టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్తో రామయ్యా వస్తావయ్యా సినిమా తీశాడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. మళ్లీ వీరి కలయికలో సినిమా రాలేదు. ఇలాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు మళ్లీ అదే హీరోతో ఓ మంచి సినిమా తీసి బ్యాలెన్స్ చేయాలని భావిస్తాడు. కానీ హరీష్ మాత్రం ఇప్పుడు తాను తారక్తో పని చేసేందుకు అవకాశం లేదని తేల్చేశాడు.
తారక్తో మళ్లీ సినిమా చేస్తారా అని హరీష్ను ఓ అభిమాని అడగ్గా.. గతంలో ఎన్టీఆర్తో ‘రామయ్య వస్తావయ్య’ చిత్రాన్ని తీశానని.. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఎన్టీఆర్తో ఇప్పుడు సినిమా చేయడం కష్టమని.. ఆయన లైనప్ గురించి తనకు తెలుసని హరీష్ చెప్పాడు. మరోవైపు తారక్ గురించి విలేకరులు అడిగినపుడు హరీష్ స్పందిస్తూ.. ఫ్లాప్ అయిన షాక్ సినిమా చూసి తారక్ తనకు ఛాన్స్ ఇచ్చాడని.. కానీ తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని ఇప్పటికీ బాధ ఉందని చెప్పాడు. దేవర పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు.
రామ్తో సినిమా ఉంటుందని ఇంతకుముందు చేసిన ప్రకటన గురించి అడగ్గా.. గతంలోనే రామ్తో సినిమా చేయాలని అనుకున్నానని.. అప్పట్లో ఓ కథ కూడా చెప్పానని గుర్తు చేసుకున్నాడు. ఐతే అందులో ఇద్దరు హీరోలుంటారని.. రామ్కు ఒక్క ఫైట్ కూడా ఉండదని.. ఆ కథ చెప్పినపుడు మనిద్దరం కలిసి సినిమా చేస్తే ఫ్యాన్ స్పీడ్ ఐదులో ఉండాలి, ఇదేంటి రెండులో ఉంది అని రామ్ అన్నాడని.. దీంతో స్పీడ్ ఐదులో ఉండే కథతో మళ్లీ తనను కలుస్తానని హరీష్ చెప్పాడు.
ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న మెగా మల్టీస్టారర్ గురించి అడిగితే.. దాని గురించి మాట్లాడ్డానికి ఇది సమయం కాదన్నాడు హరీష్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నెలకొన్న గొడవల గురించి అడిగితే అందరూ మన హీరోలే అని సింపుల్గా ఆన్సర్ ఇచ్చాడు హరీష్.
This post was last modified on August 20, 2024 9:58 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…