బాలకృష్ణ యాంకర్ గా టాక్ షోస్ లో సంచలనాలకు నాంది పలికిన అన్ స్టాపబుల్ మూడో సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. రెండో సిరీస్ లో కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువ రావడంతో ఈసారి సినీ సెలబ్రిటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలయికలు సాధ్యమవుతాయని యూనిట్ టాక్. వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి కాగా రెండోది నాగార్జునని వినికిడి. ఇండస్ట్రీలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ చిరునే అని గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రమోషన్లలో బాలయ్య చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
ఇక నాగార్జున కాంబో కూడా సుదీర్ఘ కాలంగా వెయిటింగ్ లో ఉన్నదే. ఇద్దరి మధ్య ఏవో విబేధాలు ఉన్నాయని పరిశ్రమలో ఎప్పటి నుంచో గుసగుసలున్నాయి. వాటికి పూర్తిగా చెక్ పడిపోబోతోంది. వెంకటేష్ తో సైతం సంప్రదింపులు జరుపుతున్నారు కానీ వెంకీ మామ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇది కూడా నిజమవ్వొచ్చు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అడవి శేష్ తదితరులంతా ఇప్పటికే పూర్తయ్యారు కనక వీలైనంత కొత్త లిస్టుని సిద్ధం చేయబోతున్నారని తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాలయ్య సన్నిహితుల మాట.
చూస్తుంటే సినిమాలను మించిన అంచనాలను అన్ స్టాపబుల్ 3 మోసుకొచ్చేలా ఉంది.దసరా నుంచి ప్లానింగ్ చేస్తున్నారు కానీ ఇంకా డేట్ నిర్ధారించలేదు. ఆహా ఓటిటి దూకుడు ఈ మధ్యకాలంలో తగ్గింది. కొత్త సినిమాలు సిరీస్ లు రిలీజ్ చేస్తున్నా చందాదారులు పెరిగే దిశగా భారీ కంటెంట్ రాలేదు. ఇప్పుడా లోటుని తీర్చే బాధ్యతని అన్ స్టాపబుల్ 3 తీసుకోవాలి. బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య వచ్చే నెల జరగబోతున్న తన స్వర్ణోత్సవ వేడుకలో కీలకమైన ప్రకటనలు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. వాటిలో వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ముఖ్యమైనదిగా ఉండొచ్చని టాక్.
This post was last modified on August 10, 2024 2:43 pm
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…