‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అనుదీప్ కేవీ. దాని కంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే చిన్న సినిమా తీసిన సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘జాతిరత్నాలు’తో అనుదీప్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అంతవరకు చూడలేదు. హీరోలను అంత డంబ్గా చూపిస్తూ.. సిల్లీగా అనిపిస్తూనే భలేగా నవ్వించాయి అందులోని కామెడీ సీన్స్.
‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ మీద అంచనాలు భారీగా పెరిగాయి కానీ.. ‘ప్రిన్స్’తో వాటిని అందుకోలేకపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా అనుదీప్ మరో సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రవితేజతో అని ఇంకో హీరోతో అని అనుదీప్ కొత్త చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు.
ఐతే ఎట్టకేలకు అనుదీప్ కొత్త చిత్రం ఖరారైంది. దాని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో అనుదీప్ తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విశ్వక్కు ఇది 14వ సినిమా. ఈ చిత్రానికి పని చేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించలేదు. త్వరలోనే క్లారిటీ వస్తుంది.
అనుదీప్, విశ్వక్లది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈసారి అనుదీప్ తన మార్కు కామెడీనే ట్రై చేస్తాడేమో చూడాలి. ఐతే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ మీద మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వేశారు. మరి అనుదీప్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
This post was last modified on August 8, 2024 2:51 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…