సినిమా రంగంలో అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందటం చిన్న విషయం కాదు. 1974లో తాత్తమ్మ కలతో బాలనటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఈ ఏడాదితో 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ తరఫున హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న ఘన సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వక్తలు రావడం, ప్రసంగాలు పొగడ్తలు చెప్పడం లాంటివి కాకుండా చాలా వినూత్నంగా ఎప్పటికీ నిలిచిపోయే రీతిలో గొప్పగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధ మహారథులతో అంగరంగ వైభవంగా జరగనుంది.
అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి హాజరు కాబోతున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో మొదలుపెట్టి సిద్దు జొన్నలగడ్డ లాంటి యూత్ హీరోల వరకు అందరికీ ఆహ్వానం వెళ్లబోతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత మూడు సార్లు ఏకధాటిగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సినీ నటుడిగా, 100 రోజుల నుంచి వెయ్యి రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ల హీరోగా ఎన్నో ఘనతలు సాధించిన బాలయ్య ఫ్యాన్స్ కు చిరకాల జ్ఞాపకం ఇవ్వబోతున్నారు.
అభిమానులు భారీ ఎత్తున తరలి రాబోతున్నట్టు తెలిసింది. బాలయ్య బ్లాక్ బస్టర్ పాటలకు నృత్యాలు, ఆయన సాధించిన మైలురాళ్ళకు సంబంధించిన విశేషాలు, పాత కొత్త తరం హీరోయిన్లు ఎందరో పాలు పంచుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళను సైతం ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసమే పిలిపించబోతున్నట్టు తెలిసింది. 109 సినిమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఆన్ స్టాపబుల్ షో ద్వారా ఓటిటిలోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో ఈ వేడుకలో భాగం కాబోతున్నారు. ఆహ్వాన పత్రికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.
This post was last modified on July 31, 2024 3:42 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…