ఇంకో రెండు రోజుల్లో అతివృష్టి రిలీజులతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఉక్కిరిబిక్కరి కాబోతోంది. కల్కి 2898 ఏడి తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కనీస స్థాయిలో ఆడకపోవడంతో నెలరోజులకు పైగా ప్రభాస్ మూవీతోనే నెట్టుకొచ్చిన థియేటర్లు ఇప్పుడు కొత్త వాటి మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాయి.స్టార్ హీరోలవి లేకపోయినా అన్నీ కంటెంట్ నమ్ముకున్నవి కావడంతో మౌత్ టాక్ బాగా వస్తే జనం థియేటర్లకు వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. అశ్విన్ బాబు ‘శివం భజే’ ఒక రోజు ముందే ఆగస్ట్ 1 గురువారం రావడం ద్వారా తెలివైన ఎత్తుగడ వేసింది. మైథలాజి ముడిపెట్టిన క్రైమ్ థ్రిల్లర్ గా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఇక అసలు జాతర ఆగస్ట్ 2 ఉంటుంది. అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత ‘బడ్డీ’తో వస్తున్నాడు. రెండు వారాలుగా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తూ తనకు తానే పిఆర్ గా మారి పబ్లిసిటీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. పది రోజుల ముందే ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్లు వేశారు. రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామీ’ మీద పెద్దగా అంచనాల్లేవ్ కానీ మాస్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకుని పురుషోత్తముడు వచ్చిన వారానికే రెడీ అయిపోయి ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ ఆంటోనీ ‘తుఫాను’ కోసం హీరో హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బిచ్చగాడు తప్ప ఇంకే సక్సెస్ లేని నేపథ్యంలో ఇదో పెద్ద సవాలే.
దర్శకుడు కె విజయభాస్కర్ కొడుకు శ్రీకమల్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ‘ఉషా పరిణయం’ అదే రోజు రానుంది. పట్టువదలని విక్రమార్కుడిగా సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్ ‘విరాజి’ తో పలకరించబోతున్నాడు. చిన్న సినిమానే అయినా ‘అలనాటి రామచంద్రుడు’ సైతం హోమ్లీ టైటిల్ తో కుటుంబ ప్రేక్షకులకు గాలం వేస్తోంది. యావరేజ్ స్టూడెంట్ నాని, లారీ అంటూ మరికొన్ని చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ ‘ఉల్లజ్’తో పాటు అజయ్ దేవగన్ ‘ఔరోన్ మే కహా ధం తా’ బరిలో ఉన్నాయి. ఇంత తాకిడిలో విజేతలు ఎవరవుతారో చూడాలి.
This post was last modified on July 31, 2024 12:03 pm
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…