సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ యాక్టర్ల జాబితా తీస్తే అందులో విక్రమ్ పేరు కచ్చితంగా ఉంటుంది. కమల్ హాసన్ తర్వాత ఆయన లాగే ప్రయోగాత్మక కథలు, పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విక్రమ్. కొన్నేళ్ల వ్యవధిలో వచ్చిన శివపుత్రుడు, సామి, అపరిచితుడు సినిమాలను చూస్తే అతనెంత వైవిధ్యమైన నటుడో అర్థమవుతుంది.
ఇలాంటి పూర్తి భిన్నమైన మూడు సినిమాలు చేసి మూడింటితోనూ బ్లాక్బస్టర్లు కొట్టడం అతడికే చెల్లింది. కాకపోతే ఆ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ల తర్వాత విక్రమ్కు ఇప్పటిదాకా సరైన సక్సెస్ లేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూనే ఉన్న విక్రమ్ కు తాను కోరుకున్న విజయం మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు అతను ‘తంగలాన్’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విక్రమ్.. ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. షూటింగ్ జరుగుతున్నపుడు ఒక సన్నివేశం కాగానే మానిటర్లో తన పెర్ఫామెన్స్ చూసుకునే అలవాటు తనకు లేదని అతను చెప్పాడు. అసలు తాను ఎప్పుడూ మానిటర్ చూడనని అతను వెల్లడించాడు. దాదాపుగా ప్రతి నటుడూ తాను చేసిన సన్నివేశాన్ని మానిటర్లో చూసుకోవడం ఇప్పుడు కామన్ ప్రాక్టీస్. కానీ విక్రమ్ అలా చేయడట.
“నాకు మానిటర్ చూసే అలవాటు లేదు. నేరుగా డబ్బింగ్ టైంలోనే విజువల్స్ చూస్తాను. ‘తంగలాన్’ సినిమాలో సన్నివేశాలను ఎప్పుడూ మానిటర్లో చూడలేదు. నేరుగా డబ్బింగ్ టైంలో చూస్తే నేను చేసిన సన్నివేశాలే నాకు షాకింగ్గా అనిపించాయి. నా లుక్ నన్ను ఆశ్చర్యపరిచింది. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా నాలాగే షాకవుతారు. చాలామంది ఇది కేజీఎఫ్ తరహా సినిమా అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రోమోలు వచ్చాక ఆశ్చర్యపోయారు. సినిమా కూడా షాకింగ్గా ఉంటుంది” అని విక్రమ్ తెలిపాడు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…