దర్శకుడిగా మొదట చేసే ప్రాజెక్టు ఒక స్థాయిలో ఉంటేనే తర్వాత ఇండస్ట్రీలో మంచి మంచి ఛాన్సులు వస్తాయని చాలామంది అనుకుంటారు. అందుకే చిన్నా చితకా ప్రాజెక్టులు చేయడానికి మనసొప్పదు. కానీ టాలెంట్ ఉండాలే కానీ.. చిన్న ప్రాజెక్టుల్లో కూడా ప్రతిభ చాటుకోవచ్చు. వాటిని పెద్ద హిట్ చేసి తర్వాత క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశం అందుకోవచ్చు. ఇందుకు ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్ ఉదంతమే ఉదాహరణ.
అసలు లైమ్ లైట్లో లేని శివాజీని ప్రధాన పాత్రలో పెట్టి.. చాలా తక్కువ బడ్జెట్లో ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ తీశాడు ఆదిత్య. ఆ సిరీస్ చూస్తే పేరున్న ఆర్టిస్టులూ కనిపించరు. పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమీ ఉండవు. కానీ కంటెంట్తో అందరినీ మెప్పించి దీన్ని మోస్ట్ లవ్డ్ వెబ్ సిరీస్గా మార్చాడు ఆదిత్య.
దీంతో ఆదిత్యకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్కు డైలాగ్స్ రాసి మెప్పించిన ఆదిత్య.. ప్రస్తుతం నైంటీస్ మిడిల్ క్లాస్ సెకండ్ సీజన్ తీస్తున్నాడు. ఈలోపు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నట్లు సమాచారం. ముందుగా అతను యూత్ స్టార్ నితిన్తో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’తో పాటు ‘తమ్ముుడు’ చిత్రంలో నటిస్తున్న నితిన్.. ఇంకో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడు. అందులో ఒకటి ‘ఇష్క్’ తర్వాత మళ్లీ విక్రమ్ కుమార్తో చేయబోయే చిత్రం. ఇంకోటి ఆదిత్య హాసన్ మూవీ అట. దీన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. స్క్రిప్టు ఓకే అయిందని.. నితిన్, ఆదిత్య ఇద్దరూ ఖాళీ అయ్యాక ఈ సినిమా చేస్తారని సమాచారం. వెబ్ సిరీస్తో మెప్పించిన ఆదిత్య.. సినిమాతోనూ సక్సెస్ కొడితే టాలీవుడ్లో బిజీ డైరెక్టర్లలో ఒకడైపోతానడంంలో సందేహం లేదు.
This post was last modified on July 25, 2024 3:10 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…