టాలీవుడ్లో ఇండస్ట్రీ జనాలే కాక ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడే హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు అతను కామెడీ సినిమాలతో అంతగా నవ్వించాడు మరి. అంతే కాక తన ప్రవర్తన కూడా చాలా హుందాగా ఉంటుంది. వివాదాలకు పూర్తి దూరంగా ఉంటాడు. అందుకే అతను అందరికీ ఇష్టుడు.
అల్లరోడు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంటే అందరూ బాధపడ్డవాళ్లే. తనకు ‘నాంది’ సినిమాతో మళ్లీ ఓ మంచి సక్సెస్ వస్తే అందరూ అంత సంతోషించారు కూడా. కానీ ఆ సక్సెస్ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా చివరి మూడు చిత్రాలూ నిరాశపరిచాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ‘బచ్చల మల్లి’ మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోలు బాగానే ఉన్నాయి.
ఐతే ‘బచ్చల మల్లి’ కంటే కూడా నరేష్ చేయబోయే కొత్త సినిమా ఇంకా ప్రామిసింగ్గా కనిపిస్తోంది. ఆ చిత్రం శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే వెరైటీ థ్రిల్లర్ మూవీ తీసి మెప్పించిన మెహర్ తేజ్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.
నరేష్ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. పెద్ద బేనర్లలో తనకు ఛాన్సులు రావట్లేదు. సితార లాంటి బేనర్లకు ఉన్న గుడ్ విల్ వల్ల సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తారు. ‘ఫ్యామిలీ డ్రామ’ తీసిన దర్శకుడంటే నరేష్ నుంచి ఒక వెరైటీ సినిమాను కూడా ఆశించవచ్చు. కాబట్టి ఈ చిత్రంతో అల్లరోడి దశ తిరుగుతుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటించనుంది.
This post was last modified on July 27, 2024 6:46 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…