‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అనుదీప్ కేవీ. దాని కంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే చిన్న సినిమా తీసిన సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘జాతిరత్నాలు’తో అనుదీప్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అంతవరకు చూడలేదు. హీరోలను అంత డంబ్గా చూపిస్తూ.. సిల్లీగా అనిపిస్తూనే భలేగా నవ్వించాయి అందులోని కామెడీ సీన్స్.
‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ మీద అంచనాలు భారీగా పెరిగాయి కానీ.. ‘ప్రిన్స్’తో వాటిని అందుకోలేకపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా అనుదీప్ మరో సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రవితేజతో అని ఇంకో హీరోతో అని అనుదీప్ కొత్త చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు.
ఐతే ఎట్టకేలకు అనుదీప్ కొత్త చిత్రం ఖరారైంది. దాని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో అనుదీప్ తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విశ్వక్కు ఇది 14వ సినిమా. ఈ చిత్రానికి పని చేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించలేదు. త్వరలోనే క్లారిటీ వస్తుంది.
అనుదీప్, విశ్వక్లది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈసారి అనుదీప్ తన మార్కు కామెడీనే ట్రై చేస్తాడేమో చూడాలి. ఐతే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ మీద మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వేశారు. మరి అనుదీప్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…