బాలీవుడ్ను కుదిపేస్తోంది డ్రగ్స్ కేసు. దీని ఉచ్చులో ప్రముఖ తారలు చిక్కుకున్నారు. అందులో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఈ స్టార్ హీరోయిన్కు డ్రగ్స్ అలవాటుందని.. తన మేనేజర్ ద్వారా వాటిని తెప్పించుకునేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించడం.. దీపికను విచారణకు కూడా పిలవడం, శనివారం ఆమె విచారణకు హాజరవుతుండటం తెలిసిన సంగతే.
దీపిక, ఆమె మేనేజర్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా ఆమె డ్రగ్స్ వాడేదని తెలిసిందని ఎన్సీబీ అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఎన్సీబీ అధికారులకు ఎలా చేరిందన్నది ప్రశ్న. ఇదే కాదు.. బాలీవుడ్లో పలువురు తారలు డ్రగ్స్కు సంబంధించి చేసిన వాట్సాప్ సంభాషణల్ని ఎన్సీబీ అధికారులు యాక్సెస్ చేశారట. నిజానికి ఆ చాట్స్ అన్నీ కూడా ఎప్పుడో చేసినవని, పైగా డెలీట్ అయిపోయినవి.
అయినా సరే.. అధికారులు వాటిని రిట్రీవ్ చేయడం విశేషం. ఇదంతా అధునాతన సాంకేతికత ద్వారా సాధ్యమైంది. మనం వాట్సాప్లో డెలీట్ చేసిన సంభాషణల్ని కూడా చాలా రోజుల తర్వాత బయటికి తీయగల టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రభుత్వ సంస్థలు అనుకుంటే ఆ పని చేయగలవు. ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వాట్సాప్ సర్వర్ల ద్వారా ఈ డెలీటెడ్ చాట్స్ను వెలికి తీసినట్లు సమాచారం. అలాగే మొబైళ్లలో చాట్స్ డెలీట్ అయినప్పటికీ గూగుల్ డ్రైవ్, క్లౌడ్ లాంటి వాటిలో ఉన్న బ్యాకప్ను రిట్రీవ్ చేయడం ద్వారా కూడా సమాచారాన్ని వెలికి తీశారట.
డ్రగ్స్ రాకెట్ బయటపడి.. విచారణ సాగుతున్న నేపథ్యంలో చాలామంది బాలీవుడ్ తారలు ఇలాగే పాత చాట్లను డెలీట్ చేసేస్తుండగా.. వాటిని రిట్రీవ్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగిన అధికారులు.. వాళ్లకు షాకిస్తున్నారు. కాబట్టి వాట్సాప్ వాడేవాళ్లందరూ కూడా ఈ పరిణామాలు చూసి జాగ్రత్త పడాల్సిందే. వాట్సాప్ చాట్లు డెలీట్ చేసేశాం అనుకుంటే చేసిన తప్పులు తర్వాత అయినా బయటపడొచ్చు. కాబట్టి జాగ్రత్త.
This post was last modified on September 25, 2020 4:03 pm
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…