సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్ట్ 9 హీరో పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉంటుందేనని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం జక్కన్న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడని సమాచారం. మహేష్ లుక్కు కోసం ఒక ఫోటో షూట్ చేశారట కానీ ఇంకా ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక స్క్రిప్ట్ దాదాపు లాకైపోయింది. దానికి సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఎస్ఎస్ఎంబి 29 కథలోని కీలకమైన పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైన జంతువులు, పరిస్థితుల మధ్య హీరో చేసే వేట మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు. ఇలాంటి స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు మంచి ఉదాహరణ. అయితే వాటిలో లేని ఒక విభిన్నమైన ఫాంటసీ టచ్ ని విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారని తెలిసింది. దాని తాలూకు విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశారట. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దాన్ని తలదన్నేలా ప్లాన్ చేశారట.
అంతే కాదు ముందు అనుకున్న మహారాజ టైటిల్ విజయ్ సేతుపతి వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త పేరు కోసం అన్వేషణ జరుగుతోందని తెలిసింది. వాటిలో గోల్డ్ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే అక్షయ కుమార్ దీన్ని ఆ మధ్య పెట్టేసుకున్నాడు కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మహేష్ బాబు కనీసం రెండు నుంచి మూడేళ్లు దీని కోసం త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రభాస్ కి బాహుబలి ఎలా నిలిచిపోయిందో మహేష్ కు ఈ జక్కన్న మూవీ అంతకు పదిరెట్లు ఎలివేట్ చేసేలా మేకింగ్ ఉంటుందట.
This post was last modified on July 25, 2024 12:50 pm
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…
ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా అందుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను ప్రభుత్వానికి మంచి మార్కులే వేస్తోంది.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం రాత్రి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో ఉపయుక్తంగా భావిస్తున్న…
హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…