గత కొంత కాలంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వార్తలకు ఎట్టకేలకు అధికారిక ముద్ర పడనుంది. ఇవాళ సాయంత్రం చైతు ఇంట్లో జరిగే నిశ్చితార్థం ద్వారా ఇద్దరి పరిణయానికి తొలి అడుగులు పడబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అక్కినేని కుటుంబం ఇంకా అఫీషియల్ గా చెప్పనప్పటికీ ఒక్కసారిగా ఈ వార్త నిన్న రాత్రి నుంచే దావానలంలా సోషల్ మీడియాని కమ్మేసింది. ఇటు ఈ జంట కానీ నాగార్జున కానీ దీని గురించి స్పందించలేదు కానీ నేరుగా ఉంగరాలు మార్చుకునే ఫోటోలతోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అంతర్గత సమాచారం.
2021లో సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత చైతు తన రెండో పెళ్లి దిశగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. ఇంకోవైపు శోభితతో తన బంధానికి సంబంధించిన పలు ఫోటోలు, లీకులు బయటికి వచ్చినప్పటికీ స్పందించడానికి ఏనాడూ సిద్ధపడలేదు. గూఢచారి నుంచి తెలుగులో హిట్ ట్రాక్ లో పడ్డ శోభిత వరసగా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్, పొన్నియిన్ సెల్వన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ద్వారా రెగ్యులర్ గా దర్శనమిస్తూనే ఉంది. కాకపోతే చైతు శోభిత కలిసి సినిమా చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఏకంగా రియల్ లైఫ్ లో ఒక్కటి కాబోతున్నారు.
ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు వినికిడి. వివాహం ఈ ఏడాదే ఉండొచ్చని అంటున్నారు కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య కొద్దిరోజుల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. బహుశా ఈ వేడుక గురించి ముందస్తుగా చేసుకున్న ప్లానింగ్ కావొచ్చు. మొత్తానికి చైతు బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలికి కొత్త జీవిత భాగస్వామిని ఆహ్వానించబోతున్నాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ టా తదితర సామాజిక మాధ్యమాల్లో అప్పుడే వెడ్డింగ్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇకపై శోభిత మిసెస్ అక్కినేని శోభిత అన్నమాట.
This post was last modified on August 8, 2024 11:03 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…