బాలకృష్ణ యాంకర్ గా టాక్ షోస్ లో సంచలనాలకు నాంది పలికిన అన్ స్టాపబుల్ మూడో సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. రెండో సిరీస్ లో కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువ రావడంతో ఈసారి సినీ సెలబ్రిటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలయికలు సాధ్యమవుతాయని యూనిట్ టాక్. వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి కాగా రెండోది నాగార్జునని వినికిడి. ఇండస్ట్రీలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ చిరునే అని గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్లలో బాలయ్య చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
ఇక నాగార్జున కాంబో కూడా సుదీర్ఘ కాలంగా వెయిటింగ్ లో ఉన్నదే. ఇద్దరి మధ్య ఏవో విబేధాలు ఉన్నాయని పరిశ్రమలో ఎప్పటి నుంచో గుసగుసలున్నాయి. వాటికి పూర్తిగా చెక్ పడిపోబోతోంది. వెంకటేష్ తో సైతం సంప్రదింపులు జరుపుతున్నారు కానీ వెంకీ మామ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇది కూడా నిజమవ్వొచ్చు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అడవి శేష్ తదితరులంతా ఇప్పటికే పూర్తయ్యారు కనక వీలైనంత కొత్త లిస్టుని సిద్ధం చేయబోతున్నారని తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాలయ్య సన్నిహితుల మాట.
చూస్తుంటే సినిమాలను మించిన అంచనాలను అన్ స్టాపబుల్ 3 మోసుకొచ్చేలా ఉంది.దసరా నుంచి ప్లానింగ్ చేస్తున్నారు కానీ ఇంకా డేట్ నిర్ధారించలేదు. ఆహా ఓటిటి దూకుడు ఈ మధ్యకాలంలో తగ్గింది. కొత్త సినిమాలు సిరీస్ లు రిలీజ్ చేస్తున్నా చందాదారులు పెరిగే దిశగా భారీ కంటెంట్ రాలేదు. ఇప్పుడా లోటుని తీర్చే బాధ్యతని అన్ స్టాపబుల్ 3 తీసుకోవాలి. బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య వచ్చే నెల జరగబోతున్న తన స్వర్ణోత్సవ వేడుకలో కీలకమైన ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. వాటిలో వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ముఖ్యమైనదిగా ఉండొచ్చని టాక్.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…
మార్క్ ఆంటోనీ, గత ఏడాది అజిత్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…