సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ పనులు సుదీర్ఘ కాలంగా నడుస్తున్నాయి. తన చివరి చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లు దాటినా.. మహేష్ సినిమాను ఇంకా సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. కథ ఒక కొలిక్కి వచ్చాక ప్రి ప్రొడక్షన్, నటీనటులు-సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఈ చిత్రంలో విలన్ పాత్రకు తమిళ విలక్షణ నటుడు విక్రమ్ను ఎంచుకున్నట్లుగా కొన్నాళ్ల కిందట ఓ వార్త హల్ చల్ చేసింది. కానీ దాని గురించి ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి వార్తలు నిజమైనా, కాకపోయినా ప్రి ప్రొడక్షన్ దశలో రాజమౌళి అండ్ టీం స్పందించరు కాబట్టి కొన్ని రోజుల తర్వాత దాని గురించి అంతా మరిచిపోయారు. ఇంతకీ విక్రమ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడా లేదా అన్నది సస్పెన్సుగానే ఉండిపోయింది.
ఐతే తన కొత్త చిత్రం తంగలాన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విక్రమ్కు మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. ఇందులో మీరు నటిస్తున్నారా అని అడిగితే.. అతను సూటిగా సమాధానం చెప్పలేదు. రాజమౌళితో తనకు స్నేహం ఉందని.. కలిసి సినిమా చేయడం గురించి చాన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయని విక్రమ్ చెప్పాడు.
తామిద్దరం కలిసి ఏదో ఒక రోజు సినిమా చేస్తామని.. అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేనని విక్రమ్ అన్నాడు. ఇలా రెండు మూడు ముక్కలు మాట్లాడి వేరే ప్రశ్నలోకి వెళ్లిపోయాడు. ఐతే విక్రమ్ మాటల్ని బట్టి చూస్తుంటే మహేష్ సినిమా కోసం అతడితో సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అనిపిస్తోంది. ఆ సినిమాలో నటించట్లయితే.. అది నిజం కాదని తేల్చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆ వార్త నిజమే అయినా ప్రొడక్షన్ హౌస్ ప్రకటించకుండా తాను ఆ విషయాన్ని ధ్రువీకరించడం కరెక్ట్ కాదు కాబట్టి సూటిగా సమాధానం ఇవ్వకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on August 6, 2024 11:09 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…