Movie News

తమిళ ఇండస్ట్రీలో అగ్గి రాజుకుంది

తమిళ నిర్మాతల మండలి తాజాగా తీసుకున్న నిర్ణయాల మీద ఆ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో కూడా చర్చ జరుగుతోంది. నిర్మాతల దగ్గర భారీ స్థాయిలో అడ్వాన్సులు తీసుకుని.. ఆ చిత్రాలను ముందుకు తీసుకెళ్లకుండా వేరే ప్రాజెక్టులు కమిటవడం.. కొందరు నిర్మాతలకు ఎంతకీ సినిమాలు చేయకపోవడం లాంటి చర్యలను ఖండిస్తూ కొన్ని సంచలన తీర్మానాలు చేసింది కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టడమే కాక.. కొత్త చిత్రాలు మొదలుపెట్టడానికి వీల్లేదని కూడా తేల్చేశారు.

ప్రధానంగా ధనుష్ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్రుగా ఉంది. తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ముందు తమను సంప్రదించాలని స్పష్టం చేసింది. మరోవైపు హీరో విశాల్ వ్యవహార శైలి మీద కూడా నిర్మాతల మండలి ఆగ్రహంతో ఉంది. కొంత కాలంగా కౌన్సిల్‌కు, విశాల్‌కు మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ధనుష్‌తో పాటు విశాల్ మీద నిషేధం విధించే ఆలోచన కూడా నిర్మాతల మండలి చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ కార్యదర్శిగా, నాజర్ అధ్యక్షుడిగా ఉన్న నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశం నిర్వహించిన నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. నటులతో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ.. ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, షూటింగ్‌లు ఎలా ఆపేస్తారు, ఫలానా టైంలోపు సినిమాలు పూర్తి చేయాలని ఎలా కండిషన్లు పెడతారు అని నడిగర్ సంఘం ప్రశ్నిస్తోంది.

ఈ విషయంలో నిర్మాతల మండలి మీద పోరడడానికి నడిగర్ సంఘం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ఎక్కడిదాాకా వెళ్తుందో అన్న చర్చ కోలీవుడ్లో నడుస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని నిర్మాతలు, నటుల మధ్య సయోధ్య కుదర్చకుంటే సమస్య జఠిలమయ్యేలా ఉంది.

This post was last modified on July 30, 2024 1:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాదీలు… 100 కోట్ల విల్లా కొంటారా?

ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లు సైతం కోటి.. అంత‌కంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వ‌చ్చేశాయి. ధ‌ర‌లు అంత‌గా…

1 hour ago

కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…

2 hours ago

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

5 hours ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

6 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

9 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

10 hours ago