‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అనుదీప్ కేవీ. దాని కంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే చిన్న సినిమా తీసిన సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘జాతిరత్నాలు’తో అనుదీప్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అంతవరకు చూడలేదు. హీరోలను అంత డంబ్గా చూపిస్తూ.. సిల్లీగా అనిపిస్తూనే భలేగా నవ్వించాయి అందులోని కామెడీ సీన్స్.
‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ మీద అంచనాలు భారీగా పెరిగాయి కానీ.. ‘ప్రిన్స్’తో వాటిని అందుకోలేకపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా అనుదీప్ మరో సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రవితేజతో అని ఇంకో హీరోతో అని అనుదీప్ కొత్త చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు.
ఐతే ఎట్టకేలకు అనుదీప్ కొత్త చిత్రం ఖరారైంది. దాని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో అనుదీప్ తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విశ్వక్కు ఇది 14వ సినిమా. ఈ చిత్రానికి పని చేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించలేదు. త్వరలోనే క్లారిటీ వస్తుంది.
అనుదీప్, విశ్వక్లది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈసారి అనుదీప్ తన మార్కు కామెడీనే ట్రై చేస్తాడేమో చూడాలి. ఐతే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ మీద మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వేశారు. మరి అనుదీప్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
This post was last modified on August 8, 2024 2:51 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…