Movie News

50 వసంతాల బాలయ్య గోల్డెన్ జూబ్లీ

సినిమా రంగంలో అర్ధ శతాబ్దం పైగా కొనసాగుతూ ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందటం చిన్న విషయం కాదు. 1974లో తాత్తమ్మ కలతో బాలనటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఈ ఏడాదితో 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ తరఫున హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న ఘన సన్మానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వక్తలు రావడం, ప్రసంగాలు పొగడ్తలు చెప్పడం లాంటివి కాకుండా చాలా వినూత్నంగా ఎప్పటికీ నిలిచిపోయే రీతిలో గొప్పగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సినీ రాజకీయ రంగాలకు చెందిన అతిరధ మహారథులతో అంగరంగ వైభవంగా జరగనుంది.

అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి హాజరు కాబోతున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో మొదలుపెట్టి సిద్దు జొన్నలగడ్డ లాంటి యూత్ హీరోల వరకు అందరికీ ఆహ్వానం వెళ్లబోతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత మూడు సార్లు ఏకధాటిగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సినీ నటుడిగా, 100 రోజుల నుంచి వెయ్యి రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ల హీరోగా ఎన్నో ఘనతలు సాధించిన బాలయ్య ఫ్యాన్స్ కు చిరకాల జ్ఞాపకం ఇవ్వబోతున్నారు.

అభిమానులు భారీ ఎత్తున తరలి రాబోతున్నట్టు తెలిసింది. బాలయ్య బ్లాక్ బస్టర్ పాటలకు నృత్యాలు, ఆయన సాధించిన మైలురాళ్ళకు సంబంధించిన విశేషాలు, పాత కొత్త తరం హీరోయిన్లు ఎందరో పాలు పంచుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళను సైతం ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసమే పిలిపించబోతున్నట్టు తెలిసింది. 109 సినిమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఆన్ స్టాపబుల్ షో ద్వారా ఓటిటిలోనూ తనదైన ముద్ర వేసిన బాలకృష్ణతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో ఈ వేడుకలో భాగం కాబోతున్నారు. ఆహ్వాన పత్రికలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.

This post was last modified on July 31, 2024 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago