దక్షిణాది మేటి నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. తెలుగులో ఆమె చేసిన తొలి చిత్రం ‘అలా మొదలైంది’లోనే తనెంత మంచి నటో అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఎన్నో మంచి పాత్రలు చేసింది. తన సొంత భాష మలయాళంలో అయితే గొప్ప గొప్ప సినిమాలు చేసింది. ఆమె నట ప్రతిభ చూసి ఏదో ఒక రోజు జాతీయ అవార్డు అందుకుంటుందనే అనుకున్నారంతా. ఆ సమయం ఇప్పుడొచ్చింది.
తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’లో చేసిన శోభన పాత్రకు గాను ఆమె జాతీయ అవార్డు సాధించింది. ఐతే నిత్య ఇంతకంటే గొప్పగా నటించిన సినిమాలున్నాయి. ఉదాత్త కథాంశాలతో తెరకెక్కిన చిత్రాల్లో ఆమె అద్భుతంగా నటించింది. కానీ అలాంటి సినిమాలకు కాకుండా కమర్షియల్ టచ్ ఉన్న ‘తిరుచిత్రాంబళం’ సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యపరిచింది.
ఈ చిత్రానికి తనకు జాతీయ అవార్డు ఇచ్చారని చెబితే తాను కూడా నమ్మలేదని నిత్య వ్యాఖ్యానించడం విశేషం. “నేను నా తర్వాతి చిత్రానికి సంబంధించి నా ఇంట్లో చర్చల్లో ఉండగా ధనుష్ ఫోన్ చేసి నాకు జాతీయ అవార్డు వచ్చిందన్నాడు. నేను ముందు నమ్మలేదు. జోక్ చేస్తున్నాడని అనుకున్నా. తర్వాత నిజమని తెలుసుకున్నా. ఎంతో ఆనందం కలిగింది. ఇది ఏ జానర్ సినిమా, ఇది ఎలాంటి కథ అని చూడకుండా ఈ పాత్రకు నన్ను అవార్డు కోసం ఎంపిక చేసినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు. జాతీయ అవార్డు గెలుచుకునేందుకు తగ్గ స్థాయి ఈ పాత్రకు లేదని కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు రొమాంటిక్ కామెడీ డ్రామాకు జాతీయ అవార్డు అవసరమా అంటున్నారు. కానీ ఇలాంటి కథలను రాయడం అంత తేలిక కాదు. ఇలాంటి సినిమాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర రుజువు చేసింది” అని నిత్యా మీనన్ పేర్కొంది.
This post was last modified on August 20, 2024 9:55 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…