ఇటీవలే నాగచైతన్యతో నిశ్చితార్థం జరుపుకుని త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తాజాగా ఐఎండిబి ప్రకటించిన ఇండియన్ టాప్ సెలబ్రిటీ లిస్టులో షారుఖ్ ఖాన్ ని దాటేసి రెండో స్థానంకి చేరుకోవడం బట్టే తన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ శర్వారి కొట్టేసింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న లేడీ స్పై థ్రిల్లర్ లో అలియా భట్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బ్యూటీ ఈమెనే. అయితే శోభిత ఇంత టాప్ సెలబ్రిటీ మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా దాని వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
శోభిత రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. చేసేది తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ గా ఉంటుంది. మేజర్, గూఢచారి, కురుప్, ముతోన్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. హాలీవుడ్ లో సంచలనం రేపిన మంకీ మ్యాన్ లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లు మంచి పేరు తీసుకొచ్చాయి. కల్కి 2898 ఏడి తెలుగు వెర్షన్ లో దీపికా పదుకునేకి డబ్బింగ్ చెప్పింది ఈమెనే. షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ మూవీ సితార విడుదలకు రెడీ అవుతోంది. ఈ లోగా చైతుతో ఎంగేజ్ మెంట్ ఒక శుభవార్త అనుకుంటే ఐఎండిబిలో రేటింగ్ మరో గుడ్ న్యూస్ గా నిలిచింది.
ఐఎండిబి లిస్టు ఎప్పటికప్పుడు మారేదే అయినా జాన్వీకపూర్, కియారా అద్వానీ, కృతి సనన్ లాంటి వాళ్ళను దాటుకుని టాప్ 2లో నిలవడం అనూహ్యం. శోభితకు ఇటీవల బాగా పేరు తెచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్స్ ముందు తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాతే అవకాశాలు పెరిగాయి. చైతుతో కలిసి నటించకపోయినా అతని జీవిత భాగస్వామి అవుతున్నందుకు శోభిత ఆనందం మాములుగా లేదు. బాలీవుడ్ దిగుమతులకు అలవాటు పడిన టాలీవుడ్ నుంచి కాకుండా తెనాలిలో పుట్టిపెరిగిన తెలుగమ్మాయి ఇలా ఎదగడం సంతోషించే విషయమే.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…