టాలీవుడ్లో అదిరిపోయే కటౌట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ముందు వరసలో ఉంటాడు. ఆరున్నర అడుగుల ఎత్తుకు తోడు మ్యాన్లీ లుక్స్తో అతను అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు. ‘మిర్చి’ లాంటి చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే బాహుబలిలోనూ చాలా అందంగా కనిపించిన రెబల్ స్టార్.. ఆ తర్వాత మాత్రం ఆకర్షణీయ లుక్స్లో కనిపించలేదు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇక ప్రభాస్లో మునుపటి ఛార్మ్ కనిపించకపోవచ్చనే కామెంట్లు వినిపించాయి. కానీ ప్రభాస్ కష్టపడ్డాడు. తిరిగి తన ఛార్మ్ను సంపాదించాడు. ‘సలార్’లో మరీ అందంగా కాకపోయినా.. ఆకర్షణీయంగానే కనిపించాడు. ఇక ‘కల్కి’లో ప్రభాస్ లుక్స్ ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ‘రాజా సాబ్’లో అయితే ప్రభాస్ తన అందంతో అందరినీ కట్టిపడేసేలాగే ఉన్నాడు. ఆ సినిమా టీజర్లో అంత చక్కగా ఉన్నాడు మరి.
లేటెస్ట్గా ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలుపెట్టాడు. శనివారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు వచ్చిన ప్రభాస్ను చూసి అతిథులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఇంత ఆకర్షణీయంగా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. సినిమాలో భాగంగా మేకప్తో అందంగా కనిపించడం ఒకెత్తు. కానీ ప్రారంభోత్సవ వేడుకకు సింపుల్ మేకప్తోనే ప్రభాస్ చాలా అందంగా తయారయ్యాడు. హేర్ స్టైల్ సహా అన్నీ బావున్నాయి.
ఈ లుక్ చూసి ‘మిర్చి’ సినిమాలోని ‘‘ఏమున్నాడ్రా బాబూ’’ అనే అనుష్క డైలాగ్ను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ‘సీతారామం’ తర్వాత హను.. ప్రభాస్ లాంటి మాచో స్టార్ను పెట్టి సినిమా తీస్తుండడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంతో ఇమాన్ ఇస్మాయిల్ అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది. ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారీ చిత్రానికి.
This post was last modified on August 17, 2024 3:49 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…