కొన్ని వారాల ముందు ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి నెగెటివ్ న్యూస్లు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేశాయో తెలిసిందే. ఈ సినిమా షూట్ పదే పదే క్యాన్సిలవుతుండటం, డిసెంబరులో కూడా సినిమా రిలీజయ్యేలా లేకపోవడంతో దర్శకుడు సుకుమార్ మీద, నిర్మాతల మీద అల్లు అర్జున్ అలిగాడని.. నిరసనగా గడ్డం తీసేసి ఫారిన్ వెకేషన్కు వెళ్లిపోయాడని జోరుగా వార్తలు వచ్చాయి. మరోవైపు సుకుమార్ అమెరికా వెళ్లిపోవడంతో ‘పుష్ప-2’ టీంలో ఏం జరుగుతోందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది.
ఐతే సుకుమార్ తన కూతురి కోర్సుకు సంబంధించి యుఎస్ వెళ్లివచ్చాడని.. బన్నీ మామూలుగానే బ్రేక్ తీసుకున్నాడని.. ఇద్దరి మధ్య గొడవలేం లేవని.. ‘పుష్ప-2’ షూట్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని టీం మీడియాకు అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
తర్వాత సుకుమార్ యుఎస్ నుంచి వచ్చాడు. బన్నీ వెకేషన్లోనే ఉండడంతో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్లో చిత్రీకరణ కొనసాగించాడు. ఐతే ఎట్టకేలకు బన్నీ వెకేషన్ ముగించుకుని ఆదివారమే షూట్లో అడుగుపెట్టాడని తెలిసింది. బన్నీ మీద తీయాల్సినవి క్లైమాక్స్ ఫైట్, ఓ పాట మాత్రమే అన్నది చిత్ర వర్గాల సమాచారం.
ఆదివారం ఒక భారీ సెట్లో క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైంది. తొలి రోజు చాలా వరకు రిహార్సల్స్కే టీం పరిమితమైంది. తిరిగి ‘పుష్ప-2’ సెట్స్లోకి అడుగుపెట్టిన సందర్భంగా సుకుమార్తో బన్నీ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడన్నది యూనిట్ వర్గాల సమాచారం. నిజంగా వీళ్లిద్దరి మధ్య ఏమైనా జరిగిందో లేదో కానీ.. సెట్లో మాత్రం చాలా సరదాగానే ఉన్నారట. బన్నీ వెకేషన్కు వెళ్లే ముందు కొంచెం గడ్డం తీసేశాడు. ఇప్పుడు మేకప్ ద్వారా కొంచెం కవర్ చేసి షూట్కు రెడీ చేశారు. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్తో క్లైమాక్స్ పూర్తవుతుందని.. కొంచెం గ్యాప్ ఇచ్చి పాట చిత్రీకరిస్తారని సమాచారం.
This post was last modified on August 5, 2024 3:16 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…