ఏపీ ఉప ముఖ్యమంత్రిగా విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, ఓజి తర్వాత డేట్లు ఎప్పుడు ఇస్తారా అని టీమ్ మొత్తం ఎదురు చూస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు సంబంధించిన కొన్ని విశేషాలను దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లలో భాగంగా పంచుకున్నారు. అందులో ప్రధానమైంది ఇది విజయ్ తమిళ సినిమా తేరి రీమేకని తెలిసినప్పుడు వచ్చిన వ్యతిరేకత. ఆషామాషీగా రాలేదట.
2 లక్షల 68 వేల నెగటివ్ ట్వీట్లు కేవలం ఈ ప్రాజెక్టు ఆపడం కోసమే సోషల్ మీడియాలో పోస్టయ్యాయని, అంతగా ఇది ఆగిపోవాలని కోరుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారని అప్పుడు తెలిసింది. అయితే టీజర్ చూశాక ఎవరైతే నెగటివ్ కామెంట్స్ చేశారో వాళ్లే సారీ చెప్పి థాంక్స్ అందించడం కూడా గుర్తు చేసుకున్నారు హరీష్. రీమేకుల విషయంలో తాను తీసుకునే శ్రద్ధ అలా ఉంటుందని, మిస్టర్ బచ్చన్ లోనూ 70 శాతానికి పైగా ఛేంజ్ చేశానని, మంచి లవ్ స్టోరీని పొందుపరిచి రవితేజ మాస్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని హామీ ఇచ్చారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా వరసగా పవన్ రీమేకుల మీద ఆధారపడటంతో ఫ్యాన్స్ అప్పట్లో కొంత అసహనానికి గురైన మాట వాస్తవమే. అందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ వద్దనుకున్నారు. కానీ టీజర్ లో చూపించిన డైలాగుల తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మారిపోయాయి. ప్రస్తుతానికి కేవలం ఇరవై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో రిలీజయ్యే ఛాన్స్ లేదు. ముందు వీరమల్లు ఆ తర్వాత ఓజి వస్తాయి కాబట్టి 2026లో ఉస్తాద్ దర్శనం చేసుకోవచ్చు. ఈలోగా హరీష్ శంకర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on August 8, 2024 5:25 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…