మొన్న ప్రీమియర్లతో విడుదలైన మిస్టర్ బచ్చన్ మిశ్రమ స్పందనతో నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు మార్పులు మరీ ఎక్కువైపోయి కమర్షియల్ కోటింగ్ పెరగడంతో అంచనాలు అందుకోవడంలో తడబడిందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే కంటెంట్ పరంగా వచ్చిన కంప్లయింట్లలో ప్రధానమైంది పాత హిందీ సినిమా పాటల వాడకం. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పాత్ర ద్వారా ఏదో రూపంలో అలనాటి క్లాసిక్స్ ని వినిపించడం మాస్ కి నచ్చలేదు. ఆఖరికి సచిన్ కెడ్కర్ సైతం గాత్రం అందుకోవడం ట్విస్టు.
ఇవన్నీ గమనించిన టీమ్ త్వరగా మేలుకొంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం (నిర్మాణాత్మక విమర్శ)ను గౌరవిస్తూ ఈ రోజు నుంచి హిందీ సాంగ్స్ తగ్గించి ట్రిమ్ చేశామని, సెకండ్ షో నుంచి వాటిని చూడొచ్చని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించాడు. దీన్ని బట్టే ఫీడ్ బ్యాక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఓల్డ్ సాంగ్స్ వాడటం తప్పేమి కాదు కానీ అందరికి అర్థమయ్యేలా ఉండాలి. కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ లాంటి లెజెండ్ పేర్లు ఇప్పటి తరానికి తెలియదు. అలాంటిది వాళ్ళ పాటలు పరిచయం ఉంటాయనుకోవడం లాజిక్ కాదు. ఒకవేళ పరిచయం చేయాలనుకున్నా కమర్షియల్ సినిమాకు ఫిట్ కాదు.
ఓపెనింగ్స్ విషయంలో తడబడిన బచ్చన్ కు ఈ వారం కీలకం కానుంది. శని ఆదివారాల వరస సెలవులతో పాటు రాఖీa పండగ ఉండటంతో ఆ అవకాశాన్ని వాడుకోవాలి. వచ్చే 23న పెద్దగా చెప్పుకునే సినిమాలు లేకపోవడం కలిసి రావొచ్చు. పోటీలో ఉన్న డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదేలా ఉంది. ఆయ్ కు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ అది భారీ వసూళ్లుగా మారేందుకు టైం పడుతోంది. ఒకవేళ బాగా పికప్ అయితే మాత్రం ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ ఆయ్ అవుతుందనడంలో సందేహం అక్కర్లేదు. మరి బచ్చన్ చేసుకున్న చిన్న మార్పు ఎలాంటి ఫలితం ఇస్తుందో.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…