టాలీవుడ్లో అదిరిపోయే కటౌట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ముందు వరసలో ఉంటాడు. ఆరున్నర అడుగుల ఎత్తుకు తోడు మ్యాన్లీ లుక్స్తో అతను అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు. ‘మిర్చి’ లాంటి చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే బాహుబలిలోనూ చాలా అందంగా కనిపించిన రెబల్ స్టార్.. ఆ తర్వాత మాత్రం ఆకర్షణీయ లుక్స్లో కనిపించలేదు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇక ప్రభాస్లో మునుపటి ఛార్మ్ కనిపించకపోవచ్చనే కామెంట్లు వినిపించాయి. కానీ ప్రభాస్ కష్టపడ్డాడు. తిరిగి తన ఛార్మ్ను సంపాదించాడు. ‘సలార్’లో మరీ అందంగా కాకపోయినా.. ఆకర్షణీయంగానే కనిపించాడు. ఇక ‘కల్కి’లో ప్రభాస్ లుక్స్ ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ‘రాజా సాబ్’లో అయితే ప్రభాస్ తన అందంతో అందరినీ కట్టిపడేసేలాగే ఉన్నాడు. ఆ సినిమా టీజర్లో అంత చక్కగా ఉన్నాడు మరి.
లేటెస్ట్గా ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలుపెట్టాడు. శనివారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు వచ్చిన ప్రభాస్ను చూసి అతిథులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఇంత ఆకర్షణీయంగా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. సినిమాలో భాగంగా మేకప్తో అందంగా కనిపించడం ఒకెత్తు. కానీ ప్రారంభోత్సవ వేడుకకు సింపుల్ మేకప్తోనే ప్రభాస్ చాలా అందంగా తయారయ్యాడు. హేర్ స్టైల్ సహా అన్నీ బావున్నాయి.
ఈ లుక్ చూసి ‘మిర్చి’ సినిమాలోని ‘‘ఏమున్నాడ్రా బాబూ’’ అనే అనుష్క డైలాగ్ను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ‘సీతారామం’ తర్వాత హను.. ప్రభాస్ లాంటి మాచో స్టార్ను పెట్టి సినిమా తీస్తుండడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంతో ఇమాన్ ఇస్మాయిల్ అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది. ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారీ చిత్రానికి.
This post was last modified on August 17, 2024 3:49 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…