తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము ప్రకటించిన గద్దర్ అవార్డులకు పరిశ్రమ నుంచి స్పందన రాలేదని ఒక సభలో బహిరంగంగా చెప్పడంతో ఒలంపిక్స్ వేడుకల కోసం విదేశాల్లో ఉన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం నిన్న హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో కనుమరుగైపోయిన నంది పురస్కారాల స్థానంలో వీటిని ప్రవేశ పెడతామని చెప్పి నెలలు గడిచిపోయినా వాటికి సంబంధించిన చర్యలకు ఎలాంటి కదలిక కనిపించలేదు. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డులను నటీనటులు గర్వంగా భావించేవారు. వీటికి టాలీవుడ్ ఆస్కార్స్ అనే పేరుండేది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు దశాబ్దాల తరబడి ఈ నందుల ప్రధానం ఘనంగా జరిగేది. తర్వాత కొన్ని వివాదాలు, ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా ఆపేశారు. పునరుద్దరించే దిశగా ఎవరూ ఆలోచించలేదు కూడా. ఇప్పుడు స్వయానా స్టేట్ సిఎం చెప్పాక కూడా ప్రణాళిక రూపొందించుకోకపోతే నష్టమేమీ లేదు కానీ చేతులారా గౌరవాలు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. వీలైనంత త్వరగా మా అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సమాఖ్య సంయుక్తంగా దీనికి సంబందించిన కార్యాచరణకు పూనుకోవాలి. తక్కువ రోజుల్లో టాలీవుడ్ నుంచి ప్రాతినిధ్యం వెళ్ళాలి.
సైమా, ఫిలిం ఫేర్, ఈఫా అంటూ ప్రైవేట్ ఈవెంట్ల వేడుకలకు యెనలేని ఉత్సాహం చూపించే స్టార్లు గద్దర్ అవార్డులను కూడా అంతే గొప్పగా ఫీలవ్వాలి. ఆంధ్రప్రదేశ్ సర్కారు తరఫున డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా నంది అవార్డులను పునః ప్రారంభించే దిశగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు సూచన చేశారనే టాక్ వినిపించింది కానీ అదెంత వరకు నిజమో ఇంకొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది. ఒకప్పటి నంది వైభవం వెంటనే రాకపోవచ్చు కానీ క్రమంగా ప్రతి ఏడాది ఇచ్చుకుంటూ పోవడం వల్ల ప్రజల్లోనూ దాని పట్ల అవగాహన పెరుగుతుంది. చూడాలి మరి ఎవరు విన్నారో ఎవరు వస్తారో.
This post was last modified on July 31, 2024 11:30 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…