సమయానుకూలంగా వ్యవహరిస్తేనే ఇండస్ట్రీలో మనుగడ సాధ్యమనే సత్యం అందరికీ తెలిసిందే. దాన్ని సరిగ్గా పాటించే వాళ్లే తక్కువ. రెండు వరస డిజాస్టర్ల తర్వాత యూత్ హీరో కిరణ్ అబ్బవరం మార్కెట్ రిస్క్ లో పడిన మాట వాస్తవం. దీనికి తోడు సోషల్ మీడియా ట్రోలింగ్ ఇమేజ్ మీద కొంత మరక పడేలా చేసింది. వేగంగా సినిమాలు చేయడమే తప్పించి క్వాలిటీ చూసుకోవడం లేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. అందుకే నిర్మాణంలో ఉన్న వాటి రిలీజుల విషయంలో కిరణ్ తీసుకున్న నిర్ణయాలు తెలివైన ఫలితాలు అందిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ.
విడుదలకు సిద్ధంగా ఉన్న కిరణ్ అబ్బవరం సినిమాల్లో ముందుగా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవడానికి అవకాశమున్నది దిల్ రుబా. కానీ ఇది లవ్ ఎంటర్ టైనర్. ఒకవేళ సినిమా ఎంత బాగున్నా ఓపెనింగ్స్ రాకపోతే వసూళ్ళ పరంగా ఇబ్బందవుతుంది. కానీ ‘క’ అలా కాదు. పీరియాడిక్ థ్రిల్లర్. మంచి స్కోప్ ఉన్న కంటెంట్. దశాబ్దాల వెనుక ఒక పోస్ట్ మ్యాన్ జీవితంలో ఒక గ్రామంలో జరిగిన అనూహ్య సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్నారు. అందుకే తానే నిర్మాతగా మారి బడ్జెట్ రిస్క్ అవుతున్నా సరే ఖర్చు పెట్టి మరీ ఒక కొత్త ప్రయోగం చేశాడు.
కట్ చేస్తే టీజర్ వచ్చాక ‘క’ మీద అంచనాలు పెరిగిపోయాయి. థియేట్రికల్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోయిన వార్త డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే కిరణ్ మీద ఇంత మొత్తం అంత సులభంగా పెట్టలేరు. కానీ క టీజర్ వల్ల ఇదేదో విరూపాక్ష రేంజ్ లో ఆడే బొమ్మనే నమ్మకం బయ్యర్లలో వచ్చేసింది. ఎంతవరకు నిజమో నిర్ధారణ కావాల్సి ఉంది కానీ నాన్ థియేట్రికల్ నుంచి మరో 18 కోట్లు వచ్చాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఈ ప్యాన్ ఇండియా మూవీ కనక హిట్ అయితే దిల్ రుబాకు ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే రెట్టింపు లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం.
This post was last modified on July 25, 2024 3:06 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…