Movie News

కంగువ ముగింపులో కాష్మోరా ప్రవేశం

ఇంకా రెండు నెలలకు పైగానే సమయమున్నప్పటికీ కంగువ మీద అంచనాలు అప్పుడే ఓ రేంజ్ లో ఉన్నాయి. రెండేళ్లకు పైగా గ్యాప్ తో సూర్య నటించిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ ని నిర్మాత జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున ఆశిస్తున్నారు. అక్టోబర్ 10 దసరా కానుకగా రిలీజవుతున్న ఈ విజువల్ గ్రాండియర్ లో దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య రెండు కాలాలకు సంబంధించిన వీరుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

కంగువలో చాలా సర్ప్రైజులు ఉంటాయట. ముఖ్యంగా అన్నదమ్ములు సూర్య, కార్తీ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలిందని చెన్నై టాక్. క్లైమాక్స్ చివరి ఘట్టంలో కార్తీ ఎంట్రీ ఉంటుందని, పార్ట్ 2కి లీక్ ఇచ్చే ముఖ్యమైన ట్విస్టు తన చుట్టే అల్లారని తెలిసింది. అంటే కాష్మోరాగా వస్తాడా లేక ఖైదీ ఢిల్లీగా కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ సూర్య కూడా రోలెక్స్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీని ఎంతైనా వాడుకోవచ్చు. దర్శకుడు సిరుతై శివ చాలా ప్రత్యేకంగా ఈ ఇద్దరి పాత్రలను డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.

సో ముఖ్యమైన లీకు బయటికి వచ్చేసింది కాబట్టి హైప్ మరింత పెరగడం ఖాయం. నెల రోజులు పూర్తిగా ప్రమోషన్ల కోసమే కేటాయించబోతున్న కంగువ టీమ్ దీన్ని బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో పబ్లిసిటీ చేయాలని చూస్తున్నారు. కేరళ, కర్ణాటకలో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు వేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఫైర్ సాంగ్ ఇటీవలే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర వెర్షన్లలో వస్తున్న కంగువకు రెండో భాగం 2026 లేదా ఆపై ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

This post was last modified on July 29, 2024 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago