ఏపీ ఉప ముఖ్యమంత్రిగా విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, ఓజి తర్వాత డేట్లు ఎప్పుడు ఇస్తారా అని టీమ్ మొత్తం ఎదురు చూస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు సంబంధించిన కొన్ని విశేషాలను దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లలో భాగంగా పంచుకున్నారు. అందులో ప్రధానమైంది ఇది విజయ్ తమిళ సినిమా తేరి రీమేకని తెలిసినప్పుడు వచ్చిన వ్యతిరేకత. ఆషామాషీగా రాలేదట.
2 లక్షల 68 వేల నెగటివ్ ట్వీట్లు కేవలం ఈ ప్రాజెక్టు ఆపడం కోసమే సోషల్ మీడియాలో పోస్టయ్యాయని, అంతగా ఇది ఆగిపోవాలని కోరుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారని అప్పుడు తెలిసింది. అయితే టీజర్ చూశాక ఎవరైతే నెగటివ్ కామెంట్స్ చేశారో వాళ్లే సారీ చెప్పి థాంక్స్ అందించడం కూడా గుర్తు చేసుకున్నారు హరీష్. రీమేకుల విషయంలో తాను తీసుకునే శ్రద్ధ అలా ఉంటుందని, మిస్టర్ బచ్చన్ లోనూ 70 శాతానికి పైగా ఛేంజ్ చేశానని, మంచి లవ్ స్టోరీని పొందుపరిచి రవితేజ మాస్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని హామీ ఇచ్చారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా వరసగా పవన్ రీమేకుల మీద ఆధారపడటంతో ఫ్యాన్స్ అప్పట్లో కొంత అసహనానికి గురైన మాట వాస్తవమే. అందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ వద్దనుకున్నారు. కానీ టీజర్ లో చూపించిన డైలాగుల తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మారిపోయాయి. ప్రస్తుతానికి కేవలం ఇరవై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో రిలీజయ్యే ఛాన్స్ లేదు. ముందు వీరమల్లు ఆ తర్వాత ఓజి వస్తాయి కాబట్టి 2026లో ఉస్తాద్ దర్శనం చేసుకోవచ్చు. ఈలోగా హరీష్ శంకర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on August 8, 2024 5:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…