టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి విడుదలై ముప్పై అయిదు రోజులు పూర్తయ్యింది. అర్ధ శతదినోత్సవానికి దగ్గరగా ఉన్న తరుణంలో థియేట్రికల్ రన్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. వీకెండ్స్ మినహాయించి మాములు రోజుల్లో ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి. దీనికో తరుణోపాయం పట్టుకుంది వైజయంతి సంస్థ. ఆగస్ట్ 2 నుంచి 9 దాకా ఒక వారం రోజుల పాటు ఈ విజువల్ గ్రాండియర్ ని ఇండియా వైడ్ ఎక్కడైనా ఎందులో అయినా కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. ఎలాగూ బాక్సాఫిస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి హాలు దాకా కల్కికివెళ్లని ఆడియన్స్ కి ఇదో మంచి ఛాన్స్.
అంతా అయిపోయాక ఇప్పుడెందుకనే డౌట్ రావొచ్చు. రిలీజైన టైంలో ప్రతి టికెట్ మీద నూటా ఇరవై రూపాయల దాకా హైక్ తీసుకున్న కల్కి సహజంగానే కామన్ ఆడియన్స్ కి కొంత దూరమయ్యింది. రెండు వారాలయ్యాక సాధారణ రేట్లు అమలులోకి వచ్చాక చూసిన పబ్లిక్ భారీగా ఉన్నారు. అయినా సరే ఓటిటిలో చూద్దామని ఆగిన వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పుడు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కాబట్టి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లినా నాలుగు వందలకు మించి కాదు. సో బ్యాలన్స్ మిగిలిపోయిన జనాన్ని రప్పించేందుకు కల్కి వేసిన తెలివైన ఎత్తుగడగా దీన్ని చెప్పుకోవచ్చు.
ఎలాగూ నార్త్ లోనూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ మూవీస్ ఏమి లేవు. బ్యాడ్ న్యూజ్ పర్వాలేదనిపించుకుంది తప్ప సూపర్ హిట్ కాలేదు. కిల్ సక్సెస్ అయినా అద్భుతాలు చేయలేదు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్ ల కొత్త సినిమాలకు అసలు బజ్జే లేదు. సో ఉత్తరాది ఆడియన్స్ ఇలాంటి వంద రూపాయల ఆఫర్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి కల్కి నెంబర్లు మళ్ళీ భారీగా పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అన్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ సైతం తమ బ్యాడ్ న్యూజ్, కిల్ లను ఒక్క రోజు 99 రూపాయలకు చూడొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎలా చూసుకున్నా ఈ మోడల్ ఎక్కువ వర్కౌట్ అయ్యేది కల్కికే.
This post was last modified on August 2, 2024 8:17 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…