సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్ట్ 9 హీరో పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉంటుందేనని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం జక్కన్న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడని సమాచారం. మహేష్ లుక్కు కోసం ఒక ఫోటో షూట్ చేశారట కానీ ఇంకా ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక స్క్రిప్ట్ దాదాపు లాకైపోయింది. దానికి సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఎస్ఎస్ఎంబి 29 కథలోని కీలకమైన పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైన జంతువులు, పరిస్థితుల మధ్య హీరో చేసే వేట మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు. ఇలాంటి స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు మంచి ఉదాహరణ. అయితే వాటిలో లేని ఒక విభిన్నమైన ఫాంటసీ టచ్ ని విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారని తెలిసింది. దాని తాలూకు విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశారట. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దాన్ని తలదన్నేలా ప్లాన్ చేశారట.
అంతే కాదు ముందు అనుకున్న మహారాజ టైటిల్ విజయ్ సేతుపతి వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త పేరు కోసం అన్వేషణ జరుగుతోందని తెలిసింది. వాటిలో గోల్డ్ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే అక్షయ కుమార్ దీన్ని ఆ మధ్య పెట్టేసుకున్నాడు కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మహేష్ బాబు కనీసం రెండు నుంచి మూడేళ్లు దీని కోసం త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రభాస్ కి బాహుబలి ఎలా నిలిచిపోయిందో మహేష్ కు ఈ జక్కన్న మూవీ అంతకు పదిరెట్లు ఎలివేట్ చేసేలా మేకింగ్ ఉంటుందట.
This post was last modified on July 25, 2024 12:50 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…