కల్కి 2898 ఏడు బ్లాక్ బస్టర్ తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రావడం ఉసురుమనిపించడం పరిపాటిగా మారిపోయింది. నెంబర్ పరంగా చెప్పుకోవడానికి కౌంట్ అయితే కనిపిస్తోంది కానీ అవి థియేటర్ల దగ్గర కలెక్షన్లుగా మారడం లేదు. భారతీయుడు 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీ అయినా డార్లింగ్ లాంటి లో బడ్జెట్ చిత్రమైనా బయ్యర్ల ఎదురు చూపులు తీరడం లేదు. ఆగస్ట్ 15 మంచి రసవత్తరమైన పోటీ ఉన్న నేపథ్యంలో దాని కన్నా ముందు వచ్చే ఆగస్ట్ 9న చిన్న సినిమా జాతర జరగనుంది. నీహారిక కొణిదెల నిర్మాత కావడం వల్ల ‘కమిటీ కుర్రోళ్ళు’ అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టిలో పడింది.
ముందు రోజు ప్రీమియర్లు వేస్తున్నారు కానీ దీనికి భీభత్సమైన హైప్ ఏమి లేదు. పదకొండు మంది కొత్త కుర్రాళ్ళని పరిచయం చేస్తున్నారు. పెదనాన్న చిరంజీవి కూడా ప్రమోషన్ కోసం వీడియో బైట్ ఇచ్చారు. విజయ్ ఆంటోనీ డబ్బింగ్ మూవీ ‘తుఫాన్’ తమిళం కంటే వారం ఆలస్యంగా తెలుగులోకి తీసుకొస్తున్నారు. అక్కడ యావరేజ్ ఫలితమే దక్కింది కనక ఇక్కడేమవుతుందో చెప్పలేం. అనసూయ జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘సింబ’తో ఏదో సోషల్ మెసేజ్ చెప్పే [ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయట. జనాన్ని రప్పించడం సవాలే.
ఇవి కాకుండా కమెడియన్లు ప్రధాన పాత్రలు పోషించిన ‘భవనమ్’ని సూపర్ గుడ్ ఫిలింస్ లాంటి పెద్ద సంస్థ తీసుకొస్తోంది. ఓటిటిలో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’ని ఇప్పుడు మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఇవి కాకుండా పాగల్ వర్సెస్ కాదల్, ల్యాండ్ మాఫియా, సంఘర్షణ. కేస్ నెంబర్ 15 కూడా రేసులో ఉన్నాయి. ఏదో మొక్కుబడి రిలీజ్ తప్ప మార్నింగ్ షోకి సగం హాలు నిండినా గొప్పే వీటికి. అనూహ్యమైన టాక్ వస్తే కనీసం సోషల్ మీడియాలో ఊపు కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మురారి ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఊచకోత చేయడం కొసమెరుపు.
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…