సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ యాక్టర్ల జాబితా తీస్తే అందులో విక్రమ్ పేరు కచ్చితంగా ఉంటుంది. కమల్ హాసన్ తర్వాత ఆయన లాగే ప్రయోగాత్మక కథలు, పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విక్రమ్. కొన్నేళ్ల వ్యవధిలో వచ్చిన శివపుత్రుడు, సామి, అపరిచితుడు సినిమాలను చూస్తే అతనెంత వైవిధ్యమైన నటుడో అర్థమవుతుంది.
ఇలాంటి పూర్తి భిన్నమైన మూడు సినిమాలు చేసి మూడింటితోనూ బ్లాక్బస్టర్లు కొట్టడం అతడికే చెల్లింది. కాకపోతే ఆ హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ల తర్వాత విక్రమ్కు ఇప్పటిదాకా సరైన సక్సెస్ లేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూనే ఉన్న విక్రమ్ కు తాను కోరుకున్న విజయం మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు అతను ‘తంగలాన్’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన విక్రమ్.. ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. షూటింగ్ జరుగుతున్నపుడు ఒక సన్నివేశం కాగానే మానిటర్లో తన పెర్ఫామెన్స్ చూసుకునే అలవాటు తనకు లేదని అతను చెప్పాడు. అసలు తాను ఎప్పుడూ మానిటర్ చూడనని అతను వెల్లడించాడు. దాదాపుగా ప్రతి నటుడూ తాను చేసిన సన్నివేశాన్ని మానిటర్లో చూసుకోవడం ఇప్పుడు కామన్ ప్రాక్టీస్. కానీ విక్రమ్ అలా చేయడట.
“నాకు మానిటర్ చూసే అలవాటు లేదు. నేరుగా డబ్బింగ్ టైంలోనే విజువల్స్ చూస్తాను. ‘తంగలాన్’ సినిమాలో సన్నివేశాలను ఎప్పుడూ మానిటర్లో చూడలేదు. నేరుగా డబ్బింగ్ టైంలో చూస్తే నేను చేసిన సన్నివేశాలే నాకు షాకింగ్గా అనిపించాయి. నా లుక్ నన్ను ఆశ్చర్యపరిచింది. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా నాలాగే షాకవుతారు. చాలామంది ఇది కేజీఎఫ్ తరహా సినిమా అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రోమోలు వచ్చాక ఆశ్చర్యపోయారు. సినిమా కూడా షాకింగ్గా ఉంటుంది” అని విక్రమ్ తెలిపాడు.
This post was last modified on August 5, 2024 1:12 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…