఎంతనేది బయటికి రాలేదు. ముఫాసాకి మహేష్ గొంతు ఇవ్వడం వల్ల తెలుగు రాష్ట్రాల వరకు బిజినెస్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత ఫ్యాన్స్ కు తమ హీరో దర్శనం ఇంకో రెండు మూడేళ్ళ దాకా జరగదు. అప్పటిదాకా పాత సినిమాల రీ రిలీజులతో కాలక్షేపం చేయాలి. ముఫాసాలో గర్జిస్తున్న సింహానికి మహేష్ గొంతు వింటే అదో కొత్త అనుభూతి దక్కుతుంది.
డిసెంబర్ నెలలో మంచి పోటీ ఉన్న తరుణంలో ముఫాసా ది లయన్ కింగ్ వస్తోంది. 2019 లో వచ్చిన భాగానికి ఇది సీక్వెల్ కం ప్రీక్వెల్. అంటే రెండు కథలు ఉంటాయట. ఇంగ్లీష్ లో వచ్చిన ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఈసారి విజువల్ ఎఫెక్ట్స్ మతి పోగొట్టేలా ఉంటాయని, కథా కథనాలు సైతం చాలా మలుపులతో కట్టి పడేస్తాయని అంటున్నారు. మూవీలోని ఇతర పాత్రలకు సైతం పేరున్న ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించబోతున్నాడు. హిందీ, కన్నడ, మలయాళం, తమిళం తదితర భాషల్లోనూ అగ్ర హీరోలే ముఫాసాకు అండగా నిలవబోతున్నారు. ఫ్యాన్స్ వాటి కోసమే వెయిటింగ్.
This post was last modified on August 21, 2024 2:47 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…