Movie News

దీపిక ఆ వాట్సాప్ చాట్‌ను డెలీట్ చేసినా సరే..

బాలీవుడ్‌ను కుదిపేస్తోంది డ్రగ్స్ కేసు. దీని ఉచ్చులో ప్రముఖ తారలు చిక్కుకున్నారు. అందులో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఈ స్టార్ హీరోయిన్‌కు డ్రగ్స్ అలవాటుందని.. తన మేనేజర్ ద్వారా వాటిని తెప్పించుకునేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించడం.. దీపికను విచారణకు కూడా పిలవడం, శనివారం ఆమె విచారణకు హాజరవుతుండటం తెలిసిన సంగతే.

దీపిక, ఆమె మేనేజర్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా ఆమె డ్రగ్స్ వాడేదని తెలిసిందని ఎన్సీబీ అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఎన్సీబీ అధికారులకు ఎలా చేరిందన్నది ప్రశ్న. ఇదే కాదు.. బాలీవుడ్లో పలువురు తారలు డ్రగ్స్‌కు సంబంధించి చేసిన వాట్సాప్ సంభాషణల్ని ఎన్సీబీ అధికారులు యాక్సెస్ చేశారట. నిజానికి ఆ చాట్స్ అన్నీ కూడా ఎప్పుడో చేసినవని, పైగా డెలీట్ అయిపోయినవి.

అయినా సరే.. అధికారులు వాటిని రిట్రీవ్ చేయడం విశేషం. ఇదంతా అధునాతన సాంకేతికత ద్వారా సాధ్యమైంది. మనం వాట్సాప్‌లో డెలీట్ చేసిన సంభాషణల్ని కూడా చాలా రోజుల తర్వాత బయటికి తీయగల టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రభుత్వ సంస్థలు అనుకుంటే ఆ పని చేయగలవు. ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వాట్సాప్ సర్వర్ల ద్వారా ఈ డెలీటెడ్ చాట్స్‌ను వెలికి తీసినట్లు సమాచారం. అలాగే మొబైళ్లలో చాట్స్ డెలీట్ అయినప్పటికీ గూగుల్ డ్రైవ్, క్లౌడ్ లాంటి వాటిలో ఉన్న బ్యాకప్‌ను రిట్రీవ్ చేయడం ద్వారా కూడా సమాచారాన్ని వెలికి తీశారట.

డ్రగ్స్ రాకెట్ బయటపడి.. విచారణ సాగుతున్న నేపథ్యంలో చాలామంది బాలీవుడ్ తారలు ఇలాగే పాత చాట్‌లను డెలీట్ చేసేస్తుండగా.. వాటిని రిట్రీవ్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగిన అధికారులు.. వాళ్లకు షాకిస్తున్నారు. కాబట్టి వాట్సాప్ వాడేవాళ్లందరూ కూడా ఈ పరిణామాలు చూసి జాగ్రత్త పడాల్సిందే. వాట్సాప్ చాట్‌లు డెలీట్ చేసేశాం అనుకుంటే చేసిన తప్పులు తర్వాత అయినా బయటపడొచ్చు. కాబట్టి జాగ్రత్త.

This post was last modified on September 25, 2020 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

19 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago