Movie News

తమిళ ఇండస్ట్రీలో అగ్గి రాజుకుంది

తమిళ నిర్మాతల మండలి తాజాగా తీసుకున్న నిర్ణయాల మీద ఆ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో కూడా చర్చ జరుగుతోంది. నిర్మాతల దగ్గర భారీ స్థాయిలో అడ్వాన్సులు తీసుకుని.. ఆ చిత్రాలను ముందుకు తీసుకెళ్లకుండా వేరే ప్రాజెక్టులు కమిటవడం.. కొందరు నిర్మాతలకు ఎంతకీ సినిమాలు చేయకపోవడం లాంటి చర్యలను ఖండిస్తూ కొన్ని సంచలన తీర్మానాలు చేసింది కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టడమే కాక.. కొత్త చిత్రాలు మొదలుపెట్టడానికి వీల్లేదని కూడా తేల్చేశారు.

ప్రధానంగా ధనుష్ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్రుగా ఉంది. తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ముందు తమను సంప్రదించాలని స్పష్టం చేసింది. మరోవైపు హీరో విశాల్ వ్యవహార శైలి మీద కూడా నిర్మాతల మండలి ఆగ్రహంతో ఉంది. కొంత కాలంగా కౌన్సిల్‌కు, విశాల్‌కు మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ధనుష్‌తో పాటు విశాల్ మీద నిషేధం విధించే ఆలోచన కూడా నిర్మాతల మండలి చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ కార్యదర్శిగా, నాజర్ అధ్యక్షుడిగా ఉన్న నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశం నిర్వహించిన నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. నటులతో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ.. ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, షూటింగ్‌లు ఎలా ఆపేస్తారు, ఫలానా టైంలోపు సినిమాలు పూర్తి చేయాలని ఎలా కండిషన్లు పెడతారు అని నడిగర్ సంఘం ప్రశ్నిస్తోంది.

ఈ విషయంలో నిర్మాతల మండలి మీద పోరడడానికి నడిగర్ సంఘం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ఎక్కడిదాాకా వెళ్తుందో అన్న చర్చ కోలీవుడ్లో నడుస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని నిర్మాతలు, నటుల మధ్య సయోధ్య కుదర్చకుంటే సమస్య జఠిలమయ్యేలా ఉంది.

This post was last modified on July 30, 2024 1:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago