టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్తో రామయ్యా వస్తావయ్యా సినిమా తీశాడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. మళ్లీ వీరి కలయికలో సినిమా రాలేదు. ఇలాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు మళ్లీ అదే హీరోతో ఓ మంచి సినిమా తీసి బ్యాలెన్స్ చేయాలని భావిస్తాడు. కానీ హరీష్ మాత్రం ఇప్పుడు తాను తారక్తో పని చేసేందుకు అవకాశం లేదని తేల్చేశాడు.
తారక్తో మళ్లీ సినిమా చేస్తారా అని హరీష్ను ఓ అభిమాని అడగ్గా.. గతంలో ఎన్టీఆర్తో ‘రామయ్య వస్తావయ్య’ చిత్రాన్ని తీశానని.. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఎన్టీఆర్తో ఇప్పుడు సినిమా చేయడం కష్టమని.. ఆయన లైనప్ గురించి తనకు తెలుసని హరీష్ చెప్పాడు. మరోవైపు తారక్ గురించి విలేకరులు అడిగినపుడు హరీష్ స్పందిస్తూ.. ఫ్లాప్ అయిన షాక్ సినిమా చూసి తారక్ తనకు ఛాన్స్ ఇచ్చాడని.. కానీ తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని ఇప్పటికీ బాధ ఉందని చెప్పాడు. దేవర పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు.
రామ్తో సినిమా ఉంటుందని ఇంతకుముందు చేసిన ప్రకటన గురించి అడగ్గా.. గతంలోనే రామ్తో సినిమా చేయాలని అనుకున్నానని.. అప్పట్లో ఓ కథ కూడా చెప్పానని గుర్తు చేసుకున్నాడు. ఐతే అందులో ఇద్దరు హీరోలుంటారని.. రామ్కు ఒక్క ఫైట్ కూడా ఉండదని.. ఆ కథ చెప్పినపుడు మనిద్దరం కలిసి సినిమా చేస్తే ఫ్యాన్ స్పీడ్ ఐదులో ఉండాలి, ఇదేంటి రెండులో ఉంది అని రామ్ అన్నాడని.. దీంతో స్పీడ్ ఐదులో ఉండే కథతో మళ్లీ తనను కలుస్తానని హరీష్ చెప్పాడు.
ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న మెగా మల్టీస్టారర్ గురించి అడిగితే.. దాని గురించి మాట్లాడ్డానికి ఇది సమయం కాదన్నాడు హరీష్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నెలకొన్న గొడవల గురించి అడిగితే అందరూ మన హీరోలే అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు హరీష్.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…