సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్ట్ 9 హీరో పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉంటుందేనని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం జక్కన్న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడని సమాచారం. మహేష్ లుక్కు కోసం ఒక ఫోటో షూట్ చేశారట కానీ ఇంకా ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక స్క్రిప్ట్ దాదాపు లాకైపోయింది. దానికి సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఎస్ఎస్ఎంబి 29 కథలోని కీలకమైన పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైన జంతువులు, పరిస్థితుల మధ్య హీరో చేసే వేట మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు. ఇలాంటి స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు మంచి ఉదాహరణ. అయితే వాటిలో లేని ఒక విభిన్నమైన ఫాంటసీ టచ్ ని విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారని తెలిసింది. దాని తాలూకు విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశారట. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దాన్ని తలదన్నేలా ప్లాన్ చేశారట.
అంతే కాదు ముందు అనుకున్న మహారాజ టైటిల్ విజయ్ సేతుపతి వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త పేరు కోసం అన్వేషణ జరుగుతోందని తెలిసింది. వాటిలో గోల్డ్ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే అక్షయ కుమార్ దీన్ని ఆ మధ్య పెట్టేసుకున్నాడు కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మహేష్ బాబు కనీసం రెండు నుంచి మూడేళ్లు దీని కోసం త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రభాస్ కి బాహుబలి ఎలా నిలిచిపోయిందో మహేష్ కు ఈ జక్కన్న మూవీ అంతకు పదిరెట్లు ఎలివేట్ చేసేలా మేకింగ్ ఉంటుందట.
This post was last modified on July 25, 2024 12:50 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…