గత ఏడాది బాలకృష్ణ వీరసింహారెడ్డితో విలన్ గా పరిచయమైన కన్నడ హీరో దునియా విజయ్ గుర్తున్నాడుగా. కథానాయకుడిగా శాండల్ వుడ్ లో మంచి పేరున్నప్పటికీ కేవలం బాలయ్య మీద అభిమానంతో నెగటివ్ షేడ్స్ కి ఒప్పుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ భర్తగా అందులో తన పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆఫర్లు బాగానే వచ్చినప్పటికీ కన్నడలోనే కొనసాగే ఉద్దేశంతో ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మొన్న శుక్రవారం ఇతను దర్శకత్వం వహించిన భీమా రిలీజయ్యింది. ఇది మన గోపీచంద్ మూవీ రీమేక్ కాదు లెండి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి కారణాలున్నాయి.
నిన్న ఆదివారం బుక్ మై షోలో 76 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా దీనికే ఘనత దక్కింది. కర్ణాటకలో కలెక్షన్లు భారీగా ఉన్నాయి. దీని మీద నమ్మకంతో హైదరాబాద్ తో పాటు కర్నూలు లాంటి పలు నగరాల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేశారు. ఇంతకీ కథేంటంటే బ్లాక్ డ్రాగన్ అనే వాడు బెంగళూరు నగరంలోని యువతకు విపరీతంగా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ జీవితాలను దుర్భరం చేస్తాడు. మెకానిక్ గా పని చేస్తూ రౌడీయిజం చేసే భీమాకు వాడి వల్ల కుటుంబపరంగా తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో పోలీసులు వల్ల కానిది తాను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని డ్రాగన్ ని తుదముట్టిస్తాడు.
సాఫ్ట్ వేర్ సిటీలో మాదకద్రవ్యాలు ఇంత దారుణంగా చెలామణిలో ఉన్నాయా అనిపించే రేంజ్ లో భీమా భయపెడతాడు. విపరీతమైన హింస, డిస్టర్బ్ చేసే విజువల్స్ తో పక్కా ఏ సర్టిఫికెట్ కంటెంట్ ఇచ్చాడు భీమా. కథలో కొత్తదనం లేకపోయినా తెరమీద హింసని ఇష్టపడే వాళ్ళను విజయ్ నిరాశపరచడు కానీ మరీ ఇంత ఓవర్ గా చూపించడం అవసరమా అనిపించేలా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. గతంలో సలగాని డైరెక్ట్ చేసి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న దునియా విజయ్ కి మరో విజయం దక్కినట్టే. వసూళ్లు దాన్నే స్పష్టం చేస్తున్నాయి. కానీ తెలుగులో ఇలాంటివి రిసీవ్ చేసుకోవడం కష్టమే కనక రీమేక్ డౌటే.
This post was last modified on August 12, 2024 4:53 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…