తమిళ నిర్మాతల మండలి తాజాగా తీసుకున్న నిర్ణయాల మీద ఆ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో కూడా చర్చ జరుగుతోంది. నిర్మాతల దగ్గర భారీ స్థాయిలో అడ్వాన్సులు తీసుకుని.. ఆ చిత్రాలను ముందుకు తీసుకెళ్లకుండా వేరే ప్రాజెక్టులు కమిటవడం.. కొందరు నిర్మాతలకు ఎంతకీ సినిమాలు చేయకపోవడం లాంటి చర్యలను ఖండిస్తూ కొన్ని సంచలన తీర్మానాలు చేసింది కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టడమే కాక.. కొత్త చిత్రాలు మొదలుపెట్టడానికి వీల్లేదని కూడా తేల్చేశారు.
ప్రధానంగా ధనుష్ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్రుగా ఉంది. తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ముందు తమను సంప్రదించాలని స్పష్టం చేసింది. మరోవైపు హీరో విశాల్ వ్యవహార శైలి మీద కూడా నిర్మాతల మండలి ఆగ్రహంతో ఉంది. కొంత కాలంగా కౌన్సిల్కు, విశాల్కు మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ధనుష్తో పాటు విశాల్ మీద నిషేధం విధించే ఆలోచన కూడా నిర్మాతల మండలి చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ కార్యదర్శిగా, నాజర్ అధ్యక్షుడిగా ఉన్న నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశం నిర్వహించిన నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. నటులతో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ.. ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, షూటింగ్లు ఎలా ఆపేస్తారు, ఫలానా టైంలోపు సినిమాలు పూర్తి చేయాలని ఎలా కండిషన్లు పెడతారు అని నడిగర్ సంఘం ప్రశ్నిస్తోంది.
ఈ విషయంలో నిర్మాతల మండలి మీద పోరడడానికి నడిగర్ సంఘం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ఎక్కడిదాాకా వెళ్తుందో అన్న చర్చ కోలీవుడ్లో నడుస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని నిర్మాతలు, నటుల మధ్య సయోధ్య కుదర్చకుంటే సమస్య జఠిలమయ్యేలా ఉంది.
This post was last modified on July 30, 2024 1:57 pm
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు…
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్…
బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార…
పెద్ద బడ్జెట్లలో తీసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఆ హైప్కు తగ్గట్లు మంచి ఓపెనింగ్సూ…
అభిమానులందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు అని చెప్పొచ్చు. పవన్ ఎంచుకునే కొన్ని సినిమాల విషయంలో వాళ్ల…
కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ…