ఈ ఏడాది ద్వితీయార్దంలో ఇండియన్ సినిమాలో అత్యధిక అంచనాలున్న వాటిలో ‘కంగువ’ ఒకటి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి మాస్ హిట్స్కు పేరు పడ్డ శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ముందు ఇది కూడా సగటు మాస్ మూవీనే అనుకున్నారు కానీ.. దీని టీజర్ చూశాక జనాలకు దిమ్మదిరిగిపోయింది. బాహుబలి తరహా భారీ ప్రయత్నం ఇదని అర్థమైంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేసేలా ఈ రోజు ట్రైలర్ వదిలారు. అందులో విజువల్స్.. సూర్యతో పాటు విలన్ బాబీ డియోల్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనాలకు మతిపోయింది.
ఇండియన్ స్క్రీన్ మీద ఇది మరో విజువల్ వండర్ కాబోతోందనే సంకేతాలు కనిపించాయి. ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఒక వైల్డ్ రైడ్ చేయించబోతున్నట్లే ఉన్నాడు దర్శకుడు శివ. ట్రైలర్లో చాలా అంశాలు ఆకట్టుకున్నప్పటికీ.. చివర్లో ఒక షాట్ ప్రత్యేకంగా కనిపించింది.
ఒక పాత్రను చూపించి చూపించకుండా ఒక గ్లింప్స్ ఇచ్చాడు దర్శకుడు శివ. హీరో సూర్యను ఢీకొట్టడానికి ఎదురుగా గుర్రం మీద ఓ యోధుడున్నట్లు చూపించారు. ఆ వ్యక్తి ముఖం చూపించకుండా ఆ షాట్ వేసి అభిమానులను ఊరించాడు శివ. ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తి కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది.
బహుశా ట్రైలర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తన పాత్ర గురించే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘కంగువ’కు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో బాబీ డియోల్ విలన్ అయితే.. దాన్ని అంతమొందించాక హీరోకు కొత్త సవాల్ ఎదురు కావచ్చని.. అది కార్తితోనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా చివర్లో సెకండ్ పార్ట్కు లీడ్ ఇస్తూ ఈ పాత్రను పరిచయం చేస్తారేమో. అన్నదమ్ముల మధ్య ఎపిక్ క్లాష్ చూడబోతున్న హై ఫీలింగ్తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వచ్చేలా ప్లాన్ చేశారు కావచ్చు.
This post was last modified on August 13, 2024 10:43 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…