స్క్విడ్ గేమ్.. మూడేళ్ల కిందట సంచలనం రేపిన్ వెబ్ సిరీస్. ఈ పేరు వింటే ఓటీటీ ప్రేక్షకుల్లో ఒక రకమైన అలజడి కలుగుతుంది. ఆ కొరియన్ వెబ్ సిరీస్ ఇచ్చిన థ్రిల్, కిక్ అలాంటిలాంటివి కావు. వెబ్ సిరీస్ల చరిత్రలోనే అత్యంత ఆదరణ పొంది.. ఓటీటీల్లో వ్యూస్ పరంగా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసిన ఘనత ఈ సిరీస్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్వాలిటీ సినిమాలు, సిరీస్లకు పెట్టింది పేరైన కొరియా నుంచి వచ్చిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠకు, ఉద్వేగానికి గురి చేసేదే.
హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించిన ఈ సిరీస్ చిన్న పిల్లలను సైతం విపరీతంగా ఆకట్టుకుని.. దాని మీద ఎన్నో గేమ్స్ రావడానికి కూడా దోహదం చేసింది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సీజన్ రిలీజైన టైంలోనే సీక్వెల్ కన్ఫమ్ చేసింది చిత్ర బృందం.
ఐతే మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ‘స్క్విడ్ గేమ్’ సెకండ్ సీజన్ అప్డేట్ లేదేంటని దాని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐతే ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ వాళ్లు సెకండ్ సీజన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబరు 26న రెండో సీజన్ స్ట్రీమ్ కాబోతోందట. అంతే కాక ఈ సిరీస్కూ మూడో సీజన్ కూడా ఉంటుందనే శుభవార్తను కూడా పంచుకున్నారు.
‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్ట్ చాలా షాకింగ్గా ఉంటుంది. మల్టీ మిలియనీర్లయిన కొంతమంది.. డబ్బు కోసం తహతహలాడుతున్న వ్యక్తులను ఎంచుకుని ఒక దీవిలోకి తీసుకొచ్చి వాళ్లతో డేంజరస్ గేమ్స్ ఆడిస్తారు. ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ డేంజరస్ గేమ్స్ చూసి ఆ మల్టీ మిలియనీర్లు వినోదం పొందుతుంటారు. ఆ గేమ్స్ సాగే వైనం.. తీవ్ర ఉత్కంఠతో ఉంటుంది. ఒక ఎపిసోడ్ మొదలుపెడితే.. అన్నీ చూసేదాకా వదల్లేని థ్రిల్, టెన్షన్ ఉంటుంది ఈ సిరీస్లో. తొలి సీజన్ రూపొందించిన డాంగ్ హ్యూక్ రెండో సీజన్ కూడా తీశాడు. మరి రెండో సీజన్ కూడా ఇంతే ఉత్కంఠభరితంగా ఉంటుందేమో చూడాలి.
This post was last modified on August 1, 2024 12:59 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…