Movie News

చిరంజీవి చెప్పారు…..ఎవరెవరు విన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము ప్రకటించిన గద్దర్ అవార్డులకు పరిశ్రమ నుంచి స్పందన రాలేదని ఒక సభలో బహిరంగంగా చెప్పడంతో ఒలంపిక్స్ వేడుకల కోసం విదేశాల్లో ఉన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం నిన్న హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో కనుమరుగైపోయిన నంది పురస్కారాల స్థానంలో వీటిని ప్రవేశ పెడతామని చెప్పి నెలలు గడిచిపోయినా వాటికి సంబంధించిన చర్యలకు ఎలాంటి కదలిక కనిపించలేదు. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులను నటీనటులు గర్వంగా భావించేవారు. వీటికి టాలీవుడ్ ఆస్కార్స్ అనే పేరుండేది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు దశాబ్దాల తరబడి ఈ నందుల ప్రధానం ఘనంగా జరిగేది. తర్వాత కొన్ని వివాదాలు, ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా ఆపేశారు. పునరుద్దరించే దిశగా ఎవరూ ఆలోచించలేదు కూడా. ఇప్పుడు స్వయానా స్టేట్ సిఎం చెప్పాక కూడా ప్రణాళిక రూపొందించుకోకపోతే నష్టమేమీ లేదు కానీ చేతులారా గౌరవాలు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. వీలైనంత త్వరగా మా అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సమాఖ్య సంయుక్తంగా దీనికి సంబందించిన కార్యాచరణకు పూనుకోవాలి. తక్కువ రోజుల్లో టాలీవుడ్ నుంచి ప్రాతినిధ్యం వెళ్ళాలి.

సైమా, ఫిలిం ఫేర్, ఈఫా అంటూ ప్రైవేట్ ఈవెంట్ల వేడుకలకు యెనలేని ఉత్సాహం చూపించే స్టార్లు గద్దర్ అవార్డులను కూడా అంతే గొప్పగా ఫీలవ్వాలి. ఆంధ్రప్రదేశ్ సర్కారు తరఫున డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా నంది అవార్డులను పునః ప్రారంభించే దిశగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు సూచన చేశారనే టాక్ వినిపించింది కానీ అదెంత వరకు నిజమో ఇంకొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది. ఒకప్పటి నంది వైభవం వెంటనే రాకపోవచ్చు కానీ క్రమంగా ప్రతి ఏడాది ఇచ్చుకుంటూ పోవడం వల్ల ప్రజల్లోనూ దాని పట్ల అవగాహన పెరుగుతుంది. చూడాలి మరి ఎవరు విన్నారో ఎవరు వస్తారో.

This post was last modified on July 31, 2024 11:30 am

Share
Show comments
Published by
Satya
Tags: Chiranjeevi

Recent Posts

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

47 minutes ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

3 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

4 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

4 hours ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

4 hours ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

5 hours ago