ఈ ఏడాది ద్వితీయార్దంలో ఇండియన్ సినిమాలో అత్యధిక అంచనాలున్న వాటిలో ‘కంగువ’ ఒకటి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి మాస్ హిట్స్కు పేరు పడ్డ శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ముందు ఇది కూడా సగటు మాస్ మూవీనే అనుకున్నారు కానీ.. దీని టీజర్ చూశాక జనాలకు దిమ్మదిరిగిపోయింది. బాహుబలి తరహా భారీ ప్రయత్నం ఇదని అర్థమైంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేసేలా ఈ రోజు ట్రైలర్ వదిలారు. అందులో విజువల్స్.. సూర్యతో పాటు విలన్ బాబీ డియోల్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనాలకు మతిపోయింది.
ఇండియన్ స్క్రీన్ మీద ఇది మరో విజువల్ వండర్ కాబోతోందనే సంకేతాలు కనిపించాయి. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఒక వైల్డ్ రైడ్ చేయించబోతున్నట్లే ఉన్నాడు దర్శకుడు శివ. ట్రైలర్లో చాలా అంశాలు ఆకట్టుకున్నప్పటికీ.. చివర్లో ఒక షాట్ ప్రత్యేకంగా కనిపించింది.
ఒక పాత్రను చూపించి చూపించకుండా ఒక గ్లింప్స్ ఇచ్చాడు దర్శకుడు శివ. హీరో సూర్యను ఢీకొట్టడానికి ఎదురుగా గుర్రం మీద ఓ యోధుడున్నట్లు చూపించారు. ఆ వ్యక్తి ముఖం చూపించకుండా ఆ షాట్ వేసి అభిమానులను ఊరించాడు శివ. ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తి కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది.
బహుశా ట్రైలర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తన పాత్ర గురించే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘కంగువ’కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో బాబీ డియోల్ విలన్ అయితే.. దాన్ని అంతమొందించాక హీరోకు కొత్త సవాల్ ఎదురు కావచ్చని.. అది కార్తితోనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా చివర్లో సెకండ్ పార్ట్కు లీడ్ ఇస్తూ ఈ పాత్రను పరిచయం చేస్తారేమో. అన్నదమ్ముల మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్న హై ఫీలింగ్తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వచ్చేలా ప్లాన్ చేశారు కావచ్చు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…