‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అనుదీప్ కేవీ. దాని కంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే చిన్న సినిమా తీసిన సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘జాతిరత్నాలు’తో అనుదీప్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అంతవరకు చూడలేదు. హీరోలను అంత డంబ్గా చూపిస్తూ.. సిల్లీగా అనిపిస్తూనే భలేగా నవ్వించాయి అందులోని కామెడీ సీన్స్.
‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ మీద అంచనాలు భారీగా పెరిగాయి కానీ.. ‘ప్రిన్స్’తో వాటిని అందుకోలేకపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా అనుదీప్ మరో సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రవితేజతో అని ఇంకో హీరోతో అని అనుదీప్ కొత్త చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు.
ఐతే ఎట్టకేలకు అనుదీప్ కొత్త చిత్రం ఖరారైంది. దాని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో అనుదీప్ తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విశ్వక్కు ఇది 14వ సినిమా. ఈ చిత్రానికి పని చేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించలేదు. త్వరలోనే క్లారిటీ వస్తుంది.
అనుదీప్, విశ్వక్లది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈసారి అనుదీప్ తన మార్కు కామెడీనే ట్రై చేస్తాడేమో చూడాలి. ఐతే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ మీద మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వేశారు. మరి అనుదీప్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
This post was last modified on August 8, 2024 2:51 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…