ఏపీ ఉప ముఖ్యమంత్రిగా విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, ఓజి తర్వాత డేట్లు ఎప్పుడు ఇస్తారా అని టీమ్ మొత్తం ఎదురు చూస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు సంబంధించిన కొన్ని విశేషాలను దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లలో భాగంగా పంచుకున్నారు. అందులో ప్రధానమైంది ఇది విజయ్ తమిళ సినిమా తేరి రీమేకని తెలిసినప్పుడు వచ్చిన వ్యతిరేకత. ఆషామాషీగా రాలేదట.
2 లక్షల 68 వేల నెగటివ్ ట్వీట్లు కేవలం ఈ ప్రాజెక్టు ఆపడం కోసమే సోషల్ మీడియాలో పోస్టయ్యాయని, అంతగా ఇది ఆగిపోవాలని కోరుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారని అప్పుడు తెలిసింది. అయితే టీజర్ చూశాక ఎవరైతే నెగటివ్ కామెంట్స్ చేశారో వాళ్లే సారీ చెప్పి థాంక్స్ అందించడం కూడా గుర్తు చేసుకున్నారు హరీష్. రీమేకుల విషయంలో తాను తీసుకునే శ్రద్ధ అలా ఉంటుందని, మిస్టర్ బచ్చన్ లోనూ 70 శాతానికి పైగా ఛేంజ్ చేశానని, మంచి లవ్ స్టోరీని పొందుపరిచి రవితేజ మాస్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని హామీ ఇచ్చారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా వరసగా పవన్ రీమేకుల మీద ఆధారపడటంతో ఫ్యాన్స్ అప్పట్లో కొంత అసహనానికి గురైన మాట వాస్తవమే. అందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ వద్దనుకున్నారు. కానీ టీజర్ లో చూపించిన డైలాగుల తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మారిపోయాయి. ప్రస్తుతానికి కేవలం ఇరవై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో రిలీజయ్యే ఛాన్స్ లేదు. ముందు వీరమల్లు ఆ తర్వాత ఓజి వస్తాయి కాబట్టి 2026లో ఉస్తాద్ దర్శనం చేసుకోవచ్చు. ఈలోగా హరీష్ శంకర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on August 8, 2024 5:25 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…