బాలకృష్ణ యాంకర్ గా టాక్ షోస్ లో సంచలనాలకు నాంది పలికిన అన్ స్టాపబుల్ మూడో సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. రెండో సిరీస్ లో కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువ రావడంతో ఈసారి సినీ సెలబ్రిటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలయికలు సాధ్యమవుతాయని యూనిట్ టాక్. వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి కాగా రెండోది నాగార్జునని వినికిడి. ఇండస్ట్రీలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ చిరునే అని గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్లలో బాలయ్య చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
ఇక నాగార్జున కాంబో కూడా సుదీర్ఘ కాలంగా వెయిటింగ్ లో ఉన్నదే. ఇద్దరి మధ్య ఏవో విబేధాలు ఉన్నాయని పరిశ్రమలో ఎప్పటి నుంచో గుసగుసలున్నాయి. వాటికి పూర్తిగా చెక్ పడిపోబోతోంది. వెంకటేష్ తో సైతం సంప్రదింపులు జరుపుతున్నారు కానీ వెంకీ మామ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇది కూడా నిజమవ్వొచ్చు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అడవి శేష్ తదితరులంతా ఇప్పటికే పూర్తయ్యారు కనక వీలైనంత కొత్త లిస్టుని సిద్ధం చేయబోతున్నారని తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాలయ్య సన్నిహితుల మాట.
చూస్తుంటే సినిమాలను మించిన అంచనాలను అన్ స్టాపబుల్ 3 మోసుకొచ్చేలా ఉంది.దసరా నుంచి ప్లానింగ్ చేస్తున్నారు కానీ ఇంకా డేట్ నిర్ధారించలేదు. ఆహా ఓటిటి దూకుడు ఈ మధ్యకాలంలో తగ్గింది. కొత్త సినిమాలు సిరీస్ లు రిలీజ్ చేస్తున్నా చందాదారులు పెరిగే దిశగా భారీ కంటెంట్ రాలేదు. ఇప్పుడా లోటుని తీర్చే బాధ్యతని అన్ స్టాపబుల్ 3 తీసుకోవాలి. బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య వచ్చే నెల జరగబోతున్న తన స్వర్ణోత్సవ వేడుకలో కీలకమైన ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. వాటిలో వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ముఖ్యమైనదిగా ఉండొచ్చని టాక్.
This post was last modified on August 10, 2024 2:43 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…