ఇటీవలే నాగచైతన్యతో నిశ్చితార్థం జరుపుకుని త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న శోభిత ధూళిపాళ ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. తాజాగా ఐఎండిబి ప్రకటించిన ఇండియన్ టాప్ సెలబ్రిటీ లిస్టులో షారుఖ్ ఖాన్ ని దాటేసి రెండో స్థానంకి చేరుకోవడం బట్టే తన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ శర్వారి కొట్టేసింది. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న లేడీ స్పై థ్రిల్లర్ లో అలియా భట్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బ్యూటీ ఈమెనే. అయితే శోభిత ఇంత టాప్ సెలబ్రిటీ మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా దాని వెనుక కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
శోభిత రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. చేసేది తక్కువ సినిమాలే అయినా సెలెక్టివ్ గా ఉంటుంది. మేజర్, గూఢచారి, కురుప్, ముతోన్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. హాలీవుడ్ లో సంచలనం రేపిన మంకీ మ్యాన్ లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లు మంచి పేరు తీసుకొచ్చాయి. కల్కి 2898 ఏడి తెలుగు వెర్షన్ లో దీపికా పదుకునేకి డబ్బింగ్ చెప్పింది ఈమెనే. షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ మూవీ సితార విడుదలకు రెడీ అవుతోంది. ఈ లోగా చైతుతో ఎంగేజ్ మెంట్ ఒక శుభవార్త అనుకుంటే ఐఎండిబిలో రేటింగ్ మరో గుడ్ న్యూస్ గా నిలిచింది.
ఐఎండిబి లిస్టు ఎప్పటికప్పుడు మారేదే అయినా జాన్వీకపూర్, కియారా అద్వానీ, కృతి సనన్ లాంటి వాళ్ళను దాటుకుని టాప్ 2లో నిలవడం అనూహ్యం. శోభితకు ఇటీవల బాగా పేరు తెచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్స్ ముందు తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాతే అవకాశాలు పెరిగాయి. చైతుతో కలిసి నటించకపోయినా అతని జీవిత భాగస్వామి అవుతున్నందుకు శోభిత ఆనందం మాములుగా లేదు. బాలీవుడ్ దిగుమతులకు అలవాటు పడిన టాలీవుడ్ నుంచి కాకుండా తెనాలిలో పుట్టిపెరిగిన తెలుగమ్మాయి ఇలా ఎదగడం సంతోషించే విషయమే.
This post was last modified on August 13, 2024 2:22 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…