Movie News

అల్లరోడి నుంచి ఒక ప్రామిసింగ్ మూవీ

టాలీవుడ్లో ఇండస్ట్రీ జనాలే కాక ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడే హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు అతను కామెడీ సినిమాలతో అంతగా నవ్వించాడు మరి. అంతే కాక తన ప్రవర్తన కూడా చాలా హుందాగా ఉంటుంది. వివాదాలకు పూర్తి దూరంగా ఉంటాడు. అందుకే అతను అందరికీ ఇష్టుడు.

అల్లరోడు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంటే అందరూ బాధపడ్డవాళ్లే. తనకు ‘నాంది’ సినిమాతో మళ్లీ ఓ మంచి సక్సెస్ వస్తే అందరూ అంత సంతోషించారు కూడా. కానీ ఆ సక్సెస్‌ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా చివరి మూడు చిత్రాలూ నిరాశపరిచాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ‘బచ్చల మల్లి’ మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోలు బాగానే ఉన్నాయి.

ఐతే ‘బచ్చల మల్లి’ కంటే కూడా నరేష్ చేయబోయే కొత్త సినిమా ఇంకా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఆ చిత్రం శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే వెరైటీ థ్రిల్లర్ మూవీ తీసి మెప్పించిన మెహర్ తేజ్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.

నరేష్ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. పెద్ద బేనర్లలో తనకు ఛాన్సులు రావట్లేదు. సితార లాంటి బేనర్లకు ఉన్న గుడ్ విల్ వల్ల సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తారు. ‘ఫ్యామిలీ డ్రామ’ తీసిన దర్శకుడంటే నరేష్ నుంచి ఒక వెరైటీ సినిమాను కూడా ఆశించవచ్చు. కాబట్టి ఈ చిత్రంతో అల్లరోడి దశ తిరుగుతుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటించనుంది.

This post was last modified on July 27, 2024 6:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago