టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి విడుదలై ముప్పై అయిదు రోజులు పూర్తయ్యింది. అర్ధ శతదినోత్సవానికి దగ్గరగా ఉన్న తరుణంలో థియేట్రికల్ రన్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. వీకెండ్స్ మినహాయించి మాములు రోజుల్లో ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి. దీనికో తరుణోపాయం పట్టుకుంది వైజయంతి సంస్థ. ఆగస్ట్ 2 నుంచి 9 దాకా ఒక వారం రోజుల పాటు ఈ విజువల్ గ్రాండియర్ ని ఇండియా వైడ్ ఎక్కడైనా ఎందులో అయినా కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. ఎలాగూ బాక్సాఫిస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి హాలు దాకా కల్కికివెళ్లని ఆడియన్స్ కి ఇదో మంచి ఛాన్స్.
అంతా అయిపోయాక ఇప్పుడెందుకనే డౌట్ రావొచ్చు. రిలీజైన టైంలో ప్రతి టికెట్ మీద నూటా ఇరవై రూపాయల దాకా హైక్ తీసుకున్న కల్కి సహజంగానే కామన్ ఆడియన్స్ కి కొంత దూరమయ్యింది. రెండు వారాలయ్యాక సాధారణ రేట్లు అమలులోకి వచ్చాక చూసిన పబ్లిక్ భారీగా ఉన్నారు. అయినా సరే ఓటిటిలో చూద్దామని ఆగిన వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పుడు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కాబట్టి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లినా నాలుగు వందలకు మించి కాదు. సో బ్యాలన్స్ మిగిలిపోయిన జనాన్ని రప్పించేందుకు కల్కి వేసిన తెలివైన ఎత్తుగడగా దీన్ని చెప్పుకోవచ్చు.
ఎలాగూ నార్త్ లోనూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ మూవీస్ ఏమి లేవు. బ్యాడ్ న్యూజ్ పర్వాలేదనిపించుకుంది తప్ప సూపర్ హిట్ కాలేదు. కిల్ సక్సెస్ అయినా అద్భుతాలు చేయలేదు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్ ల కొత్త సినిమాలకు అసలు బజ్జే లేదు. సో ఉత్తరాది ఆడియన్స్ ఇలాంటి వంద రూపాయల ఆఫర్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి కల్కి నెంబర్లు మళ్ళీ భారీగా పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అన్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ సైతం తమ బ్యాడ్ న్యూజ్, కిల్ లను ఒక్క రోజు 99 రూపాయలకు చూడొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎలా చూసుకున్నా ఈ మోడల్ ఎక్కువ వర్కౌట్ అయ్యేది కల్కికే.
This post was last modified on August 2, 2024 8:17 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…