ఇంకా రెండు నెలలకు పైగానే సమయమున్నప్పటికీ కంగువ మీద అంచనాలు అప్పుడే ఓ రేంజ్ లో ఉన్నాయి. రెండేళ్లకు పైగా గ్యాప్ తో సూర్య నటించిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ ని నిర్మాత జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున ఆశిస్తున్నారు. అక్టోబర్ 10 దసరా కానుకగా రిలీజవుతున్న ఈ విజువల్ గ్రాండియర్ లో దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య రెండు కాలాలకు సంబంధించిన వీరుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
కంగువలో చాలా సర్ప్రైజులు ఉంటాయట. ముఖ్యంగా అన్నదమ్ములు సూర్య, కార్తీ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలిందని చెన్నై టాక్. క్లైమాక్స్ చివరి ఘట్టంలో కార్తీ ఎంట్రీ ఉంటుందని, పార్ట్ 2కి లీక్ ఇచ్చే ముఖ్యమైన ట్విస్టు తన చుట్టే అల్లారని తెలిసింది. అంటే కాష్మోరాగా వస్తాడా లేక ఖైదీ ఢిల్లీగా కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ సూర్య కూడా రోలెక్స్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీని ఎంతైనా వాడుకోవచ్చు. దర్శకుడు సిరుతై శివ చాలా ప్రత్యేకంగా ఈ ఇద్దరి పాత్రలను డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.
సో ముఖ్యమైన లీకు బయటికి వచ్చేసింది కాబట్టి హైప్ మరింత పెరగడం ఖాయం. నెల రోజులు పూర్తిగా ప్రమోషన్ల కోసమే కేటాయించబోతున్న కంగువ టీమ్ దీన్ని బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో పబ్లిసిటీ చేయాలని చూస్తున్నారు. కేరళ, కర్ణాటకలో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు వేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఫైర్ సాంగ్ ఇటీవలే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర వెర్షన్లలో వస్తున్న కంగువకు రెండో భాగం 2026 లేదా ఆపై ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on July 29, 2024 2:31 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…