ఈ ఏడాది ద్వితీయార్దంలో ఇండియన్ సినిమాలో అత్యధిక అంచనాలున్న వాటిలో ‘కంగువ’ ఒకటి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి మాస్ హిట్స్కు పేరు పడ్డ శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ముందు ఇది కూడా సగటు మాస్ మూవీనే అనుకున్నారు కానీ.. దీని టీజర్ చూశాక జనాలకు దిమ్మదిరిగిపోయింది. బాహుబలి తరహా భారీ ప్రయత్నం ఇదని అర్థమైంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేసేలా ఈ రోజు ట్రైలర్ వదిలారు. అందులో విజువల్స్.. సూర్యతో పాటు విలన్ బాబీ డియోల్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనాలకు మతిపోయింది.
ఇండియన్ స్క్రీన్ మీద ఇది మరో విజువల్ వండర్ కాబోతోందనే సంకేతాలు కనిపించాయి. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఒక వైల్డ్ రైడ్ చేయించబోతున్నట్లే ఉన్నాడు దర్శకుడు శివ. ట్రైలర్లో చాలా అంశాలు ఆకట్టుకున్నప్పటికీ.. చివర్లో ఒక షాట్ ప్రత్యేకంగా కనిపించింది.
ఒక పాత్రను చూపించి చూపించకుండా ఒక గ్లింప్స్ ఇచ్చాడు దర్శకుడు శివ. హీరో సూర్యను ఢీకొట్టడానికి ఎదురుగా గుర్రం మీద ఓ యోధుడున్నట్లు చూపించారు. ఆ వ్యక్తి ముఖం చూపించకుండా ఆ షాట్ వేసి అభిమానులను ఊరించాడు శివ. ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తి కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది.
బహుశా ట్రైలర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తన పాత్ర గురించే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘కంగువ’కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో బాబీ డియోల్ విలన్ అయితే.. దాన్ని అంతమొందించాక హీరోకు కొత్త సవాల్ ఎదురు కావచ్చని.. అది కార్తితోనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా చివర్లో సెకండ్ పార్ట్కు లీడ్ ఇస్తూ ఈ పాత్రను పరిచయం చేస్తారేమో. అన్నదమ్ముల మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్న హై ఫీలింగ్తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వచ్చేలా ప్లాన్ చేశారు కావచ్చు.
This post was last modified on August 13, 2024 10:43 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…