ఇంకో పధ్నాలుగు రోజుల్లో తంగలాన్ విడుదల కానుంది. చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్ తీసిన ఈ పీరియాడిక్ డ్రామా మీద మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. అదే రోజు ఆగస్ట్ 15 రిలీజవుతున్న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు ప్రమోషన్లలో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతుండగా చిన్న చిత్రమైన ఆయ్ కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే తంగలాన్ మాత్రం ఎలాంటి చప్పుడు చేయడం లేదు. నైజాం ప్రాంతంలో మైత్రి లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు రావడంతో థియేటర్ల పరంగా టెన్షన్ ఉండకపోవచ్చు.
కానీ విక్రమ్ అభిమానులు ఆందోళన పడుతున్న అంశం మరొకటి ఉంది. చియాన్ విక్రమ్ చాలా కష్టపడి ఒళ్ళు హూనం చేసుకున్న తంగలాన్ తెలుగులో కూడా రీచ్ అవ్వాలి. కానీ ఆ స్థాయిలో పబ్లిసిటీ జరగడం లేదు. మాస్ కి అర్థం కాని విధంగా తమిళ టైటిల్ యధాతథంగా ఉంచేయడం వల్ల బిసి సెంటర్స్ లో దీని మీద ఆసక్తి పుట్టించడం కష్టం. కాదలన్ అంటే ప్రేమికుడు అని పెట్టినట్టు తంగలాన్ అంటే ఏదో తెలుగు పదం వెతకాల్సింది. కానీ ప్యాన్ ఇండియా సాకు చూపించి నిర్మాతలు వాటిని అక్షరం మార్చకుండా ఉంచేయడం వల్ల సమస్య వస్తుంది. సో బజ్ పెరగాలంటే ఏదో జరగాలి.
ఒకవేళ తంగలాన్ తమిళనాడు హిట్టయినా ఇక్కడ ఆడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇటీవలే రాయన్ చూశాంగా. అక్కడ వంద కోట్ల గ్రాస్ దాటితే ఇక్కడ తక్కువ బ్రేక్ ఈవెన్ కే కిందా మీదా పడాల్సి వచ్చింది. అలా అని విక్రమ్ మూవీని మరీ తక్కువంచనా వేసినా ప్రమాదమే. గతంలో జీరో హైప్ తో వచ్చిన కాంతార లాంటివి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ రికార్డులు అందుకున్నాయో సాక్ష్యాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. సో ఇప్పుడే నిర్ధారణకు రాలేం కానీ తంగలాన్ అభిమానులు బెంగ పెట్టుకోవటానికి ప్రధాన కారణాలు ప్రమోషన్లు లేకపోవడం, మాస్ సినిమాల పోటీ విపరీతంగా ఉండటం. ఏమవుతుందో లెట్ సీ.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…