కొన్ని వారాల ముందు ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి నెగెటివ్ న్యూస్లు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేశాయో తెలిసిందే. ఈ సినిమా షూట్ పదే పదే క్యాన్సిలవుతుండటం, డిసెంబరులో కూడా సినిమా రిలీజయ్యేలా లేకపోవడంతో దర్శకుడు సుకుమార్ మీద, నిర్మాతల మీద అల్లు అర్జున్ అలిగాడని.. నిరసనగా గడ్డం తీసేసి ఫారిన్ వెకేషన్కు వెళ్లిపోయాడని జోరుగా వార్తలు వచ్చాయి. మరోవైపు సుకుమార్ అమెరికా వెళ్లిపోవడంతో ‘పుష్ప-2’ టీంలో ఏం జరుగుతోందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది.
ఐతే సుకుమార్ తన కూతురి కోర్సుకు సంబంధించి యుఎస్ వెళ్లివచ్చాడని.. బన్నీ మామూలుగానే బ్రేక్ తీసుకున్నాడని.. ఇద్దరి మధ్య గొడవలేం లేవని.. ‘పుష్ప-2’ షూట్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని టీం మీడియాకు అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
తర్వాత సుకుమార్ యుఎస్ నుంచి వచ్చాడు. బన్నీ వెకేషన్లోనే ఉండడంతో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్లో చిత్రీకరణ కొనసాగించాడు. ఐతే ఎట్టకేలకు బన్నీ వెకేషన్ ముగించుకుని ఆదివారమే షూట్లో అడుగుపెట్టాడని తెలిసింది. బన్నీ మీద తీయాల్సినవి క్లైమాక్స్ ఫైట్, ఓ పాట మాత్రమే అన్నది చిత్ర వర్గాల సమాచారం.
ఆదివారం ఒక భారీ సెట్లో క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైంది. తొలి రోజు చాలా వరకు రిహార్సల్స్కే టీం పరిమితమైంది. తిరిగి ‘పుష్ప-2’ సెట్స్లోకి అడుగుపెట్టిన సందర్భంగా సుకుమార్తో బన్నీ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడన్నది యూనిట్ వర్గాల సమాచారం. నిజంగా వీళ్లిద్దరి మధ్య ఏమైనా జరిగిందో లేదో కానీ.. సెట్లో మాత్రం చాలా సరదాగానే ఉన్నారట. బన్నీ వెకేషన్కు వెళ్లే ముందు కొంచెం గడ్డం తీసేశాడు. ఇప్పుడు మేకప్ ద్వారా కొంచెం కవర్ చేసి షూట్కు రెడీ చేశారు. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్తో క్లైమాక్స్ పూర్తవుతుందని.. కొంచెం గ్యాప్ ఇచ్చి పాట చిత్రీకరిస్తారని సమాచారం.
This post was last modified on August 5, 2024 3:16 pm
తెలంగాణ శాసన మండలికి ఇటీవలే ఎన్నికైన పలువురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్…
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బోర్లా పడుతోందనే విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేస్లో…
వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటుగా ఆ పార్టీ పేరు చెప్పుకుని చాలా మంది…
దేనికైనా టైమింగ్, ప్లానింగ్ ఉంటే ఫలితాలు కరెక్ట్ గా వస్తాయి. నిన్నపెద్ది టీజర్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న ఈ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు,…
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చర్చ…