Movie News

50 వసంతాల బాలయ్య గోల్డెన్ జూబ్లీ

సినిమా రంగంలో అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందటం చిన్న విషయం కాదు. 1974లో తాత్తమ్మ కలతో బాలనటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఈ ఏడాదితో 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ తరఫున హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న ఘన సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వక్తలు రావడం, ప్రసంగాలు పొగడ్తలు చెప్పడం లాంటివి కాకుండా చాలా వినూత్నంగా ఎప్పటికీ నిలిచిపోయే రీతిలో గొప్పగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధ మహారథులతో అంగరంగ వైభవంగా జరగనుంది.

అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి హాజరు కాబోతున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో మొదలుపెట్టి సిద్దు జొన్నలగడ్డ లాంటి యూత్ హీరోల వరకు అందరికీ ఆహ్వానం వెళ్లబోతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత మూడు సార్లు ఏకధాటిగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సినీ నటుడిగా, 100 రోజుల నుంచి వెయ్యి రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ల హీరోగా ఎన్నో ఘనతలు సాధించిన బాలయ్య ఫ్యాన్స్ కు చిరకాల జ్ఞాపకం ఇవ్వబోతున్నారు.

అభిమానులు భారీ ఎత్తున తరలి రాబోతున్నట్టు తెలిసింది. బాలయ్య బ్లాక్ బస్టర్ పాటలకు నృత్యాలు, ఆయన సాధించిన మైలురాళ్ళకు సంబంధించిన విశేషాలు, పాత కొత్త తరం హీరోయిన్లు ఎందరో పాలు పంచుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళను సైతం ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసమే పిలిపించబోతున్నట్టు తెలిసింది. 109 సినిమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఆన్ స్టాపబుల్ షో ద్వారా ఓటిటిలోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో ఈ వేడుకలో భాగం కాబోతున్నారు. ఆహ్వాన పత్రికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.

This post was last modified on July 31, 2024 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ 22 : రంగం సిద్ధం

పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు రంగం…

35 minutes ago

మొదటి పరీక్షలో బుచ్చిబాబు మార్కులెన్ని

ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త…

2 hours ago

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల…

2 hours ago

కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…

2 hours ago

హ్యాండ్సప్!.. అమెరికా రోడ్డెక్కిన జనం!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……

2 hours ago